7న కడపకు బాబు

7న కడపకు బాబు

తెదేపా అధినేత చంద్రబాబు ప్రజాగర్జన సభ కోసం 7న జిల్లాకు రానున్నారు. ఈ మేరకు చంద్రబాబు పర్యటన వివరాలు జిల్లా నాయకత్వానికి అధిష్ఠానం సమాచారం అందించింది. గతంలో మార్చి 27న నిర్వహించాలని ముందుగా భావించినా వాయిదా వేశారు.

చంద్రబాబునాయుడు ప్రజాగర్జనను కడపలో ఏ మైదానంలో నిర్వహించాలి అనే అంశాన్ని జిల్లా కేంద్రంలోని నేతలు పరిశీలిస్తున్నారు. జిల్లాలో పార్టీ వ్యవహారాలు చూస్తున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కూడా చంద్రబాబు పర్యటనపై జిల్లా నేతలతో మాట్లాడినట్లు సమాచారం.

చదవండి :  ఎర్రగుంట్ల కౌన్సిలర్లపై అనర్హత వేటు

ప్రజాగర్జనకు భారీగా జనసమీకరణ చేసేందుకు దేశం నేతలు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి స్థానిక, ముసిపల్ ఎన్నికలు ముగిసిన తర్వాత గర్జన చేయడం వెనుక చంద్రబాబు, తెదేపా నేతలు వ్యూహమేమిటో!

వార్తా విభాగం

ఇవీ చదవండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *