కడపలో బాలయ్య

కడపలో బాలయ్య

లెజెండ్ సినిమా విజయ యాత్రలో భాగంగా బాలయ్య, చిత్ర యూనిట్ తో కలిసి గురువారం కడపకు వచ్చారు. సాయంత్రం 4 గంటలకు ఆయన రవి  థియేటర్ వద్దకు రాగానే అభిమానులు ఈలలు, కేకలు వస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులనుద్దేశించి మాట్లాడారు. బాలయ్య కోసం ప్రత్యేక కథను రూపొందించి సినిమాను విడుదల చేసినట్లు దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు.థియేటర్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బాలయ్య ప్రసంగిస్తున్నంత సేపు అభిమానుల ఈలలు, కేకలతో థియేటర్ ప్రతిధ్వనించింది.

చదవండి :  మే 3 నుండి కడప - విజయవాడల నడుమ విమాన సర్వీసు

అనంతరం ఓపెన్ టాప్ జీపులో బాలకృష్ణ పెద్ద దర్గాకు చేరుకున్నారు. దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్‌షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ ఆశీస్సులు పొందారు. దర్శనం సమయం కాకపోవడంతో దర్గాలోని ప్రధాన గురువుల మజార్ వద్ద పూలచాదర్ సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తర్వాత దర్గాలోని ఇతర గరువుల మజార్లనూ దర్శించుకుని, ప్రార్థించారు

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *


error: