కడప: వైఎస్ఆర్ జిల్లాకు కడప జిల్లాగానే పేరు మార్చాలని ఆదివారం కడపలో జరిగిన తెదేపా మినీ మహానాడులో ఆ పార్టీ నేతలు తీర్మానించారు. కడపకు ఎంతో ఘనచరిత్ర ఉందని, జిల్లాలో ఎంతోమంది కవులు, కళాకారులు, మహనీయులు, పుట్టారని, అలాంటి వారి పేర్లను మరచి జిల్లాకు వైఎస్ఆర్ కడప జిల్లా అన్న పేరు పెట్టడం దురదృష్టకరమని పలువురు తెలుగుదేశం నాయకులు పేర్కొన్నారు. ఆదివారం జరిగిన మినీమహానాడులో నూతన అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి దృష్టికి ఈ అంశాన్ని తీసుకురాగా వైఎస్ఆర్ పేరు […]పూర్తి వివరాలు ...
కడప: మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నియమితులయ్యారు. తాజాగా ముఖ్యమంత్రి అన్ని జిల్లాలకు ఇన్ఛార్జి మంత్రులను నియమించగా.. కడప జిల్లా బాధ్యతలను గంటాకు అప్పగించినట్లు సమాచారం. విశాఖ నగరంలోని భీమిలి నియోజకవర్గం నుంచి ఆయన శాసనసభ్యుడిగా గెలుపొందారు.పూర్తి వివరాలు ...
కృష్ణా నీటిని పునః పంపిణీ చేయాల రాజధాని పారిశ్రామిక కారిడార్ కోసమే పట్టిసీమ ఓవైపు సీమ ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం.. మరో వైపు సీమ కోసమే పట్టిసీమ అనడం కుట్ర పట్టిసీమ ఉత్తర్వులో సీమకు నీరిస్తామన్న అంశాన్ని ఎందుకు పొందుపరచలేదో చెప్పాల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు కడప: రాజధాని ప్రాంతం చుట్టూ ఏర్పాటయ్యే పారిశ్రామిక కారిడార్కు నీరందించడం కోసం రాయలసీమ పేరు చెప్పి కోస్తా వారు చేస్తున్న మరో మోసమే పట్టిసీమ అని ఏపీ రైతుసంఘం […]పూర్తి వివరాలు ...
కడప: విపక్ష నేతగా ఎన్నికైన చాన్నాళ్ళ తర్వాత మొదటి సారిగా విపక్షనేత వైఎస్ జగన్ రాయలసీమకు ప్రభుత్వం చేస్తున్న అన్యాయం గురించి మాట్లాడారు.రాజధాని ప్రకటన సమయంలో కానీ, సీమ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు విషయంలో కానీ ప్రభుత్వాన్ని పెద్దగా విమర్శించని జగన్ ప్రాజెక్టుల కోసం చేపట్టిన బస్సుయాత్రలో భాగంగా మూడో రోజు శుక్రవారం కర్నూలు జిల్లాలోని బనుకచర్ల నీటి మళ్ళింపు పథకం పనులను పరిశీలించిన తర్వాత విలేఖరులతో మాట్లాడుతూ సీమ ప్రాజెక్టుల విషయంలో ప్రభుత్వం చేస్తున్న అన్యాయాన్ని […]పూర్తి వివరాలు ...
రాజంపేట: ముఖ్యమంతి చంద్రబాబు కొడుకు, చినబాబుగా తెదేపా శ్రేణులు పిలుచుకొనే నారా లోకేష్ ఈనెల 15న జిల్లాకు వస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి ఆదివారం అధికారికంగా తెలియచేశారు. బుధవారం ఉదయం 9 గంటలకు నారా లోకేష్ రాజంపేటకు చేరుకుని పాతబస్సుస్టాండు బైపాస్లోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తారని తెలిపారు. అక్కడి నుంచి ఆర్టీసీ బస్టాండు వరకూ నిర్వహించే భారీ ర్యాలీలో పాల్గొంటారన్నారు. అనంతరం ఒంటిమిట్ట కోదండరామస్వామిని దర్శించుకుని, కడప మీదుగా […]పూర్తి వివరాలు ...
డిసిసిబి పీఠం కోల్పోనున్న తిరుపాలరెడ్డి దువ్వూరు: దువ్వూరులో సహకార సంఘంలో ఏడుగురు డైరెక్టర్లు రాజీనామా చేయడంతో అక్కడి నుంచి ఎన్నికైన డిసిసిబి చైర్మన్ తిరుపాలరెడ్డి అధ్యక్ష పదవిని కోల్పోయారు. ఫలితంగా డీసీసీ బ్యాంక్ ఛైర్మన్ పదవి కూడా కోల్పోనున్నారు. ఇప్పటికే దీనిపై ప్రొద్దుటూరు డివిజనల్ సహకార అధికారి నుంచి, జిల్లా సహకార అధికారికి కాపీలు అందినట్లు ఈనాడు దినపత్రిక తన కథనంలో పేర్కొంది. దువ్వూరు సహకార సంఘం బుధవారం పాలకవర్గ సమావేశం నిర్వహించగా, అక్కడ 11 మంది […]పూర్తి వివరాలు ...
జలాశయాలను పరిశీలించిన జగన్ 16 టిఎంసిల నీళ్ళు ఇవ్వాల్సి ఉంటే 2.55 టిఎంసీలే ఇచ్చారు పులివెందుల: విపక్ష నేత, పులివెందుల శాసనసభ్యుడు వైఎస్ జగన్ శుక్రవారం మాయిటాల పులివెందులకు నీరందించే పెంచికల బసిరెడ్డి జలాశయం, పైడిపాలెం జలాశయాలను సందర్శించారు. అలాగే పార్నపల్లె తాగునీటి పథకాన్ని, అలాగే వెలిదండ్లలోని నీటికుంటను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన నీటి కేటాయింపుల విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పుబట్టారు. జగన్ ఈ సందర్భంగా పాత్రికేయులతో మాట్లాడుతూ… ‘‘పెంచికల బసిరెడ్డి జాలశయం (చిత్రావతి […]పూర్తి వివరాలు ...
కడప: గురువారం కోదండరాముని పెళ్లి ఉత్సవంలో పాల్గొనేందుకు వచ్చి ఒంటిమిట్ట బహిరంగ సభలో మాట్లాడిన ముఖ్యమంత్రి శ్రీరామ ఎత్తిపోతల పథకానికి రూ.34 కోట్లు, ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు, రాజంపేట – కడప రోడ్డులో కొంత భాగానికి రూ.5 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయానికి చేరుకున్న చంద్రబాబు అక్కడి నుంచి రోడ్డుమార్గాన బయలుదేరి ఒంటిమిట్ట ఆలయానికి చేరుకుని స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం వావికొలను సుబ్బారావు కొండపైకి చేరుకుని పరిశీలించారు. తరువాత జిల్లా […]పూర్తి వివరాలు ...
ప్రభుత్వానికి విపక్షనేత జగన్ విజ్ఞప్తి పులివెందుల: 247 కోట్ల రూపాయల నిధులూ, 650 ఎకరాల క్యాంపస్ కలిగిన పశుగణ పరిశోధనా కేంద్రాన్ని ఉపయోగంలోకి తీసుకువస్తే రైతులకు మేలు జరుగుతుందని, ఆ దిశగా చర్యలు చేపట్టాలని ప్రతిపక్ష నాయకుడు, వైకాపా అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. గురువారం పులివెందులలోని అధునాతన పశుగణ పరిశోధనా కేంద్రాన్ని (ఐజీ కార్ల్) సందర్శించారు. ఆ తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడుతూ…. ”వ్యవసాయం గిట్టుబాటు కాని దుస్థితి ఉంది. పశుపోషణ […]పూర్తి వివరాలు ...