ఎం.వి.రమణారెడ్డి గారు రాసి ప్రచురించిన ‘రాయలసీమ కన్నీటి గాథ’ ఈ-పుస్తకం. రాయలసీమ ఏ విధంగా వంచనకు గురయిందో తెలిపిన మొట్ట మొదటి పుస్తకం. రాయలనాటి వైభవంతో రతనాలసీమగా ఖ్యాతినొందిన రాయలసీమ జిల్లాలు నేడు కటిక దారిద్ర్యానికి శాశ్వత చిరునామాగా మారిపోయాయి. ఒకప్పటి అన్నదాత, నేడు గుక్కెడు నీటికోసం దీనంగా ఎదురుచూస్తున్నాడు. అంగళ్లలో రతనాలమ్మిన ఆ వైభవం రాయలతో పాటే గతించింది. ఆలనలేని నీటిపారుదల వసతులు, పాలనలేని రాయలసీమ ప్రజలు క్రమక్రమంగా శిథిలమౌతూ వచ్చారు.పూర్తి వివరాలు ...
Tags :ఎంవిరమణారెడ్డి
ఏనాడు చేసుకున్న సుకతమో ఫలించి, ఊహాతీతమైన చారిత్రక మలుపుతో, ఇన్నేళ్లుగా మనల్ని ముంచిన విశాలాంధ్ర విచ్ఛిన్నమయింది. శ్రీబాగ్ ఒడంబడిక మూలం గా నాడు రాయలసీమ వాసులకు కోస్తాంధ్ర నాయకులు ఒట్టేసి రాయించిన హమీలకు ప్రాణమిచ్చే భౌగోళిక స్వరూపం తిరిగి తెలుగునాడుకు ఏర్పడింది. తొలి బస్సు మిస్సయ్యాం. మిగిలిపోయిన రెండో బస్సునైనా అందుకోకుంటే సర్కార్ జిల్లాల ఉక్కుపాదం కింద మన జీవితం నలిగిపోవడం ఖాయం. వాళ్ళ సహవాసం ఇదివరకే చవిచూసినవాళ్ళం. తాగునీటి కోసం, సాగునీటి కోసం, బడుగు జీవితాల […]పూర్తి వివరాలు ...