ఫిరాయించిన ముగ్గురు వైకాపా కౌన్సిలర్లపై అనర్హత వేటు

ఫిరాయించిన ముగ్గురు వైకాపా కౌన్సిలర్లపై అనర్హత వేటు

రాయచోటి : మునిసిపల్‌ ఛైర్మన్‌, వైస్‌ ఛైర్మన్‌ ఎన్నిక సందర్భంగా విప్‌ ధిక్కరించినందుకు ముగ్గురు కౌన్సిలర్లపై మంగళవారం అనర్హత వేటు పడింది. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి నరసింహులునాయక్‌ ఈ మేరకు ఆదేశాలు ఇచ్చారు.

మునిసిపాలిటీలోని 4వ వార్డు కౌన్సిలర్‌ అనీఫా, 12వ వార్డు కౌన్సిలర్‌ మహబూబ్‌బాష, 21వ వార్డు కౌన్సిలర్‌ షాహిరున్నీసాలపైన ఈ వేటు పడింది. పార్టీ నిర్ణయాన్ని ధిక్కరించి, ఛైర్మన్‌, వైస్‌ఛైర్మన్‌లుగా పార్టీ బలపరిచిన అభ్యర్ధికి ఓటు వేయలేదంటూ వైకాపా నాయకులు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు.

చదవండి :  ఒకే దోవలో నాలుగు పురపాలికలు సైకిల్ చేతికి

అయితే తమకు పార్టీ విప్‌ అందలేదని, కాబట్టి తమకు విప్‌ ధిక్కరణ వర్తించదని, ఆముగ్గురు కౌన్సిలర్లుసమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో ఆ ముగ్గురిపై అనర్హత వేటు వేస్తూ..కౌన్సిలర్‌గా వాళ్ల అధికారాలను నిలుపుదల చేస్తున్నట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు.

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *