బర్తరఫ్పై డిఎల్ ఆవేదనను వ్యక్తం చేస్తూ అధిష్ఠానం ఇలా చేస్తుందని అనుకోలేదన్నారు. ముఖ్యమంత్రి ఎన్.కిరణ్కుమార్రెడ్డితో తనకు వ్యక్తిగత విభేదాలు లేవని డిఎల్.రవీంద్రారెడ్డి అన్నారు. ప్రస్తుతం లండన్లో ఉన్న డిఎల్ టీవీ ఛానళ్లతో టెలిఫోన్లో మాట్లాడుతూ ముఖ్యమంత్రితో తనకు విధానపరమైన విభేదాలు మాత్రమే ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో విధానపరమైన విభేదాలుం డడటం సహజమన్నారు. పార్టీ శ్రేయస్సు కోసమే తాను ఆరాటపడ్డానని వ్యాఖ్యానించారు. గతంలో తాను రాజీనామా చేశానని తన రాజీనామాను ఇంకా ఆమోదించాల్సి ఉందని డిఎల్ అన్నారు. అచ్చిరాని వైద్య […]పూర్తి వివరాలు ...
Tags :dl
మంత్రి డిఎల్.రవీంద్రారెడ్డిపై ముఖ్య మంత్రి ఎన్.కిరణ్కుమార్రెడ్డి బర్తరఫ్ వేటు వేశారు. ఇప్పటి వరకు ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం మంత్రిగా డిఎల్ బాధ్యతలు నిర్వర్తించారు. డిఎల్ను బర్తరఫ్ చేస్తూ శనివారం గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్కు ముఖ్యమంత్రి సిఫార్సు చేయగా, ఆ వెనువెంటనే గవర్నర్ ఆమోదముద్ర వేయడం జరిగి పోయాయి. కిరణ్ కుమార్ రెడ్డితో విభేదాల కారణంగానే డిఎల్ని మంత్రి వర్గం నుంచి తప్పించినట్లు సమాచారం. డిఎల్ మంత్రిగా ఉంటూనే పదే పదే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటనలు చేస్తున్నారని, సోనియా […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: జిల్లా అభివృద్ధికి, తాగునీటి ఎద్దడి నివారణకు కావాల్సిన నిధులను మంజూరు చేయాలని జిల్లాలోని ముగ్గురు మంత్రులమయిన సీ.రామచంద్రయ్య, అహ్మదుల్లా, తాను ఎన్నో సార్లు కలిసి విన్నవించినా సీఎం కిరణ్కుమార్రెడ్డి స్పందించడంలేదని మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి చెప్పారు. తమిళనాడు గవర్నర్ రోశయ్యను కలిసేందుకు శుక్రవారం ప్రొద్దుటూరుకు వచ్చిన డీఎల్ ఈ మ్లేరకు విలేకరులతో మాట్లాడారు.పూర్తి వివరాలు ...
ఇంట గెలవని వారు రచ్చగెలుస్తారా అనేది సామెత. ఇక్కడ డీఎల్, మైసూరా మాత్రం సొంతింట్లో చీదరింపునకు గురయ్యారు. ఓటర్లు వారికి వ్యతిరేకంగా ఓట్లు వేసి తిరస్కరించారు. వారిద్దరూ తమ సొంత నియోజక వర్గాల్లో మెజారిటీ తెచ్చుకోకపోవటం అటుంచి కనీసం జగన్కు వచ్చిన ఓట్లకు దరిదాపుల్లో కూడా లేరు. మైదుకూరు నియోజకవర్గంలో డీఎల్కు 25,432 ఓట్లు వస్తే అదే నియోజక వర్గంలో జగన్కు 95,579 దక్కాయి. కాంగ్రెస్ అభ్యర్థి డీఎల్ కంటే 71,147 ఓట్లు ఆధిక్యం! తెదేపా అభ్యర్థి మైసూరాకు […]పూర్తి వివరాలు ...
కడప పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన రెడ్డి రాష్ట్ర స్థాయిలో రికార్డు మెజార్టీతో ఘనవిజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డిపై ఆయన భారీ ఆధిక్యత సాధించారు. జగన్మోహన్ రెడ్డి 545672 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. ఆయనకు అన్ని నియోజకవర్గాలలో అరవై వేలకు పైగా ఓట్ల మెజార్టీ రావడం విశేషం. కడప లోక్ సభ పరిధిలోని ఏడు […]పూర్తి వివరాలు ...
వైఎస్ జగన్మోహన్రెడ్డికి రెండు లక్షల మెజార్టీ వస్తే తమ ఆస్తులు రాసిస్తామని చెప్పిన మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి, ఎమ్మెల్యే వీరశివారెడ్డి సవాలు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెసేకు ఓటమి తధ్యం అని ప్రచారం ఊపందుకున్న ప్రస్తుత సమయంలో…ఆ సవాలుకు డీఎల్, వీరశివా కట్టుబడి ఉండాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, మాజీ మేయర్ పి.రవీంద్రనాథ్రెడ్డి సూచించారు. వారు ఉప్పూ, కారం తిని ఉంటే, చీము నెత్తురు, కడప పౌరుషం ఉంటే ఆస్తులు రాసిస్తామనే మాటకు కట్టుబడి […]పూర్తి వివరాలు ...
ఉప ఎన్నికల్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్లాల్ నియంతలా వ్యవహరించారని కడప కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థి డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపించారు. నిబంధనలను పట్టుకొని వాటికనుగుణంగా వ్యవహరించారు తప్పితే తాము చెప్పింది ఎంతమాత్రం వినిపించుకోలేదని, చివరకు రిగ్గింగ్ ఆరోపణలను సైతం పట్టించుకోలేదని ఆయన తన హోదాకు తగినట్లుగా ఆయన వ్యవహరించి ఉండాల్సిందని, ఆయన తీరు సరైంది కాదని దుయ్యబట్టారు. మంగళవారం సాయంత్రం ఢిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆరోపణలకు ఆధారాలు చెప్పమంటున్న భన్వర్లాల్… తాము […]పూర్తి వివరాలు ...
వైఎస్ఆర్ జిల్లాలో జరిగిన ఉప ఎన్నికల్లో రీపోలింగ్ గురించి ఎలాంటి ఫిర్యాదులు అందలేదని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి భన్వర్లాల్ స్పష్టం చేశారు. ఎన్నికల పరిశీలనాధికారులు అందించే నివేదికలను కేంద్ర ఎన్నికల సంఘానికి అందిస్తామన్నారు. ఎన్నికల ప్రచారంలో ఎక్కడా మాట్లాడని పులివెందుల వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ అభ్యర్ధి , దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి భార్య వై.ఎస్.విజయలక్ష్మి ఎన్నికల పోలింగ్ ముగిశాక కూడా మాట్లాడలేదు. అవిడను మాట్లాడవలసిందిగా మీడియా పదే,పదే కోరినా, నవ్వుతూ తిరస్కరించారు. కడప లోకసభ, పులివెందుల అసెంబ్లీలకు ఉప […]పూర్తి వివరాలు ...
కడప లోక్ సభ నియోజకవర్గం లో మొదటి గంటలో 15 శాతం ఓట్లు పోలయ్యాయి. సాయంత్రానికి ఎనబైశాతం నుంచి ఎనభై ఐదు శాతం ఓట్లు పోల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.కాగా కొన్ని చోట్ల ఓటింగ్ యంత్రాలు మొరాయిస్తున్నాయి. ఎండల కారణంగా కూడా ప్రజలు ఉదయానే పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు.ముఖ్య ఎన్నికల అధికారి బన్వర్ లాల్ వీడియో ద్వారా ప్రత్యక్ష ప్రసారం లో పోలింగ్ సరళిని పరిశీలిస్తున్నారు. పులివెందుల శాసనసభ స్థానానికి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ […]పూర్తి వివరాలు ...