Tags :vontimitta

ప్రత్యేక వార్తలు

సంప్రదాయం ప్రకారమే కోదండరాముని పెళ్లి

ఒంటిమిట్ట : కోదండరాముని పెళ్లి ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్‌వీ ప్రసాద్ తెలిపారు. స్థానిక కోదండ రామాలయాన్ని బుధవారం ఆయన పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఒంటిమిట్ట కోదండ రామాలయ సంప్రదాయాల ప్రకారం అన్ని కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఆలయంలో కల్యాణం ఎప్పటిలాగానే రాత్రి సమయంలో నిర్వహిస్తామన్నారు. ఒంటిమిట్ట కోదండ రామాలయం, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుపతి, తిరుమలను ఒక సర్క్యూట్‌గా ఏర్పాటు చేసి పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరుస్తామన్నారు. […]పూర్తి వివరాలు ...

పర్యాటకం

కోదండరామాలయంలో జరిగే పూజలు, సేవలు

ఒంటిమిట్ట కోదండరామాలయంలో జరిగే పూజలు, సేవలలో పాల్గొనాలనుకునే భక్తుల కోసం …. శాశ్వత పూజా వివరములు: నైవేద్య పూజ రూ 500 శాశ్వత అభిషేకం రూ 1116 పుష్ప కైంకర్యం రూ 1500 అన్నదానం రూ 2500 బ్రహ్మోత్సవ సమయములో పగటి ఉత్సవము రూ 15000 రాత్రి ఉత్సవము రూ 25000 సేవా టికెట్ల వివరములు అర్చన 10-00 కుంకుమార్చన 20-00 సహస్రనామార్చన 30-00 కేశఖండన 10-00 అభిషేకం 150-00 అంతరాలయ దర్శనం 50-00 వివాహ కట్టడి […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

15 వేలతో కోదండరామునికి తలంబ్రాలూ, పట్టు గుడ్డలు

ఒంటిమిట్ట (ఇంగ్లీషు: Ontimitta) కోదండరామునికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పించేందుకు ముందుకు వచ్చిన ఆం.ప్ర ప్రభుత్వం అందుకోసం 15 వేల రూపాయలు (INR 15000 Only) కేటాయించింది. ఇందుకు సంబంధించి ఆం.ప్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ కార్యదర్శి  జెఎస్వి ప్రసాద్ పేర ప్రభుత్వం జీవో నెంబరు 63ను విడుదల చేసింది (ఫిబ్రవరి 21, 2015న). ఇందులో రాష్ట్ర విభజన నేపధ్యంలో ఒంటిమిట్ట ఆలయానికి ప్రభుత్వ లాంఛనాలు సమర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే స్వామి, అమ్మవార్లకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాల కోసం […]పూర్తి వివరాలు ...

చరిత్ర

ఒంటిమిట్టకు ఆ పేరెలా వచ్చింది?

ఒంటిమిట్ట, వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రము. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఒంటడు, మిట్టడు అనే ఇద్దరు వ్యక్తుల కారణంగా ఈ ఊరికి ఒంటిమిట్ట అనే పేరు వచ్చిందిట. ఒక రోజు ఉదయగిరి సీమలో భాగంగా ఉండిన ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తుండిన కంపనరాయలు అనే రాజు ఇప్పుడు ఒంటిమిట్ట ఉన్న ప్రాంతానికి తన సైన్యంతో సహా వచ్చినాడు. ఇది అప్పట్లో దట్టమైన అరణ్యం మధ్యలో ఉన్న ఒక […]పూర్తి వివరాలు ...

పర్యాటకం

ఒంటిమిట్టకు ఎలా చేరుకోవచ్చు?

ఒంటిమిట్ట, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని వైఎస్ఆర్ జిల్లాకు చెందిన ఒక మండల కేంద్రము. కడప నుంచి రాజంపేటకు వెళ్ళే మార్గంలో 27 కి.మీ. దూరంలో ఒంటిమిట్ట ఉంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన కోదండ రామాలయం ఉంది. వివిధ మార్గాలలో ఒంటిమిట్టకు ఇలా చేరుకోవచ్చు… రోడ్డు మార్గంలో… బస్సు ద్వారా… దగ్గరి బస్ స్టేషన్: కడప (27 KM), రాజంపేట (29 KM) కడప, రాజంపేటల నుంచి ప్రతి పది నిమిషాలకు ఒంటిమిట్ట మీదుగా వెళ్ళే బస్సు సర్వీసులు […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

ఒంటిమిట్ట రాముడికే : దేవాదాయ శాఖా మంత్రి

ఒంటిమిట్ట: కడప జిల్లా ఒంటిమిట్టలో అధికారికంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ సర్కార్ నిర్ణయం తీసుకున్నట్లు దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు శుక్రవారం హైదరాబాదులో తెలిపారు. ఆ రోజు స్వామివారికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పిస్తారని చెప్పారు. 11వ శతాబ్దంలోనే ఈ దేవాలయం నిర్మించినట్లు ఆధారాలున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. కోదండరామాలయాన్నిపరిశీలించిన ప్రిన్పిపల్ సెక్రటరీ స్థానిక కోదండరామాలయాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్పిపల్ కార్యదర్శి ఏవీఎస్ ప్రసాద్, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, […]పూర్తి వివరాలు ...

పర్యాటకం శాసనాలు

పౌరాణిక భౌగోళిక చారిత్రక ప్రాధాన్యాన్ని నింపుకొన్న ఒంటిమిట్ట

పౌరాణికం 1. సీతారామలక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్నపుడు సీతమ్మ కోసం రామయ్య బాణం సంధించి భూమి నుంచి నీరు తెప్పించిన చోటు ఇక్కడుంది. అక్కడే నేడు రామతీర్థం వెలసింది. 2. సీతమ్మ కోసం వెతుకుతూ జాంబవంతుడు ఇక్కడ ఒక రాత్రి నిద్రించాడు. మరునాటి ఉదయం ఒక శిలలో సీతారామలక్ష్మణుల్ని, భావించి నమస్కరించి అన్వేషణకు బయలుదేరాడు. ఈ గుట్ట మీద నిర్మాణం అయిందే కోదండరామాలయం. భౌగోళికం తిరుమల నుంచి కడపకు వస్తున్న శేషాచలం కొండలు ఒంటిమిట్టను దాటుకొంటూ విస్తరించాయి. ఆ […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

ఒంటిమిట్ట రామయ్యకు ప్రభుత్వ లాంఛనాలు?

కడప: ఒంటిమిట్ట కోదండ రామాలయానికే శ్రీరామనవమి నాడు ప్రభుత్వ లాంఛనాలు అందజేసేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అంగీకరించినట్లు సమాచారం. ప్రభుత్వం వైపు నుంచి ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. రాష్ర్టం విడిపోయిన నేపధ్యంలో రాష్ట్రంలోని అత్యంత పురాతనమైన, గొప్ప ప్రశస్తి గల ఒంటిమిట్ట కోదండ రామయ్యకు ప్రభుత్వ లాంచనాలు అందుతాయని జిల్లా ప్రజలు ఆశించారు. విజయనగరం జిల్లాలోని రామతీర్థం రామాలయానికి ఆ హోదా దక్కనుందని ఒక వర్గం మీడియాలో ప్రచారం జోరందుకుంది. దీంతో ఒంటిమిట్టకే రాజ […]పూర్తి వివరాలు ...

ఆచార వ్యవహారాలు

మార్చి 26 నుంచి ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు

ఒంటిమిట్ట: కోదండరాముని శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు మార్చి 27వ తేదీతో ప్రారంభమై, ఏప్రిల్ 6తో ముగియనున్నాయి. ఉత్సవాలలో భాగంగా ప్రతిరోజు రాత్రి ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేస్తారు. బ్రహ్మోత్సవాల గోడపత్రాలను ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ఆదివారం విడుదలచేశారు. ముఖ్యమంత్రికి స్వయంగా ఒంటిమిట్ట కోదండరాముడి గురించి తాను వివరించానన్నారు. ఒంటిమిట్ట, రామతీర్థం ఆలయాలకు సంబంధించిన నివేదకలను తెప్పించుకొని, పరిశీలించిన పిదప ప్రభుత్వ లాంచనాల విషయంలో ఓ నిర్ణయానికి వద్దామని సీఎం చెప్పారన్నారు. రామాలయానికి దాతల సహకారంతో ఒంటిమిట్ట కొదందరామాలయంలో […]పూర్తి వివరాలు ...