నిన్నటి వరకు తెలంగాణ ఆత్మగౌరవం పేరుతో, తెలంగాణా సంస్కృతి పేరుతొ ఉద్యమం చేపట్టిన గులాబీ దళపతి ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గద్వాల్ లో సీమ సంస్కృతిని కించపరిచే విధంగా వ్యాఖ్యానాలు చేయడం గమనార్హం! మాజీ మంత్రి డికె అరుణ ప్రాతినిద్యం వహిస్తున్న గద్వాలలో ఆమెకు సమీప బందువైన కృష్ణమోహన్ రెడ్డిని అబ్యర్ధిగా ప్రకటించిన కచరా గద్వాలలో రాయలసీమ ఫ్యాక్షన్ సంస్కృతి ఉందని,అది పోవాలని అన్నారు. అంతే కాకుండా కెసిఆర్ దెబ్బ ఏమిటో చూపిస్తా..ఆర్.డి.ఎస్.ద్వారా కావాల్సినంత నీరు […]పూర్తి వివరాలు ...
తెలుగువారి ఆత్మగౌరవం కోసం కొత్త పార్టీని పెడుతున్నామని రాయలసీమకే చెందిన మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తెలుగువారి కి అవమానాలు ఎదురైతే ఎదుర్కోవడమే తమ పార్టీ లక్ష్యమని కిరణ్ అన్నారు. పన్నెండో తేదీ సాయంత్రం రాజమండ్రిలో సభ పెట్టి పార్టీ విధానాలను ప్రకటిస్తామని కిరణ్ అన్నారు.తన జీవితం తెరచిన పుస్తకం అని అన్నారు.తనపై ఆరోపణలను రుజువు చేయాలని కిరణ్ సవాల్ చేశారు.అన్ని నిబంధల ప్రకారమే జరిగాయని అన్నారు. రాయలసీమకే చెందిన జగన్, చంద్రబాబులు ఇప్పటికే […]పూర్తి వివరాలు ...
27న కడపలో ప్రజాగర్జన నిర్వహించాలని తెదేపా నిర్ణయించింది. ఈ నెల 30న మున్సిపల్ ఎన్నికలు జరుగనున్న నేపధ్యంలో 27న ప్రజాగర్జన నిర్వహించడం వల్ల ఎన్నికల్లో లాభిస్తుందని తెదేపా నేతలు భావిస్తున్నారు. చంద్రబాబు హాజరయ్యే గర్జనకు భారీ ఎత్తున జన సమీకరణ నిర్వహించనున్నారు. కాంగ్రెస్ నేతలు ప్రజాగర్జన సభలో చేరతారా, లేక అంతకుముందే సైకిలెక్కుతారా అన్నది తెలియాల్సి ఉంది.పూర్తి వివరాలు ...
సార్వత్రిక ఎన్నికల షెడ్యూలును ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎన్ సంపత్ ప్రకటించారు. మన కడప జిల్లాలో మే 7వ తేదీన 10 శాసనసభ, 2 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్ 12న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ల దాఖలు గడువు ఏప్రిల్ 19. నామినేషన్ల పరిశీలన ఏప్రిల్ 21న ఉంటుంది. 23 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువుంటుంది. మార్చి 9వ తేదీన బూత్ లెవెల్ అధికారులు సమావేశం అవుతారని, ఆరోజున ఎన్నికల జాబితాలను క్షుణ్ణంగా […]పూర్తి వివరాలు ...
తన భవిష్యత్ కార్యాచరణ నిర్ణయించేందుకు ఖాజీపేటలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో తీవ్ర ఉద్వేగానికి లోనైన మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి కన్నీరు పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 35 ఏళ్ల రాజకీయ జీవితంలో తన వెంట ఉన్న ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఎప్పుడూ ప్రజా శ్రేయస్సు కోసమే తపించానని అన్నారు. తన భవిష్యత్ రాజకీయ జీవితంపై ప్రజా బ్యాలెట్ నిర్వహించానని, ప్రజలు ఇచ్చే తీర్పుతోనే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనేది […]పూర్తి వివరాలు ...
కడప: రాయలసీమలోనే రాష్ట్ర రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండు చేయాల్సిన సమయంలో మేథోవర్గం మౌనం వహించడం ప్రమాదకరమని రాయలసీమ విద్యార్థి సమాఖ్య కన్వీనరు మల్లెల భాస్కర్ ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని శ్రీ వెంటేశ్వర డిగ్రీ, పీజీ కళాశాలలో ఆర్.ఎస్.ఎఫ్. ఆధ్వర్యంలో ‘రాయలసీమకు రాజధానిని అడుగుదామా.. మరణశాసనం రాసుకుందామా’ అనే అంశంపై సోమవారం సదస్సు నిర్వహించారు. సదస్సునకు సమాఖ్య కోకన్వీనరు దస్తగిరి అధ్యక్షత వహించారు. భాస్కర్ మాట్లాడుతు కోస్తా పెట్టుబడిదారులు, రాయలసీమ ముఠానాయకులు కలసి 1956లో రాసిన […]పూర్తి వివరాలు ...
అనంతపురం గ్రామంలో రెండు రోజుల పాటు జరిగిన గంగమ్మ జాతర సోమవారం సాయంత్రం ఘనంగా ముగిసింది. శనివారం తెల్లవారు జామున అనంతపురం గంగమ్మ ఆలయానికి చేరుకోవడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఆదివారం ఉదయం కుర్నూతల గంగమ్మ ఆలయానికి రాగానే నిండు తిరునాళ్ల ప్రారంభమైంది. సోమవారం మైల తిరునాళ్ల నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు హుండీ ఆదాయాన్ని లెక్కించి, జాతర నిర్వహణ ముసిగిందని ప్రకటించారు. గత మూడు రోజుల పాటు అనంతపురం గ్రామం జనసంద్రంగా మారింది. […]పూర్తి వివరాలు ...
చింతకొమ్మదిన్నె గంగ జాతర ఆది, సోమవారాల్లో నిర్వహించనున్నారు. మహాశివరాత్రి అనంతరం రెండురోజుల తరువాత ఈ జాతరను అనాదిగా నిర్వహిస్తున్నారు. జాతరకు రాయలసీమ జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. గంగ జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. తాగునీటికి ఇబ్బందులు లేకుండా, వాహనాల రాకపోకలు అంతరాయం లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. చింతకొమ్మదిన్నె నుంచి అమ్మవారిని ఆనవాయితీ ప్రకారం అలంకరించి మేళతాళలతో కొత్తపేట గంగమ్మ ఆలయానికి తీసుకొచ్చారు. ఆలయ ఆవరణలో […]పూర్తి వివరాలు ...
అనంతపురం (లక్కిరెడ్డిపల్లె) గంగమ్మ ఆలయం రాయలసీమలోనే ప్రసిద్ధి – శనివారం నుంచి అమ్మవారి జాతర ప్రారంభం కానుంది. రాయలసీమ ప్రాంతం నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శనార్థం రానున్నారు. మూడు రోజులు జరిగే ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. తిరుణాల్ల నేపధ్యం … అనంతపురం గ్రామానికి చెందిన తిమ్మిరెడ్డి ఉత్తారెడ్డి పొలం గట్టుకు కావాల్సిన కంప కొట్టి తొడుగేశారు. తీసుకెళ్లేందుకు కాడెద్దులతో కదిలించగా కదలలేదు. ఆ రాత్రి అమ్మవారు స్వప్నంలోకి వచ్చి […]పూర్తి వివరాలు ...