కర్నూలు: రాజధాని సీమ ప్రజల హక్కుఅని, రాయలసీమ ప్రత్యేక రాష్ట్రమే అంతిమ లక్ష్యమని రాయలసీమ ప్రజాసమితి అధ్యక్షుడు క్రిష్ణయ్య, ప్రగతి శీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంరాష్ట్ర కో-కన్వీనర్ శ్రీనివాసులు గౌడ్, బహుజన డెమోక్రటిక్ స్టూడెంట్స్ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కోనేటి వెంకటేశ్వర్లు, రైతు కూలీ సంఘంజిల్లా కార్యదర్శి సుంకన్నలు స్పష్టం చేశారు. కర్నూలు నగరంలోని జార్జిరెడ్డి భవనంలో శనివారం కర్నూలు రాజధాని, రాయలసీమ రాష్ట్ర ఉద్యమ కార్యాచరణ కర పత్రాలను వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు […]పూర్తి వివరాలు ...
ఎర్రగుంట్ల నగర పంచాయతీ ఎన్నికల్లో వైకాపా అభ్యర్థులుగా కౌన్సిలర్ స్థానాలకు పోటీచేసి గెలిచిన తర్వాత తెదేపాకు ఫిరాయించిన ఎనిమిది మంది కౌన్సిలర్లపై అనర్హత వేటు పడింది. ఈ విషయాన్ని కమిషనర్ ప్రభాకర్రావు శనివారం విలేకర్లకు వెల్లడించారు. అనర్హులుగా ప్రకటించిన వారిలో ఎస్.పురుషోత్తం(ఒకటోవార్డు), వి.సరస్వతి(మూడో వార్డు), ఎ.గంగాభవాని (అయిదోవార్డు), జి.నారాయణరెడ్డి(ఆరోవార్డు), ఎస్.ఆసియాబేగం(పదోవార్డు), జె.మహిత(పన్నెండోవార్డు), ఎస్.మస్తాన్వలి(పదమూడోవార్డు), వి.లక్ష్మి(పద్నాలుగో వార్డు) కౌన్సిలర్లు ఉన్నారని ఆయన వివరించారు. నగర పంచాయతీకి జులై నెల 3న జరిగిన మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ఛైర్మన్ ఎన్నికల సమయంలో […]పూర్తి వివరాలు ...
కడప జిల్లాకు చెందిన యువరచయిత డాక్టర్ వేంపల్లి గంగాధర్ రాష్ట్రపతి భవన్ నుండి ‘ఇన్ రెసిడెన్స్’ కార్యక్రమం కింద ఆహ్వానం అందుకున్నారు. 2013 డిసెంబర్ లో ప్రారంభించిన ఈ కార్యక్రమం కింద రెండవ విడతలో దరఖాస్తుదారుల నుంచి వేంపల్లి గంగాధర్ ఎంపికయ్యారు. రెండవ విడత ఈ కార్యక్రమానికి ఎంపికైన రచయితలు/కళాకారులకు సెప్టెంబరు 8 నుంచి 26వ తేదీ వరకు రాష్ట్రపతి భవన్ ఆతిథ్యం ఉంటుంది. ఈ ఆతిధ్యానికి రాష్ట్రపతి భవన్ గంగాధర్ సహా నలుగురిని ఆహ్వానించింది. వీరిలో […]పూర్తి వివరాలు ...
పరుగులపోటీలాగ కథల పోటీ ఏంటి? సృజనాత్మకతకు పోటీ ఉంటుందా? అసలు సృజన అనేదే పోటీ లేనిది. కాకపోతే ఎవరి సృజన వాళ్లది. ఒకటి తక్కువ కాదు. మరొకటి ఎక్కువా కాదు. కథల పోటీల గురించి తలచినప్పుడల్లా నాకు సొదుం జయరాం (చనిపోయి ఎక్కడున్నాడో మహానుభావుడు. ఊరిపక్కనే ఉన్నా ఒక్కసారి కూడా కలవలేకపోయాను) గుర్తుకొస్తాడు. అతను రాసిన “పుణ్యకాలం మించిపోయింది’ అనే కథ ఇలా ఉంటుంది : పోటీలకొచ్చే డబ్బు మీద ఆశతో ఒక మధ్యతరగతి పెళ్లాం రచయితను […]పూర్తి వివరాలు ...
ఇప్పటికే అన్ని సాగునీటి ప్రాజెక్టులూ అందుబాటులో ఉండి దర్జాగా మూడు పంటలు పండించుకుంటున్న కృష్ణా డెల్టాకు సంబంధించి ప్రాజెక్టుల నిర్వహణకు, అదునికీకరణకు ఎక్కువ కేటాయింపులు చేసిన ప్రభుత్వం రాయలసీమ ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో పూర్తి అశ్రద్ధను చూపింది. సీమ సాగునీటి ప్రాజెక్టులకు మొక్కుబడిగా శానా తక్కువ నిధులను కేటాయించి ఈ ప్రాంతంపైన తన నిబద్ధతను, నిర్లిప్తతను మరోసారి చాటుకుంది. 2014-15 ఆర్థిక సంవత్సరానికిగాను రాయలసీమకు గుండెకాయ వంటి గాలేరు – నగరి పథకాన్ని పూర్తి చేయటానికి రూ.399.60 […]పూర్తి వివరాలు ...
జండా యెగరేసి పప్పూబెల్లాలు పంచిపోవడం కాదు వ్యధల సీమలో వెలుగుపూలు పూయించే అజండా యేమిటో విప్పి చెప్పు సమన్యాయం సమాధయి సమదూరం వెక్కిరిస్తోంది ….. రాజధానే కాదు అన్నిటి ప్రవాహమూ అటువైపే … వికేంద్రీకరణంటే …. ఖాళీ గిన్నెలో తలావొక మెదుకు విదిల్చడం కాదు అడుగుతున్నది భిక్ష అంతకంటే కాదు…. ఒప్పందాలకు నీళ్ళొదిలినందుకే కదా ఆత్మ ఒకటైనా దేహాలు విడివడింది ఆ గాయాల తడి ఇంకా ఆరనే లేదు మళ్ళా అదే పడగ నీడ అదే విక్రుత […]పూర్తి వివరాలు ...
వర్గం: హాస్య గీతాలు దాని సొమ్మేమైన తింటీనా దానెబ్బ గంటేమైన తింటీనా దీని సొమ్మేమైన తింటీనా ఈళ్ళ నాయన గంటేమైన తింటీనా దాని సొమ్మేమైన తింటీనా దానెబ్బ గంటేమైన తింటీనా దీని సొమ్మేమైన తింటీనా ఈళ్ళ నాయన గంటేమైన తింటీనా తెలిసీ తెలియక అమ్మ ఇల్లరికం నేనొస్తి(2) డబ్బాశ కోసమై అత్తింట్లో నేనుంటే ఆ..డబ్బాశ కోసమై అత్తింట్లో నేనుంటే కసువూలూడ్సమని బోకుల్దోమమనే ఆ..కసువూలూడ్సమనె బోకుల్దోమమనె వడ్లు దంచమనె మంట బెట్టమనె వంట సేయమనె ఆ..ఈ ఇంటి పనులంటే […]పూర్తి వివరాలు ...
రాయలసీమకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ఈ పొద్దు (మంగళవారం) కడప నగరంలో బడిపిల్లోల్లు రోడ్డు మీదకొచ్చారు. నగరంలో ప్రదర్శన నిర్వహించిన పిల్లోళ్ళు… ర్యాలీగా కోటిరెడ్డి కూడలి వద్దకు చేరుకొని నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు ప్రభుత్వ వైఖరిని వ్యతిరేఖిస్తూ నినాదాలు చేశారు. రాయలసీమ విద్యార్థి సమాఖ్య (ఆర్ ఎస్ ఎఫ్) ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థి నాయకులు మాట్లాడుతూ రాజధాని విషయంలో సీమ వాసుల మనోభావాలను పట్టించుకోకుండా ప్రభుత్వం ఒంటెత్తు పోకడలు […]పూర్తి వివరాలు ...
కడప: అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనందున సీమ ప్రాంత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలో గళం విప్పాలని, సీమలో రాజధాని ఏర్పాటుపై చర్చ పెట్టాలని డిమాండ్ చేస్తూ రాయలసీమ స్టూడెంట్స్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యార్థులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు రవిశంకర్రెడ్డి మాట్లాడుతూ రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సీమ ప్రజల వాణిని అసెంబ్లీలో వినిపించాలన్నారు. సీమకు అన్యాయం జరుగుతున్నప్పటికీ ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. అసెంబ్లీని వేదికగా చేసుకొని […]పూర్తి వివరాలు ...