ఘటనలు

Mar
15
Sat
వైఎస్ వివేకానందరెడ్డి వర్ధంతి
Mar 15 all-day

on March 15, 2019, YS Vivekanand Reddy, younger brother of YSR, was found dead in his own house in Pulivendula, Kadapa district. First reports suggested it was a case of cardiac arrest. But, after post mortem, police concluded that it was a homicide.

Apr
1
Tue
పోతిరెడ్డిపాడుపైన తెదేపా అవిశ్వాసం
Apr 1 all-day

పోతిరెడ్డిపాడు వెడల్పును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ ఏప్రిల్ 1 2008న ఆం.ప్ర శాసనసభలో అవిశ్వాస తీర్మానం పెట్టింది.

పోతిరెడ్డిపాడును నిరసిస్తూ అవిశ్వాసం పెట్టిన తెలుగుదేశం

May
1
Thu
జానపద కళాకారుడు మునెయ్య వర్ధంతి
May 1 all-day
జానపద కళాకారుడు మునెయ్య వర్ధంతి

తెలుగునేలపై జానపదబ్రహ్మగా ఖ్యాతి పొందిన మునెయ్య వాడవాడలా తిరిగి సేకరించిన జానపదగేయాలు వేనవేలు. ఔత్సాహిక కలాకారులెందరికో స్పూర్తి ప్రదాత. మునెయ్య కేవలం గాయకులే కాక మంచి రచయిత, చిత్రకారులు. వీరపునాయునిపల్లె శ్రీ సంగమేశ్వర ఉన్నత పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయులుగా పనిచేశారు.

1943 సంవత్సరంలో కడప జిల్లాలో జమ్మలమడుగు తాలూకా దొమ్మరనంద్యాలలో జన్మించారు మునెయ్య.

చారిత్రక సత్యాలు ప్రతిబింభించే బుడ్డా వెంగళరెడ్డి, గురిగింజ గుమ్మడి, కోడిపిల్ల, కోడిబాయ లచ్చమ్మది, యాపమానెక్కినావు, తేలుకుట్టిందే పిన్ని, నాంచారి, నామాట, కోల్ కోల్, చీరెల్, తుమ్మెదలు మొదలైన హాస్య గీతాలు ఆయన వినిపించినప్పుడు శ్రోతలు మరియు ప్రేక్షకుల మదిలో గిలిగింతలు కలిగిస్తాయి.

శ్రామికులు పర్వదినంగా జరుపుకునే ‘మేడే’ వేడుకలలో శ్రామికుల ముందు తన గళాన్ని విప్పడానికి తన బృందంతో 1.5.1997 న మంత్రాలయంలో ప్రదర్శన ఇవ్వడానికి వెళ్తూ కోడుమూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కానరాని తీరాలకు వెళ్ళిపోయారు.

‘రాయలసీమ రాగాలు’ పేర సీమ జానపదాలను మునెయ్య సంకలనం చేశారు. ఈ పుస్తకాన్ని ‘తెలుగు అకాడమీ’ ప్రచురించింది.

May
21
Wed
ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఒప్పందం
May 21 all-day

21 మే  2007 –  ఏటా రెండు మిలియన్ టన్నుల సామర్ధ్యంతో కడప జిల్లాలో బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు చేసేదానికి రాష్ట్ర ప్రభుత్వంతో ఓబులాపురం మైనింగ్ కంపెనీ ఒప్పందం.

బ్రాహ్మణి ఉక్కు పరిశ్రమ – పుట్టుక నుండి చావు వరకు

May
30
Fri
ఆం.ప్ర 2వ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం చేసిన రోజు
May 30 all-day
ఆం.ప్ర 2వ ముఖ్యమంత్రిగా జగన్ ప్రమాణం చేసిన రోజు

విభజిత ఆంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా కడప జిల్లాకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత,  వైఎస్ జగన్మోహన్ రెడ్డి మే 30న (2019) ప్రమాణస్వీకారం చేశారు. విజయవాడలోని ఇందిరా గాంధీ మైదానం ఇందుకు వేదికైంది.

గవర్నర్ నరసింహన్ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు.  ముహుర్తాన్ని అనుసరించి 12.23 గంటలకు జగన్‌తో గవర్నర్ నరసింహన్ ప్రమాణస్వీకారం చేయించారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, డీఎంకే అధినేత స్టాలిన్ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి తిలకించేందుకు పార్టీ కార్యకర్తలు, నేతలు వివిధ జిల్లాల నుంచి విజయవాడకు తరలివచ్చారు.

2019 శాసనసభ ఎన్నికలలో జగన్ పులివెందుల స్థానం నుంచి శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు.

 

Jul
7
Mon
కడప జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్పు చేసిన రోజు
Jul 7 all-day
కడప జిల్లా పేరును వైఎస్ఆర్ జిల్లాగా మార్పు చేసిన రోజు

1974 నాటి ‘ఆంద్రప్రదేశ్ జిల్లాల (ఏర్పాటు) చట్టం’ లో పేర్కొన్న  సెక్షన్ 3, సబ్ సెక్షన్2లోని  క్లాజు (e) ద్వారా సంక్రమించిన అధికారాలను ఉపయోగించి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము జీవో నంబరు ఎంఎస్ 613 (https://kadapa.info/go613/) ద్వారా 2010 జూలై 7 నుండి కడప జిల్లా పేరును ‘వై.ఎస్.ఆర్ జిల్లా’గా మార్చింది.

ఈ  ఉత్తర్వును 8-07-2010 నాటి ఆంధ్రప్రదేశ్ గెజిట్లోనూ, 15-07-2010 నాటి కడప జిల్లా గెజిట్లోనూ ప్రచురించారు.

Jul
8
Tue
వైఎస్ రాజశేఖరరెడ్డి పుట్టినరోజు
Jul 8 all-day

14/05/2004 నుండి 02/09/2009 వరకు (సుమారుగా 5 సంవత్సరాల నాలుగు నెలల పాటు) అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి 1949 జూలై 8 న వైఎస్‌ఆర్‌ జిల్లా, జమ్మలమడుగులో జన్మించారు. తల్లిదండ్రులు జయమ్మ, రాజారెడ్డి. పాఠశాల విద్యాభ్యాసం బళ్లారిలో సాగగా, తర్వాత విజయవాడలోని లయోలా కళాశాలలో విద్యనభ్యసించారు. 1972లో గుల్బర్గా విశ్వవిద్యాలయం నుంచి వైద్య విద్యలో పట్టా అందుకున్నారు.

వైఎస్ పుట్టినరోజుఅనంతరం తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర వైద్య కళాశాల నుంచి హౌస్‌ సర్జన్‌గా పట్టా పొందారు. వైద్య విద్య పూర్తైన తర్వాత కొంతకాలం జమ్మలమడుగులో వైద్యాధికారిగా పనిచేశారు. అనంతరం తండ్రి రాజారెడ్డి పేరుతో కట్టించిన ఆస్పత్రిలో పనిచేశారు. వైఎస్సార్‌ సతీమణి విజయమ్మ. ఈ దంపతులకు ఇద్దరు సంతానం. జగన్ మోహన్‌ రెడ్డి (కుమారుడు), షర్మిల (కుమార్తె).

1978లో జరిగిన ఎన్నికల్లో వై.ఎస్‌.రాజశేఖర రెడ్డి తొలిసారిగా కడప జిల్లా పులివెందుల నియోజక వర్గం నుంచి ఎమ్మేల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 1983, 85లలో జరిగిన ఎన్నికల్లోనూ ఎమ్మేల్యేగా గెలిచి, హ్యాట్రిక్‌ సాధించారు. ఆ తర్వాత 1989లో కడప లోక్‌సభ నియోజకవర్గం నుంచి ఎంపీగా పోటీ చేసి విజయం సాధించారు. తిరిగి 1991, 96, 98లలో జరిగిన ఎన్నికల్లోనూ ఎంపీగా గెలిచారు.

వరుసగా నాలుగు సార్లు పార్లమెంటు స్థానానికి పోటీ చేసి అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్నారు. అనంతరం శాసన సభ ఎన్నికలపై దృష్టి సారించిన ఆయన 1999లో పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మేల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2004, 2009లో జరిగిన ఎన్నికల్లోనూ అదే నియోజకవర్గం నుంచి ఎమ్మేల్యేగా గెలిచారు. తాను పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ ఓటమి ఎరుగకుండా విజయం సాధించి, అరుదైన ఘనతను దక్కించుకున్నారు.

వైఎస్సార్‌ తన రాజకీయ జీవితంలో అనేక పదవులు చేపట్టారు. 1980లో అప్పటి రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, 1982లో ఎక్సైజ్, విద్యా శాఖ మంత్రిగా పనిచేశారు. 1983-85 వరకు పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1998లోనూ తిరిగి పీసీసీ అధ్యక్షుడయ్యారు. 1999లో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో టీడీపీ అధికారంలో ఉంది. ఈ సమయంలో వైఎస్సార్‌ శాసనసభ ప్రతి పక్ష నేతగా ఎన్నికయ్యారు.

అనంతరం 2004లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు విశేష కృషి చేశారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అనూహ్య విజయం సాధించింది. దీంతో పార్టీని విజయపథం వైపు నడిపించిన వై.ఎస్‌.రాజశేఖర రెడ్డిని ఎమ్మేల్యేలు ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు. అలా ఆయనకు తెలుగు ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం దక్కింది. ఐదేళ్ల అనంతరం అంటే 2009లోనూ వైఎస్సార్‌ ఆధ్వర్యంలోని కాంగ్రెస్‌ విజయం సాధించింది. ఆయన తిరిగి రెండోసారి సీఎం పీఠాన్ని అధిష్టించారు.

Aug
2
Sat
ఎంజె సుబ్బరామిరెడ్డి వర్ధంతి
Aug 2 all-day
ఎంజె సుబ్బరామిరెడ్డి వర్ధంతి

రైలు ప్రమాదంలో గాయపడిన రాయలసీమ ఉద్యమ నేత పౌరహక్కుల సంఘం నాయకుడు ఎంజె సుబ్బరామిరెడ్డి చికిత్స పొందుతూ 2012 ఆగస్టు 2న మరణించారు.

ఆగస్టు 3న (శుక్రవారం) ఎంజె సుబ్బరామిరెడ్డి అంత్యక్రియలు మైదుకూరులోని అంకాలమ్మ గుడి సమీపంలోని స్మశాన వాటికలో వివిధ పార్టీల నాయకులు ప్రజాసంఘాల ప్రతినిధులు బంధువులు, అభిమానుల మధ్య అంత్యక్రియలు జరిగాయి. ఎంజె రైతుల కోసం చేసిన ఉద్యమంకు ప్రతీకగా ఆయన భౌతిక కాయంపై ఆకుపచ్చ వస్త్రాన్ని కప్పి రైతు సంఘం నాయకులు ఘనంగా నివాళలు అర్పించారు.

ఆయన వామపక్ష దృక్పథానికి సూచనగా ఆయా సంఘాల ప్రతినిధులు ఆయన భౌతిక కాయంపై ఎరుపు వస్త్రం కప్పి జోహార్లు అర్పించారు. స్మశానవాటిక వద్ద పలువురు నేతలు, వివిధసంఘాల ప్రతినిధులు, ఎంజె సేవలను గుర్తు చేస్తూ కన్నీటితో ప్రసంగించారు. ఆయన ఆశయాలను కొనసాగిస్తామని ప్రతిజ్ఞ చేశారు.

మైదుకూరులోని సర్వాయపల్లె రోడ్డు నుంచి కడప రోడ్డు ,నాలుగురోడ్ల కూడలి, బద్వేల్ రోడ్డు మీదుగా ఎంజె భౌతిక కాయాన్ని ప్రత్యేక వాహనంలో ఊరేగింపుగా స్మశాన వాటికకు తరలించారు.

Aug
3
Sun
ఎద్దుల ఈశ్వరరెడ్డి వర్ధంతి
Aug 3 all-day

ఎద్దుల ఈశ్వరరెడ్డి1915లో జమ్మలమడుగు తాలూకాలోని పెద్ద పసుపుల గ్రామంలో 600 ఎకరాల పొలము, 6 పెద్ద మిద్దెలు, 6 కాండ్ల ఎద్దులతో కోలాహలంగా ఉండే సంపన్న కుటుంబంలో పుట్టిన ఎద్దుల ఈశ్వరరెడ్డి మచ్చలేని కమ్యూనిస్టు నాయకుడు, ఆ జన్మ బ్రహ్మచారి.

ఈశ్వరరెడ్డి  1952 నుండి 1977 వరకు(1967 సం||మినహా) నాలుగు సార్లు పార్లమెంటుకు, 1967 సం||లో కడప, అనంతపురం పట్టభద్రుల నియోజకవర్గం నుండి శాసనమండలికి ఎన్నికైనారు. కడపజిల్లాలో ఆకాశవాణికేంద్రం, మైలవరం రిజర్వాయర్‌ నిర్మాణం, విమానాశ్రయం, జిల్లాకేంద్ర గ్రంథాలయం, ఎర్రగుంట్లలో ప్రభుత్వరంగంలో సిమెంటు ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం ఈశ్వరరెడ్డి విశేషంగా కృషి చేశారు. వీరు తన యావదాస్తిని బడుగు, బలహీన వర్గాల ప్రజలకు పంచి ఆదర్శంగా నిలిచినారు.

1984వ సం||రం నుండి మతిమరుపు ఆస్మా వ్యాధి ప్రకోపించడం తదితర జబ్బులకు లోనై పార్టీ నాయకులు, కార్యకర్తల సంరక్షణ, సపర్యల మధ్య 1986 ఆగస్టు 3న ప్రొద్దుటూరులోని కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంలో మరణించారు.

ఎద్దుల ఈశ్వరరెడ్డి గురించిన మరిన్ని వివరాల కోసం చూడండి…https://goo.gl/WAV5Ro

 

Sep
27
Sat
కడప రిమ్స్ ప్రారంభమైన రోజు
Sep 27 all-day
కడప రిమ్స్ ప్రారంభమైన రోజు

కడప నగర శివారులోని పుట్లంపల్లి వద్ద 200 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన రాజీవ్ గాంధీ వైద్య, నర్సింగ్ కళాశాలలను అప్పటి ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి కోరిక మేరకు యుపిఏ చైర్ పర్సన్ గా ఉన్న సోనియా గాంధీ 27 సెప్టెంబర్ 2006న ప్రారంభించారు. ఇదే రోజున సోనియా గాంధీ గారు రిమ్స్ దంతవైద్య కళాశాల నిర్మాణానికి పునాది రాయి వేశారు.

ఈ కార్యక్రమంలో ఆనాటి ఆం.ప్ర ముఖ్యమంత్రి వైఎస్ తో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొన్నారు.

error: