తితిదే ఆధీనంలోకి ఒంటిమిట్ట

ఒంటిమిట్ట కోదండ రామాలయం

తితిదే ఆధీనంలోకి ఒంటిమిట్ట

మాట తప్పిన ప్రభుత్వం

తితిదే అజమాయిషీలోకి కోదండరామాలయం

కోదండరామయ్య బాగోగులకు ఇక కొండలరాయుడే దిక్కు

ఒంటిమిట్ట: వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఒంటిమిట్టను మరో తిరుమలలా అభివృద్ది చేస్తానంటూ పోయిన బ్రహ్మోత్సవాల సందర్భంగా గొప్పలు పోయిన ముఖ్యమంత్రి చివరకు ఆ భాద్యత నుండి తప్పుకుని ఒంటిమిట్ట కోదండరాముని భారాన్ని కోనేటి రాయుడికి అప్పగించి చేతులు దులుపుకున్నారు.

కడప జిల్లాలోని పురాతన ఆలయమైన ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని తితిదేలో విలీనం చేస్తున్నట్టు ఆ సంస్థ పాలకమండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి బుధవారం ఉదయం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు. రామాలయం అభివృద్ధికి విశేష కృషి చేస్తామని ఈ సందర్భంగా అన్నారు. ఆగమన శాస్త్ర నియామాల ప్రకారం విలీన కార్యక్రమం నిర్వహించినట్టు వెల్లడించారు. ఈ కార్యక్రంలో డిప్యూటీ ఈఓ కోలా భాస్కర్, పాలక మండలి సభ్యులు భాను ప్రకాశ్ రెడ్డి, పసుపులేటి హరిప్రసాద్, దాదాపు 40 మంది అధికారులు పాల్గొన్నారు.

చదవండి :  సంప్రదాయం ప్రకారమే కోదండరాముని పెళ్లి

ఇప్పటికే తితిదేలో విలీనమైన జిల్లాలోని ఆలయాల ఆలనా పాలనా, ఉత్సవాల నిర్వహణ సరిగా లేదని ఆరోపణలు వినిస్తున్న నేపధ్యంలో ఒంటిమిట్ట భవిష్యత్తుపై కొత్త ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *