Tags :కడప

    సంకీర్తనలు

    నేనుసేసే చేఁతలలో నెరుసున్నదా – అన్నమయ్య సంకీర్తన

    పదకవితా పితామహుని ‘కడపరాయడు’ ఎవరినో తలపోస్తూ కోపిస్తున్నాడని కలహాంతరియైన నాయిక ఇట్లా వాపోతున్నది. వర్గం : శృంగార సంకీర్తన రాగము: హిందోళవసంతం రేకు: 0214-2 సంపుటము: 8-80 నేనుసేసే చేఁతలలో నెరుసున్నదా మీనుల వినుమంటేను వేసరేవుగాక ॥పల్లవి॥ కప్పుర మిచ్చితిఁ గాక కవకవ నవ్వితినా రెప్పల మొక్కితిఁగాక రేసు రేచేఁనా ముప్పిరినెవ్వతెచేనో ముందువాడివచ్చి దప్పితో నొక్కటొక్కటే తలచేవుగాక ॥నేనుసేసే॥ చిగురందిచ్చితిఁగాక చేగోరు దాఁకించితినా మొగమోటనుంటిఁగాక ముంచికైకోనా మగువ యెవ్వతెచేనో మర్మాలు తొరలి వచ్చి పగటులనూరకే భ్రమసేవుగాక ॥నేనుసేసే॥ […]పూర్తి వివరాలు ...

    అభిప్రాయం

    ఆం.ప్ర ప్రభుత్వం వర్మ పైన కేసు పెడుతుందా?

    కడపవెబ్సిరీస్ ‘ఫ్యాక్షనమ్మ రాయలసీమ అయితే ఆ అమ్మ గర్భగుడి కడప’ – వెబ్ సిరీస్ టీజర్లో వోడ్కా మరియు తొడల వర్మగా ఖ్యాతి గడించిన వీర ఫ్లాపు సినిమాల దర్శకుడి వ్యాఖ్యానం. ఇలాంటి విపరీత వ్యాఖ్యానాలకు తెగబడిన రామూది కోస్తా ప్రాంతం కావడం కాకతాళీయం కాదు. వివాదాల్లో చిల్లర వెదుక్కునే రామూ అలియాస్ రాంగోపాల్ వర్మ అనబడే ఫ్లాపు చిత్రాల దర్శకుడూ, సోషల్ మీడియా మేధావి గారూ తన కంపెనీ పేరుతో ఒకానొక పనికిమాలిన వెబ్ సిరీస్తో […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు సమాచారం

    ఏప్రిల్ 3 నుండి కడపలో పాస్‌పోర్ట్ సేవలు

    కడపలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం ఏర్పాటు విదేశాంగ మరియు తపాల శాఖల మధ్య అవగాహనా ఒప్పందం జిల్లా వాసులకు తిరుపతి పోయే బాధ తప్పనుంది కడప: ఏప్రిల్ మూడవ తేదీ నుండి కడప జిల్లా వాసులకు  స్థానికంగా పాస్‌పోర్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి.  ఇక మీదట నగరంలోని ప్రధాన తపాలా కార్యాలయంలో (హెడ్ పోస్టాఫీసు) పాస్‌పోర్ట్ సేవలు అందిస్తారు. దీంతో జిల్లా వాసులు పాస్‌పోర్ట్ కోసం తిరుపతి లేదా హైదరాబాదు పోవాల్సిన బాధ తప్పుతుంది. ఏప్రిల్ 3 […]పూర్తి వివరాలు ...

    అభిప్రాయం రాయలసీమ వ్యాసాలు

    ‘రాయలసీమ సంస్కృతి’పై చిత్రసీమలో ఊచకోత

    తెలుగు చిత్రసీమ కీర్తిబావుటాను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయిన తొలినాటి దిగ్గజాలను అందించిన రాయలసీమకు నేడు అదే సినిమాలలో అంతులేని అపఖ్యాతి లభిస్తోంది. సీమ సంస్కృతిపై ఏ మాత్రం అవగాహన లేని రచయితలు, దర్శకులు తోడై ఒక హింసాయుత విధ్వంసకర దృశ్యానికి సీమలోని ఊర్లపేర్లు పెట్టి “రాయలసీమ సంస్కృతి” అంటే ఇదే అనుకునే భ్రమను యావదాంధ్రులకు కలిగిస్తున్నారు. తెలుగులో శబ్దచిత్రాలు ప్రారంభమయ్యాక మల్లీశ్వరి వంటి సినిమాలతో తెలుగు చిత్రసీమ ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోయిన బి.నాగిరెడ్డి, బి.ఎన్.రెడ్డి […]పూర్తి వివరాలు ...

    చరిత్ర రాయలసీమ

    చరిత్రలో రాయలసీమ – భూమన్

    తెలుగు ప్రజల ఆదిమ నివాస స్థలం రాయలసీమ. చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపాన ఉన్న రాళ్లకాల్వ వద్ద, కర్నూలు జిల్లాలో అనేక చోట్ల జరిగిన తవ్వకాలలో అతి ప్రాచీన మానవుని ఉనికికి సంబందించిన అనేక ఆధారాలు లబించినట్లు ప్రముఖ చరిత్రకారుడు ప్రొఫెసర్‌ హెచ్‌.డి. సంకాలియా తెలియజేసినారు. ”మద్రాసు చుట్టు పట్లా, కర్నూలు జిల్లాలో వున్న అనేక గుహలు అన్నిటికన్నాముఖ్యమైన స్థలాలని నా అభిప్రాయం. దాదాపు అరవయ్యేళ్ల క్రితం రాబర్ట్‌ బ్రూస్‌పుట్‌ ఆ ప్రదేశాలలో అనేక పరికరాలనూ, ఎముకల […]పూర్తి వివరాలు ...

    వ్యాసాలు

    ‘శశిశ్రీ’కి పాలగిరి విశ్వప్రసాద్ నివాళి వ్యాసం

    శశిశ్రీ 1995లో కడపలో ‘సాహిత్య నేత్రం’ పత్రికను మొదలుపెట్టాడు. అది మొదలెట్టే సమయానికి ఆయన జేబులో రూపాయి లేదు. పనిలోకి దిగితే అవే వస్తాయని మొదలెట్టాడు. ఇందుకు ఆయనకు సహకరించింది ఆయన మిత్రుడు డి.రామచంద్రరాజు, తన కన్నా వయసులో చిన్నవాడైన మరో మిత్రుడు నూకా రాంప్రసాద్‌రెడ్డి. పత్రిక తొలి సంచిక, మలి సంచిక రాగానే ఆంధ్రప్రదేశ్ సాహిత్యకారుల దృష్టంతా సాహిత్యనేత్రం వైపు తిరిగింది. అప్పటికే ‘రచన’, ‘ఆహ్వానం’ మార్కెట్లో ఉన్నాయి. వాటికి ఏమాత్రం తీసిపోకుండా అంతకు మించి […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    అధికారిని తిట్టిన తెదేపా నేత లింగారెడ్డి

    కడప: ‘‘రాస్కెల్.. బఫెలో.. ఇడియట్.. వెళ్లిపోరా ఇక్కడి నుంచి.. సమావేశం గురించి ఎందుకు చెప్పలే దు? నేను ఫోన్ చేస్తే కట్ చేస్తావా? ఏమనుకుంటున్నావ్.. ఎవరనుకున్నావ్.. ఆఫ్ట్రాల్ డీఎస్‌ఓ గాడివి’’ అంటూ రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ చైర్మన్ ఎం.లింగారెడ్డి వైఎస్సార్ జిల్లా పౌరసరఫరాల అధికారి(డీఎస్‌ఓ) జి.వెంకటేశ్వరరావును తీవ్రస్థాయిలో దుర్భాషలాడారు. మనస్తాపానికి గురైన డీఎస్‌ఓ కంటతడి పెట్టారు. వైఎస్సార్ జిల్లా కలెక్టరేట్‌లో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. రెండేళ్లుగా జరగని ఎఫ్‌ఏసీ (ఫుడ్ అడ్వయిజరీ కమిటీ) సమావేశాన్ని […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    సొంత భజనతో తరించిన ముఖ్యమంత్రి

    కడప: జన్మభూమి – మా ఊరు కార్యక్రమంలో పాల్గొనడానికి ఈ రోజు (శనివారం) కడప జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆద్యంతం ప్రభుత్వ పథకాలను, ఘనతలను వల్లె వేయటానికి ప్రాధాన్యమిచ్చారు.  గతంలో జిల్లాకు ఇచ్చిన హామీలను గానీ, వాటి పురోగతిని గాని వివరించేందుకు కనీస ప్రయత్నం చెయ్యలేదు. ఆలంఖాన్ పల్లెలో జరిగిన ‘జన్మభూమి – మా ఊరు’ గ్రామ సభలో పాల్గొనడానికి వచ్చిన ముఖ్యమంత్రి అంతకు ముందు 44 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించతలపెట్టిన హజ్ హౌస్ […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    ఒక ప్రాంతానికి, ఒకే వర్గానికి మేలు చేసేలా ప్రభుత్వ నిర్ణయాలు

    కడప: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసి తీరాల్సిందేనని కడప శాసన సభ్యుడు ఎస్‌బి అంజద్‌బాషా డిమాండ్ చేశారు. జిల్లాపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జిల్లాలో ఉక్కు పరిశ్రమ, ఉర్దూ యూనివర్సిటీ, హజ్ హౌస్ ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో శుక్రవారం ఆయన కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఒక్క వైఎస్‌ఆర్ హయాంలోనే జిల్లాకు మేలు జరిగిందన్నారు. ఎన్నో అభివృద్ధి […]పూర్తి వివరాలు ...