కడప: పుష్పగిరి క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు 11 రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈనెల 20న చందనోత్సవం, 21న గరుడవాహనం, 22న కల్యాణం, 23 రధోత్సవం నిర్వహిస్తారు. వెయ్యిసంవత్సరాల పురాతత్వ విశేషం కలిగిన పుష్పగిరిలో బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు వల్లూరు మండల అధికారులు, పుష్పగిరి మఠం వర్గాలు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఉత్సవాల్లో తొలిసారిగా ఏడు అంశాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్టస్థ్రాయి పోటీలు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. గ్రామీణ క్రీడలు, మేధోక్రీడలు, చిత్రలేఖన సాహిత్యం, సంస్కృతికి ప్రతిబింబాలుగా ఏడు అంశాలలో, […]పూర్తి వివరాలు ...
Tags :కబడ్డీ
కబడ్డీ సబ్జూనియర్స్ జాతీయస్థాయి చాంపియన్షిప్ పోటీలకు వీరపునాయునిపల్లె జూనియర్ కళాశాలలో చదువుతున్న ఎ.అపర్ణ, రైల్వేకోడూరు ఎస్.వి.జూనియర్ కళాశాలలో చదువుతున్న కె.ప్రశాంత్ ఎంపికైనట్లు జిల్లా కబడ్డీ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు సీఆర్ఐ సుబ్బారెడ్డి, చిదానందగౌడ తెలిపారు. గత నెల 16 నుంచి 19వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో జరిగిన 26వ సబ్జూనియర్స్ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీల్లో వీరు ప్రతిభ చూపడంతో మొదట ప్రాబబుల్స్కు ఎంపికచేశారన్నారు. కాకినాడలో అక్టోబరు 24 నుంచి నవంబరు 4వ తేదీ వరకు […]పూర్తి వివరాలు ...