కడప లోక్ సభ నియోజకవర్గానికి జరిగిన ఉప ఎన్నికలో తాజాగా అందిన వివరాల ప్రకారం సుమారు పదిలక్షల ఓట్లు పోలయ్యాయి.అంటే మొత్తం కడప లోక్ సభ నియోజకవర్గంలో 77.48శాతం ఓట్లు పోలైనట్లు నమోదైంది. అత్యధికంగా కమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్లో 84.56 శాతం ఓట్లు పోలయ్యాయి. ఆ తర్వాత స్థానంలో జమ్మలమడుగు సెగ్మెంట్ ఉంది. ఇక్కడ 83.18శాతం ఓట్లు పోలైనట్లు రికార్డయింది. తదుపరి పులివెందులలో 82.64శాతం ఓట్లు, మైదుకూరులో 81.25శాతం , ప్రొద్దుటూరులో 76.4,బద్వేలులో 75.25శాతం, కడప అసెంబ్లీ […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Sunday, May 8, 2011
వైఎస్ఆర్ జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో రీపోలింగ్ గురించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ స్పష్టం చేశారు. ఎన్నికల పరిశీలనాధికారులు అందించే నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందిస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా మాట్లాడని పులివెందుల వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ధి , దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి భార్య వై.ఎస్.విజయలక్ష్మి ఎన్నికల పోలింగ్ ముగిశాక కూడా మాట్లాడలేదు. అవిడను మాట్లాడవలసిందిగా మీడియా పదే,పదే కోరినా, నవ్వుతూ తిరస్కరించారు. కడప లోకసభ, పులివెందుల అసెంబ్లీలకు ఉప […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Sunday, May 8, 2011
ఉప ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసి ఇవిఎంలు పలు కేంద్రాలలో పని చేయకుండా మొరాయించాయి. ఇవిఎంలకు సంబంధించి పలు రకాల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ కారణంగా చాలా కేంద్రాలలో పోలింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. కొన్ని చోట్ల మధ్యమధ్యలో సమస్యలు తలెత్తుతున్నాయి. ఒక చోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తుంటే 4వ నెంబరు అభ్యర్థికి పడుతోంది. కడపలోని రెండు పోలింగ్ కేంద్రాలలోని ఇవిఎంలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే వేరేవారికి పడుతున్నాయి. బద్వేలులోని ఒక పోలింగ్ […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Sunday, May 8, 2011
కడప లోక్ సభ నియోజకవర్గం లో మొదటి గంటలో 15 శాతం ఓట్లు పోలయ్యాయి. సాయంత్రానికి ఎనబైశాతం నుంచి ఎనభై ఐదు శాతం ఓట్లు పోల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.కాగా కొన్ని చోట్ల ఓటింగ్ యంత్రాలు మొరాయిస్తున్నాయి. ఎండల కారణంగా కూడా ప్రజలు ఉదయానే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.ముఖ్య ఎన్నికల అధికారి బన్వర్ లాల్ వీడియో ద్వారా ప్రత్యక్ష ప్రసారం లో పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. పులివెందుల శాసనసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Sunday, May 1, 2011
వైఎస్ హయాంలో కడప, పులివెందుల అభివృద్ధి కళ్లు చెదిరేలా ఉందంటూ… రాష్ట్రంలోని మిగతా జిల్లాల ప్రజల్లో అసంతృప్తి బీజాలు నాటేందుకు 2009 మే ఎన్నికల సందర్భంగా ‘ఈనాడు’ చేసిన అక్షర రాజకీయమిది. ఇప్పుడు అదే ‘ఈనాడు’ ఇడుపులపాయకు రోడ్డు లేదని, పంచాయతీ కార్యాలయం పెచ్చులూడిందని మరో రకం రాజకీయం మొదలుపెట్టింది. రామోజీకి ఎన్నికల సమయంలో ఎప్పుడూ ప్రకోపించే పైత్యంలో భాగంగానే వైఎస్కు కడపకు ఉన్న అనుబంధాన్ని అపహాస్యం చేస్తూ ఈ ఉప ఎన్నికల వేళ కథ(నా)లు రాస్తోంది. […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Saturday, April 30, 2011
టీడీపీ అధినేత చంద్రబాబు శనివారం పులివెందుల పర్యటనలో జనాన్ని రెచ్చగొట్టడంతో ఉద్రిక్తత ఏర్పడింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా బాబు లింగాల మండలం కోమన్నూతల గ్రామంలో మధ్యాహ్నం 3 గంటల సమయంలో రోడ్ షో నిర్వహించారు. వైఎస్ జగన్రెడ్డికి ఈ గ్రామంలో బాగా పట్టుంది. చంద్రబాబునాయుడు ముందుగా లింగాల మండలంలోని పార్నపల్లెకు చేరుకొని కార్యకర్తలు, ప్రజలనుద్ధే శించి ప్రసంగించారు. అనంతరం కోమన్నూతల గ్రామానికి చేరుకొని కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ వై.ఎస్.జగన్ మోహన్రెడ్డి అవినీతిపై మాట్లాడుతుండగా వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Saturday, April 30, 2011
హీరో రాజశేఖర్ కు జగన్ రెడ్డికి ఎక్కడ తగాదా వచ్చింది? ఈ విషయం వినడానికి ఆశ్చర్యంగాను, ఆసక్తకరంగాను ఉంది. విజయవాడలో జగన్ దీక్ష కార్యక్రమం నిర్వహించినప్పుడు రాజశేఖర్ సభా వేదికమీద అటూ ఇటూ తిరుగుతూ ఉన్నారు. అంతేకాక ఆయన పదే,పదే మీసాలు తిప్పుతూ తిరగడం చూసి పలువురు జగన్ చెవిలో గుసగుసలాడారు. ఇదేమి పద్దతి ఆయన మీసాలు తిప్పుకుంటూ వేదిక మీద తిరిగితే జనం ఏమనుకుంటారు? సీరియస్ నేస్ లేదని అనుకోరా అని వ్యాఖ్యానించారట.పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Friday, April 29, 2011
కడప : జిల్లా లో ఎన్నికల ప్రచారంలో చిరంజీవితో కలిసి అభ్యర్దులు డాక్టర్ డి.ఎల్.రవీంద్రరెడ్డి, వై.ఎస్.వివేకానందరెడ్డిలు పాల్గొన్నారు. చక్రాయపేటలో జరిగిన ఈ పర్యటనలో చిరంజీవి స్టార్ స్పీకర్. మంత్రులు రవీంద్రరెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ ఆయనతోపాటు ఉన్నారు.కాని చిరంజీవే ప్రత్యేక ఆకర్షణగా ఉన్నారు. వీరంతా కలిసి పర్యటిస్తుంటే తులసీరెడ్డిని ఎవరూ పట్టించుకోకపోవడం ఆయనకు బాద కలిగించింది. ఆయా నేతలు కనీసం తన పేరు కూడా ప్రస్తావించకపోవడంతో ఆయన అలిగి వెళ్లిపోబోయారు. అయితే వివేకానందరెడ్డి ఆయనను బతిమిలాడాల్సి వచ్చింది. కాంగ్రెస్ నాయకుడిగా […]పూర్తి వివరాలు ...
వార్తా విభాగం
Friday, April 29, 2011
పులివెందుల: చిరంజీవి పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్నసందర్భంలో కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ డి.ఎల్.రవీంద్రరెడ్డి గురించి ప్రస్తావిస్తుండగా ప్రజలనుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అయింది.కొందరు కోడిగుడ్లు చెప్పులు విసిరారు. వై.ఎస్.కు డి.ఎల్ సన్నిహితుడని చెప్పబోతుండగా జనం దానికి నిరసనగా చేతులు ఊపుతూ కనిపించారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.పోలీసులు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు చెందినకార్యకర్తలు ఈ పని చేశారని భావించి వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. పులివెందుల రోడ్ షోలో జరిగిన ఈ ఘటన కారణంగా కొంత ఉద్రిక్తత […]పూర్తి వివరాలు ...