ఉద్యోగుల సమైక్య సమ్మె నేపధ్యంలో రాయలసీమ తాప విద్యుత్ కేంద్రం(ఆర్టీపీపీ)లో మూడు రోజులుగా కరెంటు తయారీ ఆగిపోయింది. కడపతోపాటు, రాయలసీమలోని పలు జిల్లాలకు ఎంతో కీలకమైన ఈ కేంద్రం మూడు రోజులుగా పడకేసింది. అయిదు యూనిట్లలో 1,050 మెగావాట్ల కరెంటు తయారీ నిలిచిపోయింది. ఇంజినీర్లు, ఉద్యోగులంతా సమ్మె కారణంగా విధులకు హాజరుకామంటూ కరాఖండిగా చెబుతున్నారు. ఈ ప్రభావం జిల్లాఅంతటా స్పష్టంగా కనిపిస్తోంది. ట్రాన్స్కో, ఎస్పీడీసీఎల్ఉద్యోగులంతా రాజీలేని సమ్మె కొనసాగిస్తుండటంతో జిల్లావాసుల విద్యుత్ కష్టాలు వినే నాథుడే కరవయ్యాడు. […]పూర్తి వివరాలు ...