Tags :యోగివేమన విశ్వవిద్యాలయం

ప్రత్యేక వార్తలు

పరీక్షలు జరిగిన 24 గంటల్లోపే పీజీసెట్ ఫలితాలు

యోగి వేమన విశ్వవిద్యాలయం ఘనత కడప: పరీక్షలు జరిగిన 24 గంటల్లోపే పీజీ ప్రవేశ పరీక్ష (పీజీసెట్ 2016) ఫలితాలను ప్రకటించి యోగి వేమన విశ్వవిద్యాలయ రికార్డు సృష్టించింది. శుక్రవారం రాత్రి 7 గంటలకు ఉపకులపతి ఆచార్య బేతనభట్ల శ్యామసుందర్‌ ఈ ఫలితాలను విడుదల చేశారు.ఈ సందర్భంగా పీజీసెట్ కన్వీనర్  ఆచార్య రఘునాథరెడ్డి మాట్లాడుతూ ఈ నెల 1, 2 తేదీల్లో జరిగిన వైవీయూ సెట్‌కు 2,602 మంది అభ్యర్థులు పరీక్ష రాయగా 2,356 మంది అర్హత […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం ప్రత్యేక వార్తలు వ్యాసాలు

‘సాహిత్య విమర్శ’లో రారాకు చోటు కల్పించని యోవేవి

తెలుగులో రెండు సంవత్సరాల ఎం.ఏ కోర్సును అందిస్తున్న కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయం నాలుగవ సెమిస్టర్ లో విద్యార్థులకు ‘తెలుగు సాహిత్య విమర్శ’ (పేపర్ 401) పేర ఒక సబ్జెక్టును బోధిస్తోంది. వల్లంపాటి వెంకటసుబ్బయ్య, రాచపాలెం, ఆరుద్ర, ఎస్వీ రామారావు, లక్ష్మణ చక్రవర్తి, జివి సుబ్రహ్మణ్యం, బ్రహ్మానంద, వీరభద్రయ్య తదితరుల రచనలకు ఇందులో చోటు కల్పించిన యోవేవి రాచమల్లు రామచంద్రారెడ్డి రాసిన విమర్శా వ్యాసాలకు కనీసం చోటు కల్పించకపోవటం గర్హనీయం.(http://www.yogivemanauniversity.ac.in/fwd/TELUGU.pdf) తెలుగు సాహితీ జగత్తులో విమర్శలో తనదైన ముద్ర […]పూర్తి వివరాలు ...

వార్తలు

ఈరోజు యోవేవిలో మనోవిజ్ఞానశాస్త్ర అవగాహన సదస్సు

కడప: ప్రపంచ మానసిక ఆరోగ్య దినం సందర్భంగా శుక్రవారం యోగివేమన విశ్వవిద్యాలయం ప్రాంగణంలో మనోవిజ్ఞానశాస్త్ర శాఖ అవగాహన సదస్సు నిర్వహిస్తోంది. సాయంత్రం 3 గంటలకు విశ్వవిద్యాలయంలోని సర్.సి.వి.రామన్ సెమినార్ హాల్లో జరిగే సదస్సునకు ప్రముఖ మానసిక వైద్యులు డాక్టరు అశోక్‌కుమార్, డాక్టరు వెంకట్రాముడు హాజరవుతున్నారు. ఆసక్తి కలవారు హాజరుకావాలని విశ్వవిద్యాలయ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.పూర్తి వివరాలు ...

వార్తలు

ఏప్రిల్ 2 నుంచి యోవేవి డిగ్రీ పరీక్షలు

యోగివేమన విశ్వవిద్యాలయ పరిధిలోని డిగ్రీ కళాశాలల విద్యార్థుల వార్షిక పరీక్షలు ఏప్రిల్ రెండు నుంచి మే ఒకటో తేదీ వరకు నిర్వహిస్తామని పరీక్షల నిర్వహణ అధికారి ఆచార్య సాంబశివారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బేతనభట్ల శ్యామసుందర్ ఆదేశాల మేరకు ఈ తేదీలు నిర్ణయించామన్నారు. పూర్తిస్థాయి పరీక్షల షెడ్యూలును విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతామని అలానే ఆయా కళాశాలలకు పంపుతామని ఆయన చెప్పారు.పూర్తి వివరాలు ...

వ్యాసాలు

21వ శతాబ్ది తెలుగు సాహిత్యం తీరుతెన్నులు – 3వ రోజు

కథానిక, నవల, నాటకం ఏదైనా తెలుగు సాహిత్యం సామాజిక చైతన్యానికి- రుగ్మతలు రూపుమాపటానికి ఉపయుక్తమవుతుందని తెలుగు శాఖ సహ ఆచార్యుడు తప్పెట రామప్రసాద్‌రెడ్డి వివరించారు. యోగివేమన విశ్వవిద్యాలయంలో ’21వ శతాబ్ది తెలుగు సాహిత్యం తీరుతెన్నులు’ అనే అంశంపై మూడు రోజుల జాతీయ సదస్సులో శుక్రవారం ఆయన అధ్యక్షోపన్యాసం చేశారు. మూఢాచారాలను రూపుమాపేందుకు సాహిత్యం ఆయుధమన్నారు. 21వ శతాబ్ది సాహిత్యం మరింత పదునైన ఆయుధంగా రూపుదిద్దుకొంటోందని సంతృప్తి వ్యక్తం చేశారు. సమాజం మరింత పురోభివృద్ధి చెందటానికి తనవంతు పాత్ర […]పూర్తి వివరాలు ...

వార్తలు వ్యాసాలు

21వ శతాబ్ది తెలుగు సాహిత్యం.. తీరుతెన్నులు

యోగివేమన విశ్వవిద్యాలయంలో ’21వ శతాబ్ది తెలుగు సాహిత్యం.. తీరుతెన్నులు’ అనే అంశంపై జాతీయ సదస్సు రెండో రోజు సి.వి.రామన్ విజ్ఞాన భవన్‌లో కొనసాగింది. ఈ సదస్సులో తెలుగుశాఖ సమన్వయకర్త ఆచార్య ఎన్.ఈశ్వరరెడ్డి మాట్లాడుతూ సంప్రదాయాలను, విలువలను జీవన మార్గాలనే మార్చివేసేంతగా సాహిత్యం ప్రభావం చూపిందన్నారు. రైతులు నేత కార్మికులు ఇతర వృత్తి కారులు జీవన విద్వంసానికి గురయ్యారన్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికరంగం మనిషిని మనిషిగా బతకనీయకుండా చేస్తున్నట్లు ఆవేదన వ్యక్తంచేశారు. పేదలు- ధనికులకు మధ్య పెరుగుతున్న అంతరం […]పూర్తి వివరాలు ...

వార్తలు వ్యాసాలు

తెలుగు సాహిత్యం తీరుతెన్నులపై జాతీయ సదస్సు

యోగివేమన విశ్వవిద్యాలయం తెలుగుశాఖ ఆధ్వర్యంలో ’21వ శతాబ్దిలో తెలుగు సాహిత్యం తీరుతెన్నులు’ అనే అంశంపై జాతీయ సదస్సు సి.వి.రామన్ విజ్ఞాన భవన్‌లోని సదస్సుల గదిలో బుధవారం మొదలైంది. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్‌రెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ సమాజ కోణం నుంచి సాహిత్యాన్ని అధ్యయనం చేయాల్సిన అవసరాన్ని వివరించారు. ఈ సదస్సులో పాల్గొన్న ఆచార్య కుసుమకుమారి మాట్లాడుతూ వికీపిడియా వంటి వెబ్‌సైట్‌లు వేల పుటల్ని సాహిత్య అభిమానులకు అందిస్తున్నాయని వివరించారు. అలాంటి మాధ్యమాలను తెలుగు రచయితలు, పరిశోధకులు తప్పక ఉపయోగించుకోవాలన్నారు. […]పూర్తి వివరాలు ...

వార్తలు

బాధ్యతలు స్వీకరించిన ఉపకులపతి

యోగివేమన విశ్వవిద్యాలయం ఉపకులపతిగా నియమితులైన ఆచార్య బేతనభట్ల శ్యామ్‌సుందర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాళ్లు, డీన్‌లతో సమావేశం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… విశ్వవిద్యాలయంలోని కుటుంబసభ్యులందరినీ కలుపుకుని తన శాయశక్తులా అభివృద్ధికి కష్టపడి పనిచేస్తానని తెలిపారు. యోగి వేమన పేరుతో ఏర్పాటు చేసిన విశ్వవిద్యాలయంలో పనిచేయడం అదృష్టమన్నారు. ఆయన ప్రబోధనలను స్ఫూర్తిగా తీసుకుని అభివృద్ధికి పాటుపడతామన్నారు. అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు సంపూర్ణ శక్తిసామర్థ్యాలను వినియోగించి విశ్వవిద్యాలయానికి కీర్తిప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు. విశ్వవిద్యాలయ […]పూర్తి వివరాలు ...

వార్తలు

యోగివేమన విశ్వవిద్యాలయానికి నూతన ఉపకులపతి

యోగివేమన విశ్వవిద్యాలయం (వైవీయూ) నూతన ఉపకులపతిగా ఆచార్య డా. బి. శ్యాంసుందర్ నియమితులయ్యారు. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీఅయ్యాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో కెమిస్ట్రీ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేసి పదవీ విరమణ చేసిన ఈయన నాగార్జున విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ప్రిన్సిపాల్‌తో పాటు పలు కీలకపదవులు నిర్వహించారు. ఆరునెలలుగా ఖాళీగా ఉన్న వైస్ చాన్స్‌లర్ పదవికి పలువురు పోటీపడ్డారు. ఆచార్య శ్యాంసుందర్ నియామకానికే గవర్నర్ మొగ్గుచూపడంతో వైవీయూ మూడో వైస్ చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. ఆచార్య శ్యామ్‌సుందర్‌ […]పూర్తి వివరాలు ...