పట్టిసీమ ద్వారా రాయలసీమకు కృష్ణా జలాలను తీసుకురావడానికి సీఎం చంద్రబాబు మహాయజ్ఞం చేస్తుంటే, విపక్ష నేత జగన్ దీనికి అడ్డుపడుతున్నారని ఆరోపిస్తూ శాసనమండలి ఉపాధ్యక్షులు సతీష్కుమార్రెడ్డి (తెదేపా) ఆధ్వర్యంలో సోమవారం పులివెందుల పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి జిల్లాలోని తెదేపా నేతలంతా హాజరై పట్టిసీమకు అనుకూలంగా మాట్లాడటం విశేషంగా ఉంది. అనంతరం ర్యాలీనుద్దేశించి సతీష్రెడ్డి, తెదేపా నేతలు ప్రసంగించారు. వర్షాలు లేకపోవడంతో ఈ ప్రాంత రైతులు తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు ఎదుర్కొంటున్నారని, ఇటువంటి పరిస్థితి మున్ముందు […]పూర్తి వివరాలు ...
కడప: ఒంటిమిట్ట కోదండరామాలయం సమీపంలోని రోడ్లు పునరుద్ధరించేందుకు, అలాగే రథం తిరిగే రోడ్డు వెంబడి మరమ్మతులు చేసేందుకు గాను ప్రభుత్వం 45 లక్షల రూపాయలను (G.O.RT.No. 242) మంజూరు చేసింది. ఈ మేరకు ప్రభుత్వం పేర (పంచాయతీ రాజ్ శాఖ) కార్యదర్శి కెఎస్ జవహర్ రెడ్డి జీవో నెంబరు 242ను మార్చి 11న విడుదల చేశారు. ఇందులో 40 లక్షల రూపాయలను వెచ్చించి వాహనశ్రేణి (విఐపి) తిరిగేందుకు వీలుగా ఆలయ సమీపంలోని రోడ్లను పునరుద్ధరిస్తారు. మిగతా ఐదు […]పూర్తి వివరాలు ...
అనుమానపు మగడు ఆ ఇల్లాలిని ఎంతో వేధించాడు. విసిగించాడు. పాపం ఆ ఇల్లాలు అతని సూటిపోటి మాటలు భరించలేకపోయింది. సుక్కబొట్టు పెట్టినా, రంగుచీర కట్టినా, అద్దంలో చూసినా, సహించలేని తన భర్తను గురించి ఆమె ఇలా చెప్తోంది… వర్గం: జట్టిజాం పాట పాడటానికి అనువైన రాగం: శుద్ధ సావేరి స్వరాలు (దేశాది తాళం) సుక్కబొట్టు పెట్టనీడు సుట్టాల సూడనీడు ఎన్నాళ్ళు కాయిలుంటడో ఈనాకుసించ ఎన్నాళ్ళు కాయిలుంటడో పచ్చబొట్టు పెట్టనీడు పసుపుసీరె కట్టనీడు ఎన్నాళ్ళు కాయిలుంటడో ఈనాకుసించ ఎన్నాళ్ళు […]పూర్తి వివరాలు ...
రాయలసీమ మహాసభ ఆదివారం జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకుంది.కడప జిల్లా కమిటీ సభ్యులు వీరే… అధ్యక్షుడు – ఎన్.ఎస్.ఖలందర్ ఉపాధ్యక్షులు – నూకా రాంప్రసాద్రెడ్డి, తవ్వా ఓబుల్రెడ్డి ప్రధాన కార్యదర్శి – జింకా సుబ్రహ్మణ్యం కార్యదర్శులు – సూర్యనారాయణరెడ్డి, పోలు కొండారెడ్డి సహాయ కార్యదర్శులు – గంగనపల్లె వెంకటరమణ, పుట్టా పెద్ద ఓబులేశు కోశాధికారి – మొగలిచెండు సురేశ్ కార్యవర్గ సభ్యులు – సాయిప్రసాద్, చంద్రశేఖర్రెడ్డి, జి.పార్వతీ టి.వెంకటయ్య, నాగరాజు కల్చరల్ కమిటీ కన్వీనర్ – ధర్మిశెట్టి […]పూర్తి వివరాలు ...
కడప: దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్పాండ్ ప్రాజెక్టును కేంద్రం తక్షణమే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని రాయలసీమ మహాసభ తీర్మానించింది. స్థానిక సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రంలో ఆదివారం జరిగిన సమావేశంలో సీమ జిల్లాలకు చెందిన రచయితలు, కళాకారులు, వివిధ ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాయలసీమ సమగ్రాభివృద్ధి సాధనే ధ్యేయంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాలని రాయలసీమ మహాసభ కేంద్రకమిటీ అధ్యక్షులు డా.శాంతినారాయణ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో పలు తీర్మానాలను ఆమోదించారు. పోలవరం వల్ల ప్రయోజనం స్వల్పమేనన్నారు. […]పూర్తి వివరాలు ...
ముఖ్యమంత్రిని కలిసేందుకు సతీష్ హామీ కడప: సంఖ్యాపరంగా, పాఠశాలల పరంగా చూసినా కడపలో ఉర్దూ విశ్వవిద్యాలయం సాధనకు మేం శాయశక్తులా కృషిచేస్తాం, విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామని శాసనమండలి ఉపాధ్యక్షుడు సతీష్రెడ్డి అన్నారు. యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 20రోజుల నుంచి కడప కలెక్టరేట్ వద్ద జరుగుతున్న నిరాహార దీక్షాశిబిరాన్ని సందర్శించిన సతీష్ నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింప చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోమవారమే ఉర్దూ యాక్షన్ కమిటీ అధ్యక్షుడు సలా ఉద్దీన్, ఇతర ప్రముఖులతో […]పూర్తి వివరాలు ...
ఒంటిమిట్ట: వాస్తు రీత్యా దక్షిణద్వారం అనర్థదాయకం కావడంతో కోదండ రామాలయ దక్షిణ ద్వారాన్ని మూసి వేయాలని జిల్లా సర్వోన్నత అధికారి కేవిరమణ అధికారులకు సూచించారు. ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవ ఏర్పాట్లను శనివారం జిల్లాకలెక్టరు కేవీ రమణ పరిశీలించారు. కల్యాణం నిర్వహించే ప్రదేశాన్ని పరిశీలించారు. బ్రహ్మోత్సవాల సమయంలో బారికేడ్లతో భక్తులకుఇబ్బందులు కలగకుండా పటిష్టమైన వరుసలు ఏర్పాటు చేయాలని అధికారులకు చెప్పారు. కల్యాణం నిర్వహించే ప్రాంత వంకను పూడ్చాలని జెడ్పీవైస్ఛైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి కలెక్టరు సూచించారు. ప్రస్తుతం సమయంతక్కువగా […]పూర్తి వివరాలు ...
కడప: జనవిజ్ఞానవేదిక కడప జిల్లా కమిటీ ప్రచురించిన ‘కూల్డ్రింక్స్ మానేద్దాం.. సహజ పానీయాలే తాగుదాం’ అన్న కరపత్రాలను ఇన్ఛార్జి జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి అరుణ సులోచనాదేవి శుక్రవారం జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారి కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పోషక విలువలు లేని, అనారోగ్య సమస్యలు సృష్టించే శీతల పానీయాలను తాగడం మానేయడం మంచిదన్నారు. శీతల పానీయాల్లో అదనపు క్యాలరీలు స్థూలకాయానికి దారితీస్తాయన్నారు. వాటిని ఎక్కువకాలం తాగితే మధుమేహం వచ్చే అవకాశం ఎక్కువన్నారు. చిన్నారులు శీతలపానీయాలు తాగకుండా తల్లిదండ్రులు నిరుత్సాహపరచాలని […]పూర్తి వివరాలు ...
ఒంటిమిట్ట : కోదండరాముని కల్యాణాన్ని ఏప్రిల్ 2న గవర్నర్ నరసింహన్ చేతులమీదుగా నిర్వహిస్తామని దేవాదాయశాఖ సహాయ కమిషనరు శంకర్బాలాజీ చెప్పారు. శుక్రవారం ఒంటిమిట్టలో పాత్రికేయులతో మాట్లాడుతూ… చేత్తో ఒలిచిన బియ్యం గింజలతో సీతారాముల తలంబ్రాల కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆయన తెలిపారు. చేత్తో ఒలిచిన బియ్యం గింజలను చుట్టుప్రక్కల గ్రామస్థులు 27 వరకూ తెచ్చి ఇవ్వవచ్చునన్నారు. ఈ ఏడాది నూతనంగా ప్రవేశ పెట్టే ఈ ఆచారాన్ని విజయవంతం చేయాలన్నారు. కల్యాణంలో పాల్గొనదలచిన 25లోగా భక్తులు రూ. వెయ్యి చెల్లించి […]పూర్తి వివరాలు ...