తితిదే ఆధీనంలోకి ఒంటిమిట్ట

    ఒంటిమిట్ట కోదండ రామాలయం

    తితిదే ఆధీనంలోకి ఒంటిమిట్ట

    మాట తప్పిన ప్రభుత్వం

    తితిదే అజమాయిషీలోకి కోదండరామాలయం

    కోదండరామయ్య బాగోగులకు ఇక కొండలరాయుడే దిక్కు

    ఒంటిమిట్ట: వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఒంటిమిట్టను మరో తిరుమలలా అభివృద్ది చేస్తానంటూ పోయిన బ్రహ్మోత్సవాల సందర్భంగా గొప్పలు పోయిన ముఖ్యమంత్రి చివరకు ఆ భాద్యత నుండి తప్పుకుని ఒంటిమిట్ట కోదండరాముని భారాన్ని కోనేటి రాయుడికి అప్పగించి చేతులు దులుపుకున్నారు.

    కడప జిల్లాలోని పురాతన ఆలయమైన ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని తితిదేలో విలీనం చేస్తున్నట్టు ఆ సంస్థ పాలకమండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి బుధవారం ఉదయం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రామాలయం అభివృద్ధికి విశేష కృషి చేస్తామని ఈ సందర్భంగా అన్నారు. ఆగమన శాస్త్ర నియామాల ప్రకారం విలీన కార్యక్రమం నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రంలో డిప్యూటీ ఈఓ కోలా భాస్కర్, పాలక మండలి సభ్యులు భాను ప్రకాశ్ రెడ్డి, పసుపులేటి హరిప్రసాద్, దాదాపు 40 మంది అధికారులు పాల్గొన్నారు.

    చదవండి :  పోటెత్తిన పోరు గిత్తలు

    ఇప్పటికే తితిదేలో విలీనమైన జిల్లాలోని ఆలయాల ఆలనా పాలనా, ఉత్సవాల నిర్వహణ సరిగా లేదని ఆరోపణలు వినిస్తున్న నేపధ్యంలో ఒంటిమిట్ట భవిష్యత్తుపై కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *