వార్తా విభాగం

వార్తలు

దమ్ముంటే నా మీదకు రా? కడప నడిబొడ్డులో తేల్చుకుందాం …

కడప : ‘ఏమీ చేయలేని అమాయకుల మీద కాదు ప్రతాపం చూపేది. దమ్ముంటే నా మీదకు రా? కడప నడిబొడ్డున తగుల్దాం.. ఎప్పుడైనా సరే. సవాల్‌ చేస్తున్నా..’ అంటూ కమలాపురం శాసనసభ్యుడు వీరశివారెడ్డి ఆగ్రహంతో మాజీ మేయరు రవీంద్రనాథ్‌రెడ్డికి సవాల్‌ విసిరారు. సోమవారం ఇందిరా భవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. శనివారం జరిగిన కిడ్నాప్‌ ఉదంతాన్ని ప్రస్తావిస్తూ వీరశివ సహనం కోల్పోయారు. మాజీ మేయరుపై విరుచుకుపడ్డారు. ‘రవీంద్రనాథ్‌రెడ్డి’ పేరు ఉచ్చరించేందుకుపూర్తి వివరాలు ...

వార్తలు

కడపలో సినీ నటుడు బ్రహ్మాజీ

కడప : కడప నగరంలోని అమీన్‌పీర్‌ (పెద్ద) దర్గాను ప్రముఖ సినీ నటుడు బ్రహ్మాజీ ఆదివారం దర్శించి ప్రార్థనలు చేశారు. దర్గా మహిమ గురించి మిత్రులు శంకర్‌, ఉత్తేజ్‌ తదితరులు తనకు చెప్పడంతో పాటు రెహమాన్‌ తరచు ఇక్కడికి రావడం తెలిసి రెండేళ్లుగా తాను రావాలని అనుకుంటున్నట్లు బ్రహ్మాజీ విలేకరులతో చెప్పారు. ఇన్నాళ్లకు ఆ భాగ్యం కలిగిందని అన్నారు. గురువులకు పూలచాదర్‌ సమర్పించి ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ప్రార్థనలు నిర్వహించారు. ప్రస్తుతం తాను నటించిన ‘దొంగల […]పూర్తి వివరాలు ...

వార్తలు

కాంగ్రెస్‌ పార్టీని వీడి నేనెప్పుడు పోయా

కడప : ‘కాంగ్రెస్‌ పార్టీని వీడి నేనెప్పుడు పోయా.. నేను పోలేదు. జగనే రాజీనామా చేసిపోయారు. ‘ అని ప్రొద్దుటూరు మాజీ శాసన సభ్యుడు వరదరాజులురెడ్డి అన్నారు. ఆదివారం ఇందిరాభవన్‌కు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆత్మగౌరవాన్ని తక్కువ చేసుకుని తాను ఉండలేనని, ఆత్మగౌరవం ఉన్న చోటే ఉంటానని స్పస్టంచేశారు. జగన్‌ వర్గంలోకి పోయారు కదా అని ప్రశ్నించగా.. ఎందుకు, అక్కడికి పోయానో.. ఎందుకు తిరిగి వచ్చానో చెబుతాను. ఆ విషయాన్ని సోమవారం ఇక్కడే (ఇందిరాభవన్‌) విలేకరుల […]పూర్తి వివరాలు ...

వార్తలు

ఆయన మొండిగా వ్యవహరిస్తున్నారు…

స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పోటీ చేస్తే ఏకగ్రీవంగా గెలిపించుకుంటామని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దేవగుడి ఆదినారాయణరెడ్డి, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, కమలమ్మ అన్నారు. కడప నగరంలోని వైఎస్ గెస్ట్‌హౌస్‌లో శనివారం వారు విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్సీగా పోటీ చేయాలని మధ్యవర్తి ద్వారా తాము ప్రతిపాదించినప్పటికీ వివేకానందరెడ్డి సుముఖత చూపలేదన్నారు. ఆయన మొండిగా వ్యవహరించడం అందరికీ బాధాకరంగా ఉందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే తామంతా పదవులు […]పూర్తి వివరాలు ...

వేమన పద్యాలు

వేమన వెలుగులు

ఆశల తెగ గోసి అనలంబు చల్లార్చి గోచి బిగియ బెట్టి కోపమడచి గుట్టు మీరువాడు గురువుకు గురువురా విశ్వదాభిరామ వినురవేమ కోరికలను మొదలంటా నరికేసుకోవాలి. మనసులో చెలరేగే మోహమనే నిప్పును ఉపశమింపజేసుకోవాలి. కామ ప్రక్రియతో పనిలేకుండా అంటే గోచిని విప్పే పనిలేకుండా చేసుకోవాలి. అయినదానికీ కానిదానికీ వచ్చే కోపాన్ని నిర్మూలించుకోవాలి. అప్పుడే బ్రహ్మ రహస్యం తెలుస్తుంది. అలా తెలుసుకున్నవాడే గురువవుతాడు. గురువు కాదు పరమ గురువవుతాడు అని సెలవిస్తున్నాడు వేమన.పూర్తి వివరాలు ...

వార్తలు

మార్చి 1 నుంచి 15 వరకు జిల్లాలో రాజీవ్‌ఆరోగ్యశ్రీ వైద్యశిబిరాలు

కడప : జిల్లాలో మార్చి 1 నుంచి 15వ తేదీ వరకు జరగనున్న రాజీవ్‌ఆరోగ్యశ్రీ వైద్యశిబిరాల వివరాలను రాజీవ్‌ఆరోగ్యశ్రీ జిల్లా కోఆర్డినేటర్‌ మార్కారెడ్డి తెలిపారు. మార్చి 1న అట్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం(పీహెచ్‌సీ) పరిధిలోని రెడ్డిపల్లిలో, 3న తొండూరు పీహెచ్‌సీ పరిధిలోని టి.తుమ్మలపల్లిలో, 4న నూలివీడు పీహెచ్‌సీ పరిధిలోని పులికుంటలో, 5నపూర్తి వివరాలు ...

వార్తలు

మార్చి 18 నుంచి కడపలో సీఆర్‌పీఎఫ్ ఎంపికలు

కడప: మార్చి 18 నుంచి కడపలో సీఆర్‌పీఎఫ్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు స్టెప్ సీఈవోమహేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం సీఆర్‌పీఎఫ్ అధికారులు జిల్లా కలెక్టర్‌తో సమావేశమై ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారని తెలిపారు. కడప తెలుగు గంగ క్వార్టర్స్‌లోని స్టెప్ ఆర్మీ బిల్డింగులో ఈ ఎంపికలు నిర్వహిస్తారన్నారు. విద్యార్హత: 10వ తరగతి ఉత్తీర్ణులై 170 సెం.మీ ఎత్తు ఉన్న ఆసక్తి గల యువకులు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్‌కు దరఖాస్తు చేసి ఎంపికలో పాల్గొనాల్సిందిగా ఆయన తెలిపారుపూర్తి వివరాలు ...

వేమన పద్యాలు

వేమన శృంగార పద్యాలు

వెర్రి వానికైన వేషధారికినైన రోగికైన పరమ యోగికైన స్ర్తీల జూచినపుడు చిత్తంబు రంజిల్లు విశ్వదాభిరామ వినురవేమ అతడు పిచ్చివాడు కావొచ్చు, సందర్భానికో వేషం మార్చేవాడు కావొచ్చు, వ్యాధిగ్రస్తుడు కావొచ్చు. చివరికి గొప్ప యోగి కావొచ్చు, వీరున్నారే, వీరు నలుగురూ స్ర్తీలను చూసినప్పుడు మాత్రం ఎంతో కొంత కామ వికారానికి లోనవుతారు అని వేమన లోకానుభవంతో చెప్తున్న మాట. ఈ పద్యంలో స్ర్తీ సౌందర్య శక్తితో పాటు అన్ని రకాల వారూ స్ర్తీ వ్యామోహానికి గురయ్యే లోకరీతిని చూపిస్తున్నాడు […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

జగన్‌కు సాయం చేస్తా….

పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న తన అల్లుడు సజ్జల శ్రీధర్‌రెడ్డికి మద్దతిచ్చి బలపరచాలని నంద్యాల ఎంపీ ఎస్‌పీవై.రెడ్డి కోరారు. కడప నగరంలోమాజీ కార్పొరేటర్లు, జగన్‌వర్గ నాయకులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్‌పీవై.రెడ్డి మాట్లాడుతూ.. దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి తనకు చాలా సన్నిహితుడని చెప్పారు. తాను అడిగిన వెంటనే వైఎస్ జగన్ మాజీ డీసీసీ అధ్యక్షుడు కె.సురేష్‌బాబును పోటీ నుంచి విరమింపజేసి, తన అల్లుడు సజ్జల శ్రీధర్‌రెడ్డికి మద్దతు ప్రకటించడం సంతోషకరమన్నారు. శ్రీధర్‌రెడ్డికి మద్దతు […]పూర్తి వివరాలు ...

error: