DRDO వాళ్ళు ఎలెక్ట్రానిక్ వార్ఫేర్ లాబ్ నెలకొల్పడానికి ఒకేచోట 3,400 ఎకరాలు అవసరమై, ఏరికోరి కడప నగర శివార్లలోని కొప్పర్తిలో భూమి కావాలని కోరితే రాష్ట్రప్రభుత్వం ఇక్కడ భూమి ఇవ్వకుండా రాయలసీమలో ఇంకెక్కడైనా సరేనంటోంది. ఈ విషయంలో జోక్యంచేసుకుని, కొప్పర్తిలో కుదరకపోతే జమ్మలమడుగులోనైనా ఈ లాబ్ ఏర్పాటుచెయ్యమని రక్షణశాఖ మంత్రికి ఒక విన్నపం పంపేదానికి త్రివిక్రమ్ అనే ఆయన (ఈయన గతంలో కడపకు శివరామకృష్ణన్ కమిటీ వస్తోందని చివరి నిమిషంలో తెలిస్తే బెంగుళూరు నుండి అప్పటికప్పుడు వచ్చి […]పూర్తి వివరాలు ...
Tags :మంగంపేట
అనగనగా మంగాపురం అని ఒక ఊరు. ఆ ఊర్లో జనాలంతా కూలీ నాలీ చేసుకుని రెక్కల కష్టం మీద బతికేవోల్లు. ఉన్నట్టుండి ఒక రోజు ఆ ఊరికి వచ్చిన కొంతమంది స్థానిక యాపారులకి అక్కడ ఉన్న భూముల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు తెలిసింది. వెంటనే వాళ్ళు ఆ దేశపు రాజు దగ్గరికి పోయి ఇలా అడిగినారు.. ‘రాజా… మేము మంగాపురంలో ఉన్న బంగారు నిక్షేపాలను కనుగొన్నాం. మీరు అనుమతిస్తే ఆ నిక్షేపాలను వెలికితీసి అమ్ముతాం. తద్వారా వచ్చిన […]పూర్తి వివరాలు ...
కడప జిల్లా మంగంపేట బైరైటీస్(ముగ్గురాయి) గనులను ప్రయివేటు సంస్థలకు ధారాదత్తం చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అత్యంత విలువైన, అరుదైన బైరైటీస్ గనులను ప్రయి’వేటు’కు అప్పగించడమంటే అక్షరాలా లక్ష కోట్ల రూపాయల సంపదను వారి చేతిలో అప్పనంగా పెట్టడమే. ప్రయివేటీకరణపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ మంగంపేట గనుల చుట్టూ ఏదో తతంగం నడుస్తోందన్నది మాత్రం సుస్పష్టంగా తెలుస్తోంది. బైరైటీస్ మార్కెట్పై వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఆధిపత్యం చెలాయిస్తున్న నేపథ్యంలో ఆరు నెలల క్రితం అధికారంలోకొచ్చిన […]పూర్తి వివరాలు ...
మంగంపేట: ముగ్గురాళ్ళ విషయంలో కొంత మంది స్వార్థం కోసం అందరినీ బలిచేసే కార్యక్రమాలు జరుగుతున్నాయనీ తెదేపా రైల్వేకోడూరు నియోజకవర్గ బాధ్యుడు కస్తూరి విశ్వనాధనాయుడు ఆరోపించారు. 15న మిల్లర్లు ప్రభుత్వ వైఖరికి నిరసనగా ధర్నాకు పిలుపు ఇచ్చిన నేపధ్యలో పట్టణంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మంగంపేట పరిధిలోని బడా బయ్యర్లు చిన్నచిన్న మిల్లుల నుంచి రాయిని పొడి గొట్టకుండా నేరుగా అధిక ధరలకు అమ్మడం ప్రారంభించారన్నారు. ఏపీఎండీసీ […]పూర్తి వివరాలు ...
ఆం.ప్ర రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థకు తలమానికం మంగంపేట (ఓబులవారిపల్లి మండలం, కడప జిల్లా) ముగ్గురాళ్ళ గనులు – ఇవి ప్రపంచంలోనే ప్రసిద్దిగాంచిన ముగ్గురాళ్ళ గనులు. 1980కి ముందు రాష్ట్ర ప్రభుత్వం మంగంపేటలో సర్వే చేసినప్పుడు 72 మిలియన్ టన్నుల ముగ్గురాయి నిక్షేపాలు ఇక్కడ ఉన్నట్లు వెల్లడయ్యింది. ఆనాటి నుండి ఈనాటి వరకు కేవలం పది మిలియన్ల పైచిలుకు టన్నుల ముగ్గురాళ్ళను మాత్రమే ఇక్కడ వెలికి తీశారు. ఇంకా సుమారు 60 మిలియన్ టన్నుల ముగ్గురాయి నిక్షేపాలు మంగంపేటలో […]పూర్తి వివరాలు ...