వార్తా విభాగం

పర్యాటకం

కడప (వైఎస్ రాజారెడ్డి) క్రికెట్ స్టేడియం

కడప నగర పరిధిలోని పుట్లంపల్లెలో 11.6 ఎకరాల్లో రూ. 8 కోట్లతో కడప క్రికెట్ స్టేడియం ( వైఎస్‌ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ మైదానం) ఏర్పాటైంది. ఆంధ్ర క్రికెట్ అసోషియేషన్ ఆధ్వర్యంలో ఈ  మైదానం నిర్మితమైంది. 2007లో అప్పటి ముఖ్యమంత్రి డా. వైఎస్‌ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేయడంతో పాటు ఆయన తండ్రి రాజారెడ్డి జ్ఞాపకార్థం రూ.50 లక్షల మూలనిధిని ఈ స్టేడియం నిర్మాణం కోసం అందజేశారు. దీంతో 2009లో ప్రారంభమై 2011 నాటికి మైదానం అందుబాటులోకి వచ్చింది. కడప […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

జీర్ణాశయ క్యాన్సర్‌ రోగికి అరుదైన శస్త్రచికిత్స చేసిన రిమ్స్ వైద్యులు

కడప : జీర్ణాశయ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగికి అరుదైన శస్త్రచికిత్సను (ఆపరేషను) రిమ్స్ వైద్యులు విజయవంతంగా నిర్వహించారు. ఈ అరుదైన శస్త్రచికిత్స వివరాలను రిమ్స్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ గిరిధర్‌ శుక్రవారం మీడియాకు తెలియచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కడప నగరానికి చెందిన బాబు అనే వ్యక్తి సంవత్సరం నుంచి కడుపులో గడ్డతో బాధపడుతూ పది రోజుల క్రితం రిమ్స్‌ జనరల్‌ మెడిసిన్‌ వార్డులో చేరినాడన్నారు. రోగిని పరిశీలించిన మొదటి యూనిట్‌ వైద్యులు రోగి కడుపులో పెద్ద పేగు […]పూర్తి వివరాలు ...

కథలు

ఎల్లువ (కథ) – దాదాహయత్‌

‘యెంకటేస్వర సామీ, కాపాడు తండ్రీ’ కోర్టుహాల్లోకి వెళ్తూ తిరుపతి కొండ వున్న దిక్కుకు తిరిగి దండం పెట్టుకున్నాడు గొల్ల నారాయణ. దావా గెలిస్తే కొండకొస్తానని మొక్కుకున్నాడతను. ఆరోజే తీర్పు. కొద్దిసేపటి క్రితమే అతని వకీలు అతనికి ధైర్యం చెప్పాడు. ”మరేం ఫరవాలేదు. దావా గెల్చేది మనమే. నువ్వు నిమ్మళంగా వుండు” అన్నాడు. గొల్లనారాయణ అలాగేనని బుర్రూపాడు. అయితే అంతటితో అతనికి ధైర్యం చిక్కలేదు. ”అన్నింటికీ నువ్వే వుండావు సామీ” తిరుపతి వెంకన్నను తల్చుకుని అప్పుడే మనసులో దండం […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం ప్రజా ప్రతినిధులు

దైవత్వాన్ని నింపుకున్న మానవుడు వైఎస్సార్

డాక్టర్ వైఎస్సార్ (వైఎస్ రాజశేఖరరెడ్డి) ను నేను చూసింది కేవలం నాలుగు సార్లు. ఒంగోలుకు ఇందిరా గాంధీ వచ్చినపుడు ఆ సభలో తొలిసారి చూసాను. ఆ తరువాత డాక్టర్ సి నారాయణరెడ్డి గారి మనుమరాలు వివాహ వేడుకలో చూసాను. మరో రెండు సందర్భాల్లో రెండు సార్లు. ప్రత్యక్షంగా మాట్లాడలేదు . దురదృష్టం ఏమిటంటే 2004 వరకు ఆయన పట్ల నాకు అసలు సదభిప్రాయమే లేదు. చంద్రబాబు గొప్ప సంస్కరణవాది అని, ఆయన చాలా మంచి పాలనాదక్షుడు అని […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

‘మురళి వూదే పాపడు’ని ఆవిష్కరించిన రమణారెడ్డి

మురళి వూదే పాపడు కథల సంపుటి ఆవిష్కరణ సామాజిక మార్పును ప్రతిబింబించే దాదా హయాత్ కథలు : సింగమనేని  ప్రొద్దుటూరు : సమాజంలో జరుగుతున్న మార్పుకు ప్రతిబింబంగా దాదాహయాత్ కథలు నిలుస్తాయని, గత సమాజపు పరిస్థితులు , నేటి సమాజపు పరిస్థితుల‌ను పోల్చి చేసుకునేందుకు ఒక కొల‌మానంగా నిలుస్తాయన్నారు ప్రముఖ కథా రచయిత, విమర్శకులు సింగమనేని నారాయణ. ఆదివారం ప్రొద్దుటూరు పట్టణంలోని తల్లంసాయి రెసిడెన్సీలో ‘మురళి వూదే పాపడు’ కథల సంపుటిని (దాదా హయాత్‌ రాసిన కథలు)  […]పూర్తి వివరాలు ...

ఈ-పుస్తకాలు వ్యాసాలు

కాలజ్ఞాన మహిమలు – వి.వీరబ్రహ్మం

కాలజ్ఞాన మహిమలు ఈ-పుస్తకం శ్రీ బ్రహ్మం గారి కాలజ్ఞానంలోని అద్భుత మహిమలు. 1983లో ప్రచురితం. ప్రచురణ: శ్రీ వీరబ్రహ్మేంద్ర మిషన్, ఆనందాశ్రమం, కడప జిల్లా.పూర్తి వివరాలు ...

ఈ-పుస్తకాలు వ్యాసాలు

తాళ్ళపాక చిన్నన్న సాహిత్య సమీక్ష

పుస్తకం: తాళ్ళపాక చిన్నన్న సాహిత్య సమీక్ష, రచయిత : ఎస్.టి.వి.రాజగోపాలాచార్య, సంవత్సరం : 1992, పుటలు: 371పూర్తి వివరాలు ...

అభిప్రాయం

పోతిరెడ్డి పాడు వివాదం నేర్పుతున్న పాఠం

పోతిరెడ్డిపాడు వివాదం – రాయలసీమకు నికరజలాలు రాయలసీమ గుండెచప్పుడు మిత్తకంధాల( పోతిరెడ్డిపాడు) నేడు రెండు తెలుగు రాష్ట్రాల మద్య వివాదంగా మారి అంతే త్వరగా పరిష్కారం అయింది. రెండు తెలుగు రాష్ట్రాల మద్య నీటి పంపకాలలో వివాదం వచ్చినపుడల్లా పోతిరెడ్డిపాడును వాడుకుని చివరకు తమ అసలు కోరిక తీరిన వెంటనే అందరూ సర్దుకుంటారు. నిజానికి చుక్క నీరుకూడా వాడుకోని రాయలసీమ వాసుల మీద పుష్కలంగా నీరు వాడుకుంటున్న వారు కూడా విమర్శలు చేయడం సీమ ప్రజల దుస్దితి. […]పూర్తి వివరాలు ...

ఈ-పుస్తకాలు

కడప జిల్లా సమాచార దర్శిని – 1992

కడప జిల్లా సమాచార దర్శిని విశాలాంధ్ర దినపత్రిక అనుబంధంగా 1992 లో ప్రచురితం అయింది. ఈ పుస్తకం కడపజిల్లా చారిత్రక, రాజకీయ, సమాజిక, సాహిత్య, సాంస్కృతిక ,ఆర్ధిక అంశాలను మనముందు ఉంచింది. భారత కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర నాయకుడు, ప్రముఖ విశ్లేషకుడు శ్రీ తుంగా లక్ష్మినారాయణ గారు www.kadapa.info వెబ్సైట్ లో ఈ-బుక్ గా అందుబాటులో ఉంచేందుకు అనువుగా ఈ పుస్తకాన్ని పంపారు. ఈ పుస్తకానికి లక్ష్మినారాయణ గారు రాసిన ముందుమాట పుస్తకాన్ని పరిచయం చేస్తుంది. అయన […]పూర్తి వివరాలు ...

error: