వార్తా విభాగం

వార్తలు

రాయలసీమ ఉద్యమ నేతల అరెస్టు

బరితెగించిన తెదేపా ప్రభుత్వం పోలీసుల అదుపులో బొజ్జా  గృహనిర్భందంలో భూమన్ ప్రభుత్వానికి మద్ధతుగా బరిలోకి దిగిన పచ్చ నేతలు, మీడియా కడప: శాంతియుతంగా సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన కోసం సిద్ధమవుతున్న రాయలసీమ రైతు నాయకులపైకి రాష్ట్ర ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పింది. అలుగు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనేందుకు ఉద్యుక్తులవుతున్న నేతలను కర్నూలు జిల్లాలో పలుచోట్ల పోలీసులు సోమవారం గృహనిర్భంధం చేశారు. ప్రభుత్వ పెద్దల ఒత్తిడి మేరకు ముందస్తు వ్యూహంలో భాగంగా బొజ్జా అర్జున్ ను ఆత్మకూరులో పోలీసులు అదుపులోకి తీసుకోగా, […]పూర్తి వివరాలు ...

గుసగుస వార్తలు

సిద్దేశ్వరం అలుగుపై రంగంలోకి దిగిన నిఘావర్గాలు

మీడియా దృష్టి మరల్చేందుకు ప్రభుత్వ వ్యూహరచన? కడప: రాయలసీమ జిల్లాల నుండి రైతు సంఘాల ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో రైతులు సిద్దేశ్వరం అలుగు శంకుస్థాపన కార్యక్రమానికి తరలివెళ్ళే అవకాశం ఉండటంతో నిఘావర్గాలు రంగంలోకి దిగాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు రాయలసీమ నాలుగు జిల్లాల నుండి ఎంతమంది రైతులు సిద్దేశ్వరం వెళ్ళవచ్చు అనే అంశంపై ఒక అంచనాకు వచ్చిన నిఘా వర్గాలు అలుగు శంకుస్థాపన కార్యక్రమానికి సంబంధించిన వివరాలను సేకరించి ప్రభుత్వానికి నివేదించాయి. రాయలసీమ జిల్లాల నుండి […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

యోగి వేమన విశ్వవిద్యాలయంపై ప్రభుత్వ వివక్ష

నిధుల కొరతతో నీరసిస్తున్నయోగి వేమన విశ్వవిద్యాలయం పట్టించుకోని రాష్ట్ర ప్రభుత్వం కడప: నగరంలోని యోగి వేమన విశ్వవిద్యాలయంపై నిధుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోంది. ఫలితంగా విశ్వవిద్యాలయ అభివృద్ది కుంటుపడుతోంది. ఈ నేపధ్యంలో యోగివేమన విశ్వవిద్యాలయానికి సంబంధించి సాక్షి దినపత్రిక ఒక కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం కడప.ఇన్ఫో వీక్షకుల కోసం… రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 14 విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం రూ.383 కోట్లు నిధులు విడుదల చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వైఎస్ఆర్ జిల్లాలోని యోగి వేమన విశ్వవిద్యాలయానికి […]పూర్తి వివరాలు ...

సాగునీటి పథకాలు

ఆంధ్రప్రదేశ్‌లో కృష్ణా జలాల పంపకం

మూడు ప్రాంతాల మధ్య కృష్ణా జలాల పంపకం బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులను ఆధారంగా చేసుకుని రాష్ట్రంలోని రాయలసీమ, కోస్తా, తెలంగాణా ప్రాంతాల మధ్య కృష్ణా జలాలను ప్రభుత్వం క్రింది విధంగా పంపిణీ చేసింది. సమాచార హక్కు చట్టం క్రింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి సేకరించిన కృష్ణా జలాల పంపకం వివరాలు కడప.ఇన్ఫో వీక్షకుల కోసం… ‌పూర్తి వివరాలు ...

అభిప్రాయం ఈ-పుస్తకాలు రాయలసీమ

సాగునీళ్ళలో సీమకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టిన కోస్తా ఇంజనీర్

సాగునీళ్ళలో సీమకు జరిగిన మోసమేమిటి? కీ.శే కె శ్రీరామకృష్ణయ్య (శ్రీరామక్రిష్ణయ్య) గారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఇరిగేషన్ ఇంజనీరుగా పని చేసి పదవీ విరమణ పొందినారు. గుంటూరు జిల్లాలోని రేపల్లె తాలూకాలో భాగమైన బేతపూడికి చెందిన వీరు సివిల్ ఇంజనీరింగ్ పట్టభద్రులు. రాయలసీమకు సంబంధించి సాగునీటి పథకాల ప్రతిపాదనలు తయారు చేయడంలో వీరు పాలు పంచుకున్నారు. వీరి కృషిని గుర్తించిన కాంగ్రెస్ ప్రభుత్వం వైఎస్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప జిల్లాలోని బ్రహ్మంసాగర్ జలాశయం (ఇది తెలుగుగంగ పథకంలో […]పూర్తి వివరాలు ...

సాగునీటి పథకాలు

రాయలసీమ సాగునీటి కేటాయింపులు (బచావత్ అవార్డు)

కృష్ణా జలాల పంపకంపై మూడు పరీవాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ ల మధ్య తలెత్తిన వివాదాలను పరిష్కరించి, లభ్యమయ్యే నీటిని పంపకం చేసేందుకు 1969 ఏప్రిల్ 10 న కేంద్ర ప్రభుత్వం బచావత్ ట్రిబ్యునల్ ఏర్పాటు చేసింది. జస్టిస్ ఆర్.ఎస్.బచావత్ అధ్యక్షుడిగా ఈ  ట్రిబ్యునల్ అంతర్రాష్ట్ర జలవివాదాల చట్టం 1956 కు లోబడి ఏర్పాటయింది. కృష్ణా నదిలో నమ్మకంగా ప్రవహిస్తుందని అంచనా వేసిన 2060 టి.ఎం.సి. నికర జలాలను 1976 లో ట్రిబ్యునల్ కింది విధంగా సాగునీటి […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం రాయలసీమ వ్యాసాలు

‘రాయలసీమ సంస్కృతి’పై చిత్రసీమలో ఊచకోత

తెలుగు చిత్రసీమ కీర్తిబావుటాను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయిన తొలినాటి దిగ్గజాలను అందించిన రాయలసీమకు నేడు అదే సినిమాలలో అంతులేని అపఖ్యాతి లభిస్తోంది. సీమ సంస్కృతిపై ఏ మాత్రం అవగాహన లేని రచయితలు, దర్శకులు తోడై ఒక హింసాయుత విధ్వంసకర దృశ్యానికి సీమలోని ఊర్లపేర్లు పెట్టి “రాయలసీమ సంస్కృతి” అంటే ఇదే అనుకునే భ్రమను యావదాంధ్రులకు కలిగిస్తున్నారు. తెలుగులో శబ్దచిత్రాలు ప్రారంభమయ్యాక మల్లీశ్వరి వంటి సినిమాలతో తెలుగు చిత్రసీమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయిన బి.నాగిరెడ్డి, బి.ఎన్.రెడ్డి […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

కడప విమానాశ్రయం నుండి ప్రయాణీకుల రాకపోకలు 2015

31 రోజులలో 1918 మంది కడప విమానమెక్కినారు మన కడప విమానాశ్రయం నుండి 2015లో 1918 మంది ప్రయాణీకులు రాకపోకలు సాగించారు. 7 జూన్ 2015న ప్రారంభమైన కడప విమానాశ్రయం నుండి ఆ సంవత్సరం ఎయిర్ పెగాసస్ సంస్థ వారానికి మూడు రోజుల పాటు కడప – బెంగుళూరుల నడుమ విమాన సర్వీసును నడిపింది. 2015లో 31 రోజుల పాటు కడప – బెంగుళూరు విమాన సర్వీసు నడిచింది. 2015 సంవత్సరానికి గాను కడప విమానాశ్రయంలో ప్రయాణీకుల […]పూర్తి వివరాలు ...

వార్తలు

‘పాయలోపల్లి’లో చిరుతల సంచారం

రాయచోటి: పాయలోపల్లి (మండలం: చక్రాయపేట, గ్రామ పంచాయతీ: సురభి) సమీపంలోని అటవీ ప్రాంతంలో మూడు చిరుతపులులు సంచరిస్తున్నట్లు ఇటీవల స్థానికులు గుర్తించారు. ఊరి చుట్టూ మామిడి తోటలు అధికంగా ఉండటంతో పాటు, ఊరికి సమీపంలోనే అటవీ ప్రాంతం ఉంది. బుధవారం అడవిలోకి గొర్రెలను తోలుకెల్లిన సమయంలో ఒక చిరుతపులి గొర్రెల మందపై దాడి చేసి ఒక గొర్రెను తినేసిందని కాపరులు చెప్పారు. దీంతో గ్రామస్తులు అటవీ అధికారులకు సమాచారం అందించారు. రాయచోటి: పాయలోపల్లి (మండలం: చక్రాయపేట, గ్రామ […]పూర్తి వివరాలు ...