ఫిబ్రవరి 27న ‘గండికోట’ జలాశయాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి గారు కాలవ గట్ల మీద నిద్ర పోయైనా జులై నాటికి అక్కడ 35 టి.ఎం.సిల నీటిని నింపుతానని బహిరంగ సభలో వాక్రుచ్చారు (ఆధారం: https://kadapa.info/గండికోట-బాబు/). బాబు గారు చెప్పిన జులై పోయింది సెప్టెంబరు కూడా వచ్చింది. ‘గండికోట’కు నీళ్ళ జాడ లేదు. ముప్పై టిఎంసిలు కాదు మూడు టిఎంసిలు కూడా ‘గండికోట’కు రాలేదు. పెండింగ్ పనుల పూర్తికి డబ్బులు ఇవ్వకుండా కాలవ గట్లపైన నిద్రపోతానని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఈ […]పూర్తి వివరాలు ...
ఉపయోగం లేని ‘పట్టిసీమ’తో ‘పోలవరం’ రద్దయ్యే ప్రమాదం సొంత మనుషుల కోసమే ‘పట్టిసీమ’ ముడుపుల కోసమే ప్రాజెక్టు అనేది వీరికే సాధ్యం లేనిది ఉన్నట్లు నమ్మించడమే ముఖ్యమంత్రి నైజం కడప: ప్రజలను మభ్య పెట్టడానికే పట్టిసీమ ప్రాజెక్టు కడుతున్నారని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపించారు. ఆయన శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ… రాయలసీమకు, పట్టిసీమ ప్రాజెక్టుకు మధ్య సంబంధం ఏమిటో తనకు అర్థం కావడం లేదని ప్రజలను మభ్యపెట్టడానికే ఏపీ సర్కార్ పట్టిసీమకు […]పూర్తి వివరాలు ...
కడప: రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేసి తీరాల్సిందేనని కడప శాసన సభ్యుడు ఎస్బి అంజద్బాషా డిమాండ్ చేశారు. జిల్లాపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జిల్లాలో ఉక్కు పరిశ్రమ, ఉర్దూ యూనివర్సిటీ, హజ్ హౌస్ ఏర్పాటు చేయాలనే డిమాండ్తో శుక్రవారం ఆయన కడప కలెక్టర్ కార్యాలయం ఎదుట ఒకరోజు నిరాహార దీక్ష చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఒక్క వైఎస్ఆర్ హయాంలోనే జిల్లాకు మేలు జరిగిందన్నారు. ఎన్నో అభివృద్ధి […]పూర్తి వివరాలు ...
కడప: జిల్లా గ్రంధాలయ సంస్థకు కొత్త పాలకవర్గాన్ని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వు (జీవో ఆర్.టీ. నెంబరు 179, విద్యాశాఖ) విడుదల చేసింది. జమ్మలమడుగుకు చెందిన జంబాపురం వెంకటరమణారెడ్డి చైర్మన్ గా, కోడూరు వాసి కొండూరురాజు ప్రతాపరాజు, ప్రొద్దుటూరుకు చెందిన జింకా సుబ్రహ్మణ్యం, కడప చెందిన షామీర్ బాష, మైదుకూరుకు చెందిన అందే పాపయ్య గారి రవీంద్ర, గొడిగనూరుకు చెందిన బైసాని ప్రతాప్ రెడ్డి, కమలాపురంకు చెందిన సులేఖ సభ్యులుగా నియమితులయ్యారు.పూర్తి వివరాలు ...
మాట తప్పిన ప్రభుత్వం తితిదే అజమాయిషీలోకి కోదండరామాలయం కోదండరామయ్య బాగోగులకు ఇక కొండలరాయుడే దిక్కు ఒంటిమిట్ట: వందల కోట్ల రూపాయలు వెచ్చించి ఒంటిమిట్టను మరో తిరుమలలా అభివృద్ది చేస్తానంటూ పోయిన బ్రహ్మోత్సవాల సందర్భంగా గొప్పలు పోయిన ముఖ్యమంత్రి చివరకు ఆ భాద్యత నుండి తప్పుకుని ఒంటిమిట్ట కోదండరాముని భారాన్ని కోనేటి రాయుడికి అప్పగించి చేతులు దులుపుకున్నారు. కడప జిల్లాలోని పురాతన ఆలయమైన ఒంటిమిట్ట కోదండ రామాలయాన్ని తితిదేలో విలీనం చేస్తున్నట్టు ఆ సంస్థ పాలకమండలి చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి […]పూర్తి వివరాలు ...
విభజన తరువాత తెదేపా ప్రభుత్వ దాష్టీకాన్ని చూస్తూ మదనపడిన సీమవాసులు బాబు గారు విడుదల చేసిన చీకటి జీవో 120 కారణంగా ఇప్పుడు నిరసన గళాన్ని వినిపించేందుకు స్వచ్చందంగా వీధుల్లోకి వస్తున్నారు. సీమకు జరుగుతున్న మోసాన్ని ప్రభుత్వ అనుకూల మీడియా తొక్కిపెట్టినా,కోస్తా వారి ఆధిపత్యంలో కొనసాగుతున్న మీడియా సంస్థలు ఒక ప్రాంతం కోసమే విలపిస్తున్నా, ప్రభుత్వం బరి తెగించినా…స్థానిక నాయక గణాలు, విపక్షాలు నోరు మెదపకపోయినా, గుంపులు గుంపులుగా/సంస్థలుగా ఉద్యమకారులు విడిపోయినా…ఇప్పుడు అంతా ఒకే ఆకాంక్షతో బయటికొస్తున్నారు. […]పూర్తి వివరాలు ...
కడప: నిన్న (శనివారం) జీవో 120కి నిరసనగా తిరుపతిలో జరిగిన ధర్నాకు సంబంధించి వివిధ పత్రికల కవరేజీ ఇలా ఉంది…ఒక్క సాక్షి, విశాలాంధ్ర, ప్రజాశక్తి పత్రికలు మాత్రం ఈ విషయానికి ప్రాధాన్యత ఇచ్చి మెయిన్ పేజీలలో వార్తలు క్యారీ చేయగా మిగతా తెలుగు పత్రికలు ఈ అంశాన్ని, వార్తలను అంతగా ప్రాధాన్యం లేని చిత్తూరు జిల్లా టాబ్లాయిడ్ లోపలి పేజీలకు పరిమితం చేశాయి. ఇంగ్లీషు పత్రికలైన The Hans India, The Hinduలు ఈ విషయానికి తెలుగు పత్రికలకన్నా […]పూర్తి వివరాలు ...
తిరుపతి ధర్నా విజయవంతం ప్రభుత్వ కనుసన్నల్లో ధర్నా అడ్డుకోవటానికి అధికారుల ప్రయత్నం తరలివచ్చిన విద్యార్థులు… నేతలు, రాజకీయ పక్షాలు దూరం (తిరుపతి నుండి అశోక్) రాజ్యాంగ సవరణ ద్వారా ఏర్పడిన జోనల్ వ్యవస్థను నీరుగారుస్తూ, రాయలసీమకు అన్యాయం చేస్తూ పద్మావతి మహిళా వైద్య కళాశాల ప్రవేశాల కోసం తీసుకొచ్చిన 120 జీవోను తక్షణమే రద్దు చేయాలని రాయలసీమ ఉద్యమకారులు డిమాండ్ చేశారు. జీవో 120ని నిరసిస్తూ శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో రాయలసీమ పోరాట సమితి, విద్యార్థి సంఘాలు, […]పూర్తి వివరాలు ...
తెలుగులో రెండు సంవత్సరాల ఎం.ఏ కోర్సును అందిస్తున్న కడపలోని యోగివేమన విశ్వవిద్యాలయం నాలుగవ సెమిస్టర్ లో విద్యార్థులకు ‘తెలుగు సాహిత్య విమర్శ’ (పేపర్ 401) పేర ఒక సబ్జెక్టును బోధిస్తోంది. వల్లంపాటి వెంకటసుబ్బయ్య, రాచపాలెం, ఆరుద్ర, ఎస్వీ రామారావు, లక్ష్మణ చక్రవర్తి, జివి సుబ్రహ్మణ్యం, బ్రహ్మానంద, వీరభద్రయ్య తదితరుల రచనలకు ఇందులో చోటు కల్పించిన యోవేవి రాచమల్లు రామచంద్రారెడ్డి రాసిన విమర్శా వ్యాసాలకు కనీసం చోటు కల్పించకపోవటం గర్హనీయం.(http://www.yogivemanauniversity.ac.in/fwd/TELUGU.pdf) తెలుగు సాహితీ జగత్తులో విమర్శలో తనదైన ముద్ర […]పూర్తి వివరాలు ...