పాలకంకుల శోకం కథ ఎదురుగా బడి కన్పించగానే గుర్తొచ్చింది కృష్ణకు – తను ఇంటివద్దనుంచి బయల్దేరేటపుడు ఈ దారిన రాకూడదనుకొంటూనే పరధ్యానంగా వచ్చాడని. సందులో దూరి పోదామనుకొన్నాడు గాని లోపల్నించి రమణసార్ చూడనే చూశాడు. “ఏమయ్యా క్రిష్ణారెడ్డి?” అంటూ అబయటకొచ్చాడు. “ఏముంది సార్..” నెత్తి గీరుకొంటూ దగ్గరగా వెళ్లాడు కృష్ణ. “బంగారంటి పాప. ఆ పిల్ల జీవితమెందుకు నాశినం జేస్తావ్? బడికి పంపీయ్యా. పదిరోజులైంది సూడూ” నిలదీశాడు రమణ. ఓసారి అటు ఇటు జూసి “సార్ సార్” […]పూర్తి వివరాలు ...
మా జిల్లాల్లో మునిరత్నం పేరు చెప్తే చాలు ఉలిక్కిపడి అటూ ఇటూ చూస్తారు. ముని అంటే ముని లక్షణాలు కానీ, రత్నం అంటే రత్నం గుణం కానీ లేని మనిషి. పేరు బలంతోనైనా మంచోడు అవుతాడనుకొని ఉంటారు పేరు పెట్టిన అమ్మానాన్నలు. కానీ అదేం జరగలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే రాక్షసుడు అని చెప్పవచ్చు. అసలు చూడ్డానికి కూడా ఆఫ్రికా అడవి దున్నపోతులా ఉంటాడు. ఆరు అడుగుల ఎత్తు. తెల్ల ఖద్దరు డ్రస్సు. కనుబొమలు, చేతులపై సుడులు తిరిగినపూర్తి వివరాలు ...
నల్లబల్లి చెన్నకేశవునిపై అన్నమయ్య రాసిన సంకీర్తన – 1 శఠగోప యతీంద్రులకడ సకల వైష్ణవాగమములను అభ్యసించిన అన్నమయ్య జీవితమే ఒక ధీర్ఘశరణాగతి. కడప గడపలో జనియించిన ఈ వాగ్గేయకారుడు తన నుతులతో వేంకటపతిని కీర్తించి ఆనంద నృత్యం చేసినాడు. నల్లబల్లి – కడప జిల్లా, ముద్దనూరు మండలంలోని ఒక గ్రామం. ఇక్కడ గల చెన్నకేశవ స్వామిని పలుమార్లు దర్శించి తరించిన అన్నమయ్య, ఆ స్వామిపై పలు సంకీర్తనలను రాసి – పాడినాడు. Your browser does not […]పూర్తి వివరాలు ...
ఈ ఊరు కడప జిల్లా సిద్దవటం తాలూకాలో లో వుంది. అన్నమయ్య మేనమామ గారి ఊరు మాడుపూరు.ఇక్కడి స్వామి చెన్న కేశవ స్వామి. అన్నమయ్య సంకీర్తనలపై పరిశోధన చేసిన శ్రీ మల్లెల శ్రీహరి గారు మాడుపూరు చేన్నకేశవునిపై ఇదొక్క సంకీర్తన మాత్రమె అందుబాటులో ఉన్నట్లు తేల్చారు.పూర్తి వివరాలు ...
అన్నమాచార్యుని గురించి ఆయన మనవడు తాళ్లపాక చినతిరుమలాచార్య రాసిన సంకీర్తన ఇది … రాగం-సాళంగనాఁట ప : అప్పనివరప్రసాది అన్నమయ్యా అప్పసము మాకె కలఁ డన్నమయ్యా చ : అంతటికి నేలికైన ఆదినారాయణుఁ దన యంతరంగాన నిలిపీ నన్నమయ్యా సంతసానఁ జెలువొందె సనకసనందనాదు లంతటివాఁడు తాళ్ళపా కన్నమయ్యా &పూర్తి వివరాలు ...
అన్నమాచార్యుడు – తొలి తెలుగు వాగ్గేయ కారుడు, పద కవితా పితామహుడు. బాషలో, భావంలో- విలక్షణత్వాన్ని, వినూత్నత్వాన్నీ చేర్చి పాటకు ప్రాణ ప్రతిష్ట చేసినాడు. తన పల్లవీ చరణాలతో వేంకటపతిని దర్శించిన అన్నమయ్య ఒంటిమిట్ట కోదండ రామయ్యను ఇలా కీర్తిస్తున్నాడు.. జయ జయ రామా సమరవిజయ రామా భయహర నిజభక్తపారీణ రామా జలధిబంధించిన సౌమిత్రిరామా సెలవిల్లువిరచినసీతారామా అలసుగ్రీవునేలినాయోధ్యరామాపూర్తి వివరాలు ...
Your browser does not support the audio element. సంకీర్తన వినడానికి పైనున్న ప్లే బటన్ నొక్కండి… అలమేలుమంగ, శ్రీనివాసుల కీర్తనలకు తన జీవితాన్ని అంకితం చేసిన పరమభక్తుడు అన్నమయ్య. అతని రచనలలో భక్తి, సంగీతము, సాహిత్యము, శృంగారము, వేదాంతము అత్యంత మనోహరంగా, వినసొంపుగా చెప్పబడ్డాయి. సరళమైన మాటలలో ఆధ్యాత్మిక సత్యాలను, వేంకటపతి తత్వాన్ని, జీవాత్మ పరమాత్మల తాదాత్మ్యాన్ని వినిపించినాడు. లోకనీతిని, ధర్మాన్ని, విష్ణుతత్వాన్ని కీర్తించినాడు. కడప గడపలో నడయాడిన ఆ భాగవతోత్తముడు దేవుని కడప […]పూర్తి వివరాలు ...
[divider](తవ్వా విజయ భాస్కర రెడ్డి, ఐ. ప్రవీణ్ కుమార్) తెలుగు సినీ పరిశ్రమలో అప్పటికీ , ఇప్పటికీ నటీనటుల అనుబంధాల్లో అనేక మార్పులు వచ్చాయని సీనియర్ నటి టిజి కమలాదేవి పేర్కొన్నారు. మారిన సినీ వాతావరణంలో తాను ఇమడలేకపోయానని, అందుకే క్రీడలపైనా, నాటకాల పైనా ఏకాగ్రత చూపానని ఆమె చెప్పారు. ఆంధ్రజ్యోతిలో ప్రచురితమైన ‘నా బాల్యం’ శీర్షిక కోసం కమలాదేవిని చెన్నైలోని ఆమె నివాసంలో కలిసినపుడు ఆమె తన బాల్య స్మృతులను ఇలా పంచుకున్నారు….పూర్తి వివరాలు ...
తిరువీధుల మెరసీ దేవదేవుడు గరిమల మించిన సింగారములతోడను ….. తిరుదండలపై నేగీ దేవుడిదె తొలునాడు సిరుల రెండవనాడు శేషుని మీద మురిపాల మూడవనాడు ముత్యాల పందిరి క్రింద పొరినాలుగవనాడు పువ్వుగోవిలలోను …….. గ్రక్కుననైదవనాడు గరుడునిమీద యెక్కెనునారవనాడు యేనుగుమీద చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను యిక్కువదేరును గుఱ్ర మెనిమిదవనాడు ……. కనకపుటందలము కదిసి తొమ్మిదవనాడు పెనచి పదోనాడు పెండ్లిపీట యెనసి శ్రీవేంకటెశు డింతి యలమేల్మంగతో వనితల నడుమను వాయనాలమీదను….పూర్తి వివరాలు ...