గండికోట: గండికోటలో మళ్ళా చిరుత పులి పంజా విసిరింది. కోట పరిసరాల్లో తిరుగుతూ గత కొద్దినెలలుగా ఎటువంటి దాడులూ చేయకుండా నిశ్శబ్దంగా ఉండిన చిరుతపులి(లు) శుక్రవారం తెల్లవారుజామున దాడి చేసి ఎనిమిది గొర్రెలను చంపింది. చిరుత సంచారం స్థానికులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. ఇంతకుముందు కూడా చిరుత ఇలాగే గొర్రెల మీద దాడి (జత చేసిన చిత్రం అప్పటిదే) చేసింది. దాంతో గత సెప్టెంబరు నెలలో అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో ఒకటిన్న సంవత్సరం […]పూర్తి వివరాలు ...
కడప: లెజెండ్ చిత్ర విజయోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు నందమూరి బాలకృష్ణ ఆదివారం (28న) ప్రొద్దుటూరుకు రానున్నారు. ఈ మేరకు గురువారం స్థానిక తెదేపా జిల్లా కార్యాలయంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు పి.కృష్ణమూర్తి, ఎస్.గోవర్ధన్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. లెజెండ్ చిత్ర విజయోత్సవ వేడుకలకు వేడుకలకు నందమూరి బాలకృష్ణ అభిమానులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు.పూర్తి వివరాలు ...
కడప : వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం ఆంధ్రప్రదేశ్ నీటి పారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు గురువారం ఫోన్ చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ నుంచి గండికోట వరకు పెండింగ్ పనులను పూర్తి చేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. గండికోట ముంపు ప్రాంతాల సమస్య తీర్చాలని, పులివెందుల బ్రాంచి కెనాల్కు తాగు, సాగు నీటిని వెంటనే విడుదల చేయాలన్నారు. గురువారం పులివెందులలోని ఇంట్లో నుంచి వైఎస్ జగన్రెడ్డి సాగునీటి శాఖ మంత్రి […]పూర్తి వివరాలు ...
కడప: ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గురువారం కడపకు వచ్చాడు. దర్శించుకున్నారు. నగరంలోని అమీన్పీర్ దర్గా (పెద్ద దర్గా)లో జరిగిన ఖ్వాజా సయ్యద్ అమీనుల్లా మహ్మద్ మొహమ్మదుల్ చిష్టిపుల్ ఖాదిరి ఉరుసు ఉత్సవాల్లో చివరిదైన తహలీల్ ఫాతేహా కార్యక్రమంలో రహమాన్ పాల్గొన్నారు. అనంతరం పీఠాధిపతుల ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా పెద్ద దర్గా పీఠాధిపతి ఆధ్వర్యంలో చదివింపుల కార్యక్రమం ఉదయం 6 గంటలకు నిర్వహించారు. తహలీల్ ఫాతేహా చదివింపుల కార్యక్రమంతో ఉరుసు ఉత్సవాలు గురువారంతో ముగిశాయి.పూర్తి వివరాలు ...
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి దేవళంలో బుధవారం ఉదయం అన్నమయ్య సంకీర్తనల టీవీ సినిమా చిత్రీకరణ జరిగింది. ఆలయ రంగమంటపంలో కొలువరో మొక్కురో.. అనే అన్నమయ్య సంకీర్తనను ఆలపించే దృశ్యాన్ని దర్శకుడు ప్రతాప్ చిత్రీకరించారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్షదైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిపై తాళ్ళపాక అన్నమాచార్యులు రచించిన సంకీర్తనలను దృశ్య రూపంలో చిత్రీకరిస్తున్నామన్నారు. షూటింగ్ పూర్తయ్యాక ఈ టెలీ ఫిలింను శ్రీవారి పాదాల చెంత వుంచి టీటీడీకి అందజేస్తామన్నారు. అంతకుముందు యూనిట్ సభ్యులు స్వామిని […]పూర్తి వివరాలు ...
రాష్ట్రంలో కరువు పరిస్థితులపై చర్చ నేపధ్యంలో రాయచోటి శాసనసభ్యుడు శ్రీకాంత్రెడ్డి జిల్లా స్థితిగతుల్ని వివరించారు. అనంతపురం జిల్లాలో కరువును దృష్టిలో ఉంచుకుని మెట్ట భూములు పదెకరాలు ఉన్నా పెన్షన్కు అర్హులుగా ప్రకటించారన్నారు. అలాంటి దుర్భర పరిస్థితులు ఉన్న వైఎస్సార్ జిల్లాకు కూడా ఆ అవకాశం కల్పించాలన్నారు. వైఎస్ఆర్ జిల్లాలో సగటు వర్షపాతం 50 శాతంకు మించి నమోదు కాలేదని ప్రభుత్వానికి గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పెన్షన్ల మంజూరులో అనంతపురం జిల్లా మాదిరిగా వెసులుబాటు […]పూర్తి వివరాలు ...
కడప: ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్రెడ్డి శైలి విలక్షణమని విమర్శల్లో రాచమల్లు తరువాత రాచపాళెం అని జిల్లా సాహితీవేత్తలు కొనియాడారు. మన నవలలు, మన కధానికల పుస్తకానికి గాను చంద్రశేఖర్ రెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా జిల్లా జనవిజ్ఞానవేదిక సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో అభినందన సభను నిర్వహించారు. ఇందులో భాగంగా జవివే కార్యదర్శి రఘునాధరెడ్డి, సాహితీ స్రవంతి అధ్యక్షుడు మస్తాన్వలి, సాహితీ వేత్తలు శశిశ్రీ, ఎంఎం వినోది ని తదితరులు రాచపాళెం సాహితీ […]పూర్తి వివరాలు ...
కడప: ఆచార్య డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్ రెడ్డి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికైన సందర్భంగా ఈ రోజు (బుధవారం, డిసెంబరు 23) సాయంత్రం స్థానిక సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో జనవిజ్ఞానవేదిక – సాహితీస్రవంతిల ఆధ్వర్యంలో అభినందన సభ జరగనుంది. ఈ సభలో రచయిత శశిశ్రీ, యోవేవి తెలుగు విభాగపు సమన్వయకర్త ఆచార్య వినోదిని ఉపన్యసిస్తారు. సాయంత్రం 5 గంటల నుండి జరిగే ఈ సభకు సాహితీ అభిమానులందరూ రావాలని జన విజ్ఞాన వేదిక […]పూర్తి వివరాలు ...
సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం భాద్యులు ఆచార్య డాక్టర్ రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి దంపతులను కడప జిల్లా అభ్యుదయ రచయితల సంఘం మంగళవారం సత్కరించింది. రాచపాలెం రాసిన ‘మన నవలలు – మన కథానికలు’ పుస్తకానికానికి గాను కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డుకు ఎంపికైన నేపధ్యం అరసం స్థానిక సిపి బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో అభినందన సభను జరిపింది. ఈ సందర్భంగా అరసం రాష్ట్ర కార్యవర్గ సభ్యలు శ్రీమతి పి సంజీవమ్మ మాట్లాడుతూ రాచపాలెం సాహితీ […]పూర్తి వివరాలు ...