Tags :rayalaseema

    జీవోలు ప్రత్యేక వార్తలు

    తెదేపా ప్రభుత్వం విడుదల చేసిన జీవో 120 ఇదే!

    కడప: అడ్డగోలుగా సీమ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నతెదేపా సర్కార్ 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే సీమ విద్యార్థుల నోట్లో మట్టి కొట్టి కోస్తా విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చేదానికి 23.08.2014న పద్మావతి మహిళా వైద్య కళాశాల (తిరుపతి) ప్రవేశాలకు సంబంధించి ‘జీవో 120’ని విడుదల చేసింది. ఈ సంవత్సరం కొంతమంది రాయలసీమ విద్యార్థులు కోర్టు గడప ఎక్కడంతో రాష్ట్రపతి ఉత్తర్వులను పక్కన పట్టి బరితెగించి, అడ్డగోలుగా తెదేపా ప్రభుత్వం విడుదల చేసిన ఈ జీవో 120 వ్యవహారం వెలుగులోకి వచ్చింది. […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    అశోకుడికి ‘కరువు’ విషయంలో సానుభూతి లేదేం?

    అశోకుడిగా ఎన్జీవోలు సరదాగా పిలుచుకునే ఏపీ ఎన్జీవోల సంఘం అధ్యక్షుడు ‘అశోక్ బాబు’ ఉదార స్వభావం కలిగిన వాడు. ప్రకృతి వైపరీత్యాల బారినపడ్డ ప్రజల బాధలను చూసినా, విన్నా చలించిపోయే సుతి మెత్తని మనస్సు కలిగిన వాడు. కాబట్టే అతివృష్టి కారణంగా దెబ్బతిన్న విశాఖను ఆదుకోవటానికి ఉద్యోగుల జీతం నుంచి ఉదారంగా విరాళం ప్రకటించేశాడు. ఆనక కొత్త రాజధాని కట్టడానికి డబ్బులు లేవు విరాళాలు ఇవ్వండి బాబూ అని డబ్బాలు ఏర్పాటు చేసి కొత్తగా కొలువుదీరిన ఆం.ప్ర […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు రాయలసీమ

    కడప జిల్లాపై ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోంది: గేయానంద్

    ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజాఉద్యమం సీమ ప్రజలంతా పోరుబాటకు సిద్ధం కావాల ప్రొద్దుటూరు: కడప జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం అలవికాని నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తూ, తీవ్ర వివక్ష చూపుతోందని శాసనమండలి సభ్యుడు డాక్టరుఎం.గేయానంద్ పేర్కొన్నారు. శుక్రవారం ప్రొద్దుటూరులో ఒక ఆసుపత్రిలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ… రాయలసీమకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఇచ్చినహామీలు ఇంతవరకు అమలు కాలేదన్నారు. నదీజలాల పంపకంలో రాయలసీమకు అన్యాయం జరిగిందన్నారు. రాయలసీమ అభివృద్ది విషయంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రజాఉద్యమం చేస్తామని హెచ్చరించారు.వెనకబడిన రాయలసీమ అభివృద్ధి కోసం ప్రజలంతా పోరుబాటకు సిద్ధం […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    ప్రత్యేక రాయలసీమ కోసం మళ్లీ ఉద్యమించాల్సిన సమయమొచ్చింది : డిఎల్

    బాబు సీమపైన వివక్ష చూపుతున్నారు ఇలాంటి కలెక్టర్ను ఎప్పుడూ చూడలేదు ప్రొద్దుటూరు: నేటి సమకాలీన రాజకీయ పరిమణాలు దృష్ట్యా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం ఏర్పాటు కోసం మళ్లీ ఉద్యమించాల్సిన తరుణం ఆసన్నమైందని లేకపోతే రాయలసీమ జిల్లాలకు మనుగడ ఉండదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి డీఎల్.రవీంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. ఆదివారం ప్రొద్దుటూరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటైన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ…రాయలసీమలో పుట్టిన చంద్రబాబు ఈ ప్రాంతం పైన వివక్ష చూపడం దారుణమన్నారు. రాయలసీమ పరిధిలోనే […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    నో డౌట్…పట్టిసీమ డెల్టా కోసమే!

    తేల్చిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ వేమూరి రాధాకృష్ణ – ఆంధ్రజ్యోతి మీడియా గ్రూపుకు అధిపతి, ఆం.ప్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఆప్తుడు, ఆంతరంగికుడు అని తెదేపా వర్గాలు చెబుతుంటాయి. రాధాకృష్ణ గారు ‘కొత్తపలుకు’ పేర ఇవాళ ఆంధ్రజ్యోతిలో రాసిన సంపాదకీయంలో ‘పట్టిసీమ’ అసలు గుట్టు విప్పినారు. ఇదే విషయాన్ని కడప.ఇన్ఫో రాస్తే అదంతా ఊహే అని తీసిపారేశారు కొంతమంది. ‘వాస్తవానికి, పట్టిసీమ అనేది తాత్కాలికంగా చేస్తున్న ఏర్పాటు మాత్రమే! పోలవరం ప్రాజెక్టును నాలుగేళ్లలో పూర్తి చేస్తామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నప్పటికీ, […]పూర్తి వివరాలు ...

    అభిప్రాయం రాయలసీమ

    పట్టిసీమ మనకోసమేనా? : 2

    కడప జిల్లా లేదా సీమ సమస్యలపైన ఎవరేనా అఖిలపక్ష సమావేశం లాంటిది ఏర్పాటు చేస్తే అక్కడకు వెళ్ళాలంటే వీళ్ళకు భయం. సదరు విషయం మరుసటి రోజు పత్రికలలో వచ్చీ,  విషయం అధినేత దృష్టికి వెళితే మైలేజీ తగ్గిపోతుందని వీరి బెంగ కావచ్చు. ఇలా మైలేజీ తగ్గటం చాత దక్కవలసిన నామినేటేడ్ పదవులు కూడా దూరమవుతాయని భయం కూడా ఉండొచ్చు. ఇన్ని విషయాలలో నిశ్శబ్దంగా ఉన్న కడప జిల్లా తెదేపా నేతలు ఒకేసారి పులివెందుల వీధుల్లోకి వెళ్లి పట్టిసీమ […]పూర్తి వివరాలు ...

    అభిప్రాయం

    పట్టిసీమ మనకోసమేనా? : 1

    సన్నివేశం 1: ఈ మధ్య ఒక రోజు (సోమవారం అని గుర్తు) కడప జిల్లాలో తెలుగుదేశం నేతలందరూ ఒకేసారి మేల్కొన్నారు. మెలకువ రాగానే అంతా తమ అనుచరగణాన్ని వెంటేసుకొని పులివెందుల వైపు పరిగెత్తారు. పొద్దున్నే పులివెందుల పట్టణమంతా పచ్చ జెండాలూ, పచ్చ కండువాలు – పూల అంగళ్ళ కూడలి వద్ద పూలమ్ముకునే వాళ్ళు హాశ్చర్యపోయేంతగా! పొద్దున్నే పూలు కొనటానికి వచ్చిన ఒక పల్లెటూరి రైతు ‘ఏంటీ పసుపు పరిమళాల సందడి?’ అని అడిగేడుట. అందుకు ఆ పూలమ్మే […]పూర్తి వివరాలు ...

    రాయలసీమ వార్తలు

    సీమలో రాజధాని లేదా హైకోర్టు ఏర్పాటు చేయాల

    హైదరాబాదు:  అన్ని విధాలుగా వెనుకబడిన రాయలసీమలో రాజధాని లేదా హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి  జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన ప్రజల్లో కూడా ఉందని ఆయన అన్నారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘ గ్రేటర్ రాయలసీమలో హైకోర్టు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ… రాయలసీమ వెనుకబాటుతనం గురించి ఎవ్వరూ […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు రాయలసీమ

    రాజధానికి నీటిని తరిలించేందుకే ‘పట్టిసీమ’ : బివిరాఘవులు

    సీమ కోసం పోరాడేందుకు అఖిలపక్షం, ప్రజా సంఘాలు కలసి రావాలి జాతీయ జెండా సాక్షిగా చంద్రబాబు విఫలం కర్నూలు: రాయలసీమ అభివృద్ధికి సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం సాగిస్తామని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు చెప్పారు. బుధవారం కర్నూలులోని సి.క్యాంప్ సెంటర్‌లోని లలిత కళాసమితిలో ‘రాయలసీమ అభివృద్ధి- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో రాయలసీమకు తీరని అన్యాయం జరిగిందన్నారు. కొత్త రాష్ట్రంలో తొలి […]పూర్తి వివరాలు ...