బొబ్బిళ్ళ నాగిరెడ్డిని గురించిన జానపదగీతం

    బొబ్బిళ్ళ నాగిరెడ్డిని గురించిన జానపదగీతం

    బొబ్బిళ్ళ నాగిరెడ్డి గడేకల్లులో వెలసిన భీమలింగేశ్వర స్వామి వరప్రసాది అని ప్రతీతి. ఇతడు శ్రీమంతుల ఇల్లు దోచి బీదలకు పంచి పెట్టేవాడట. పట్టపగలు నట్ట నడివీధిలో ప్రత్యర్ధులు నాగిరెడ్డిని హతమార్చినారుట. ఆ సంఘటనను జానపదులు ఇలా పాటగా పాడినారు…

    చుట్టూ ముట్టూ పల్లెలకెల్ల శూరుడమ్మ నాగిరెడ్డి
    డెబ్బై ఏడు పల్లెలకెల్లా దేవుడమ్మా భీమలింగ

    రామ రామా కోదండరామా
    భై రామ రామా కోదండరామా

    పక్కనున్న పల్లెలకెల్ల పాలెగాడు నాగిరెడ్డి
    దిక్కుదిక్కుల పల్లెలకెల్ల దేవుడమ్మ భీమలింగ ||రామ||

    చదవండి :  యితనాల కడవాకి....! - జానపదగీతం

    మోపిడీ ముకష్టూరులోన రాయి రాయి గరిగే యాళ
    అగిడీవాళ్ల యిల్లుదూరి జీటినెంలరు జేసినాడు ||రామ||

    బళ్ళారి కచ్చేరికైన పట్టపగలె అగ్గిబెట్టి
    బళ్ళారి ఖజాన దోసి బీదబిక్కి కెగజల్లె ||రామ||

    బందిమింద రెడ్డి రాంగ పదిమంది చుట్టుముట్రి
    చిన్నలూరి మాదిగోడు పండబెట్టి గొంతుగోసె ||రామ||

    కొడుకు కొడుకంటాని గోడుగోడునె గౌరమ్మ
    బొబ్బిళ్ళ వంశమంత బుడు మారిపోయినాది

    రామ రామా కోదండరామా
    భై రామ రామా కోదండరామా

    జీటినెంలరు = దివీటీల వెలుగులో

    పాడినవారు: మాదిగ గంగన్న, మోపిడి, గుత్తి తాలూకా, అనంతపురం జిల్లా

    చదవండి :  బండీరా..పొగబండీరా... జానపదగీతం

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *