శ్రీభాగ్ ఒప్పందం మేరకు సీమలో రాజధానిని ఏర్పాటు చేయాలనే డిమాండుతో సోమవారం విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చనట్లు రాయలసీమ విద్యార్థి సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. బంద్కు సంబంధించిన కరపత్రాలను ఆదివారం సమాఖ్య కోకన్వీనరు దస్తగిరి, నాగార్జున యోగివేమన విశ్వవిద్యాలయంలో విడుదల చేశారు. ఆర్ఎస్ఎఫ్ బంద్కు పిలుపునివ్వడం వెనక ప్రధాన ఉద్దేశం రాజధాని లేకపోతే రాయలసీమకు జరిగే నష్టం వివరించే అన్నీ విషయాలు అందులో పొందుపరిచారు. బంద్కు విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యాసంస్థల ప్రతినిధులు పాల్గొనాలని వారు కోరారు.పూర్తి వివరాలు ...
కేటాయింపులున్న రాయలసీమ పరిస్థితి పట్టదా? పోలవరం ద్వారా ఆదా అయ్యే 45 టీయంసీల నీటిని, పులిచింతల నిర్మాణం ద్వారా ఆదా అయ్యే 54 టీయంసీల నీటిని, కృష్ణా డెల్టాలో పంటల మార్పిడి ద్వారా ఆదా అయ్యే నీటిని తక్షణమే గాలేరు-నగరి, హంద్రీనీవా, వెలిగొండ ప్రాజెక్టులకు నికర జలాలు పొందేలాగా బ్రిజేష్ ట్రిబ్యునల్కు నివేదికలు ఇవ్వాలి. రాష్ట్ర విభజన బిల్లులో పూర్తిచేస్తామన్న పై ప్రాజెక్టులు అన్నింటికీ బడ్జెట్ కేటాయింపులు ఇచ్చి ఒకటి రెండేళ్ళలో పూర్తిచెయ్యాలి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన […]పూర్తి వివరాలు ...
కడప జిల్లా పర్యాటక రంగానికి మరోసారి అన్యాయం జరిగింది. కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రి శ్రీవద్ యశో నారాయణ మంగళవారం పార్లమెంటులో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో పర్యాటకాభివృద్ధికి చేపట్టనున్న ప్రాజెక్టుల వివరాలను లిఖిత పూర్వకంగా వివరించారు. మన రాష్ట్రానికి సాధారణ సర్క్యూట్ విభాగంలో పది ప్రాజెక్టులను కేటాయించారు. సాధరణంగా రాష్ట్ర ప్రభుత్వం పంపే నివేదికలకు అనుగుణంగా కేంద్రం ఇటువంటి ప్రాజెక్టులకు అనుమతి మంజూరు చేస్తుంది.. అందులో గుంటూరుకు మూడు కేటాయించి పశ్చిమ గోదావరికి రెండు, చిత్తూరు (శ్రీకాళహస్తి)కు […]పూర్తి వివరాలు ...
శుక్రవారం (18.07.2014) నాటి సాక్షి దినపత్రికలో ‘రాజధానిగా బెజవాడే బెస్ట్’ అన్న పేరుతో కొండలరావు గారు రాసిన వ్యాసం (లంకె: http://www.sakshi.com/news/opinion/vijayawada-can-be-the-best-capital-city-for-andhra-pradesh-149336) చదివాను. అందులో రావుగారు ఇలా చెబుతున్నారు ‘వెనక బడిన తమ ప్రాంతం రాజధాని అయితేనైనా అభివృద్ధి అవు తుందని కొందరు అంటున్నారు. విభజనను సెంటిమెంట్ గా చూసినవారు రాజధాని ఏర్పాటునూ అలాగే చూస్తు న్నారు. ఆచరణాత్మకంగా, వాస్తవికంగా, తమతో పాటు మిగతా ప్రాంతాల వారి ప్రయోజనాలపరంగా చూడటం లేదు’ అని. రాజధానిని రాయలసీమ వాసులు […]పూర్తి వివరాలు ...
నాకు సిపిఐ పార్టీ అంటే ఎప్పటినుంచో అభిమానం ఉంది కానీ ఈ మద్యన ఆ అభిమానాన్ని చంపుకోవాల్సి వస్తుంది… రాయలసీమ సిపిఐ నాయకులు రాయలసీమకు రాజధాని ,నీళ్ళు కావాలని అంటారు కానీ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ రాయలసీమకు చెందినవాడే – కానీ ఆయన మాత్రం… రాజధాని గుంటూరు-విజయవాడ మద్య ఉండాలంటాడు ..!. కృష్ణా డెల్టాకునీళ్ళు కావాలంటాడు…! పోలవరాన్ని నిర్మించాలంటాడు…! కాకినాడ -వైజాగ్ కారిడార్ నిర్మించాలంటాడు! కానీ ఈయనకు రాయలసీమ లో కరువుకు నీళ్ళులేక అల్లాడుతున్న ప్రజల దుస్థితి పట్టదు పశువులకు […]పూర్తి వివరాలు ...
ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అధ్యక్షుడు అందరూ రాయలసీమ వాసులేనని, కానీ ఇక్కడి ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నారని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరెడ్డి ఆరోపించారు. జిల్లాకు వచ్చిన ఆయన ఆదివారం రాత్రి స్టేట్ గెస్ట్హౌస్లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వెనుకబడిన రాయలసీమలోనే రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. సారవంతమైన మాగానిలో భూములను కొనుగోలు చేసి రాజధానిని నిర్మించడం వల్ల పచ్చని పంటపొలాలను పోగొట్టుకుంటామన్నారు. రాయలసీమలో గడ్డికూడా మొలవని భూములున్నాయని చెప్పారు. ఒక నాడు మద్రాసు […]పూర్తి వివరాలు ...
నగరంలోని సీపీ బ్రౌన్ లైబ్రరీలో జులై 27వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు ‘కడప జిల్లా భవిష్యత్? ‘ అనే అంశంపై జిల్లా స్థాయి సదస్సు నిర్వహించనున్నామని జనవిజ్ఞానవేదిక (జవివే) రాష్ట్ర గౌరవాధ్యక్షుడు రాచపాళెం చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక సీపీ బ్రౌన్ లైబ్రరీలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ఎమ్మెల్సీలు బాలసుబ్రమణ్యం, డాక్టర్ గేయానంద్లు సదస్సుకు ముఖ్యఅతిథులుగా హాజరవుతారన్నారు. ఉపన్యాసకులుగా జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ గోపాల్, ఇరిగేషన్ ప్రాజెక్ట్ డిప్యూటీ చీఫ్ […]పూర్తి వివరాలు ...
రాయలసీమ అనే పేరు చెప్పడానికి నాయకులు భయపడుతున్న పరిస్థితి దాపురించడం హేయంగా ఉందని కేతువిశ్వనాథరెడ్డి అన్నారు. గురువారం స్థానిక సీపీబ్రౌన్ భాషాపరిశోధనకేంద్రంలో జరిగిన మాచిరెడ్డి వెంకటస్వామి స్మారకోపన్యాసాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తాగునీరు, సాగునీరు, విద్యాప్రయోజనాలు కలిగించే ప్రాజెక్టు రూపకల్పన, నగరాభివృద్ధికి సంబంధించిన ప్రత్యేక ప్యాకేజీ వంటి మాటలు నాయకుల నోటి రాకపోవడం బాధకరంగా ఉందన్నారు. రాయలసీమ పౌరసమాజం చైతన్యం కావాలని ఆయన ఆకాంక్షించారు. సీమ సమాజవికాసం కోసం స్థబ్దుగా ఉన్న పౌరులను చైతన్యం వైపు […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాకు కలెక్టర్ గా నియమితులైన కే.వీ. రమణ గారిని ఒక పాత్రికేయ మిత్రుడు అడిగిన ప్రశ్న చూడండి. ప్ర: రాయలసీమలో తొలిసారిగా పనిచేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొనగలరా? స: మొదటి నుంచి కోస్తా, తెలంగాణ జిల్లాల్లో నా సర్వీసు అంతా కొనసాగింది. 2000 సంవత్సరంలో సత్యసాయిబాబా 75వ జన్మదిన వేడుకల సమయంలో రెండున్నర నెలలపాటుఅనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఓఎస్డీగా పనిచేశాను. అది మినహా రాయలసీమలో ఎక్కడా పని చేయలేదు. అధికారులు, ప్రజలతోపాటు, పార్టీలతో సంబంధం లేకుండా […]పూర్తి వివరాలు ...