కడప జిల్లాపై బాబు వివక్ష: రామచంద్రయ్య

కడప జిల్లాపై బాబు వివక్ష: రామచంద్రయ్య

కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై కాంగ్రెస్ నేత సి. రామచంద్రయ్య మండిపడ్డారు. సోమవారం కడపలో విలేఖర్లతో మాట్లాడిన ఆయన జిల్లాలో రాజకీయంగా బలం లేదనే కారణంతో ఈ ప్రాంతంపై వివక్ష చూపుతున్నారని రామచంద్రయ్య ఆరోపించారు.

జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ప్రజలు ఓట్లు వేయలేదన్న నెపంతో వారిపై కక్ష కట్టడం సబబు కాదని ఆయన అన్నారు. సీఎం పథకాలు మంత్రులకే అర్ధం కావడం లేదని ఆయన విమర్శించారు. మంత్రులకే అర్ధంకాని పథకాలను ప్రజల వద్దకు ఎలా చేరుతాయని రామచంద్రయ్య ఘాటైన వ్యాఖ్యలు చేశారు.

చదవండి :  27న కడప జిల్లా భవిష్యత్ పై సదస్సు

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *