మార్చి 1 నుంచి 15 వరకు జిల్లాలో రాజీవ్ఆరోగ్యశ్రీ వైద్యశిబిరాలు
కడప : జిల్లాలో మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న రాజీవ్ఆరోగ్యశ్రీ వైద్యశిబిరాల వివరాలను రాజీవ్ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్ మార్కారెడ్డి తెలిపారు.
మార్చి 1న అట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్సీ) పరిధిలోని రెడ్డిపల్లిలో,
3న తొండూరు పీహెచ్సీ పరిధిలోని టి.తుమ్మలపల్లిలో,
4న నూలివీడు పీహెచ్సీ పరిధిలోని పులికుంటలో,
5న సిద్దవటం పీహెచ్సీ పరిదిలోని బేల్ధారి వీది(దిగువపేట),తొట్టిగారిపల్లి పీహెచ్సీ పరిదిలోని చిన్నకేశంపల్లిలో, ఆకేపాడు పీహెచ్సీ పరిధిలోని ఊటుకూరులో,
6న వల్లూరు పీహెచ్సీ పరిధిలోని సి.కొత్తపల్లిలో, సురబి పీహెచ్సీ పరిధిలోని మహదేవపల్లిలో, రాయచోటిలోని మాసాపేటలో, 8న చెన్నూరు పీహెచ్సీ పరిధిలోని ఓబుళంపల్లిలో,
9న వి.ఎన్.పల్లి పీహెచ్సీ పరిధిలోని గంగిరెడ్డిపల్లిలో, కొండాపురం పీహెచ్సీ పరిధిలోని వెంకయ్యకాల్వలో,
10న బిడినంచెర్ల పీహెచ్సీ పరిధిలోని బి.చెర్లోపల్లిలో,
11న రాజుపాళెం పీహెచ్సీ పరిధిలోని గాదెగూడూరులో, పోరుమామిళ్ల పీహెచ్సీ పరిధిలోని ముసలరెడ్డిపల్లిలో, సంబేపల్లి పీహెచ్సీ పరిధిలోని పెద్దజంగంపల్లిలో,
12న మెడిదిన్నె పీహెచ్సీ పరిధిలోని నెమళ్లదిన్నెలో, బి.కోడూరు పీహెచ్సీ పరిధిలోని పయలకుంట్లలో, మాదవరం పీహెచ్సీ పరిధిలోని పెద్దపల్లిలో,
13న నందిమండలం పీహెచ్సీ పరిధిలోని బాలయ్యగారిపల్లిలో, కామనూరు పీహెచ్సీ పరిధిలోని పెన్నానగర్లో,
15న దేవళంపళ్లి పీహెచ్సీ పరిధిలోని బి.యెర్రగుడిలో, దువ్వూరు పీహెచ్సీ పరిధిలోని నేలటూరులో వైద్యశిబిరాలు జరుగనున్నాయన్నారు.