వార్తా విభాగం

రాజకీయాలు

ఈశ్వర్‌రెడ్డి సేవలు ఆదర్శనీయం

కడప: కామ్రేడ్‌ ఎద్దుల ఈశ్వర్‌రెడ్డి సేవలు మరువలేనివని – ఆయన పేద, బడుగు, బలహీనవర్గాల ప్రజల అభ్యున్నతితో పాటు, కర్షకులు, కార్మికుల సంక్షేమం కోసం అహర్నిశ లు పాటుపడ్డారని ఆయనను అందరూ ఆదర్శంగా తీసుకోవాలని వక్తలు అభిబాషించారు. ఎద్దుల ఈశ్వరరెడ్డి జయంతి సందర్భంగా నూతన ఆంధ్రప్రదేశ్‌ లో రాయలసీమ సమగ్రాభివృద్ధి అనే అంశం పై స్థానిక నూర్‌-ఏ-జహాన్‌ కళ్యాణ మండపంలో బుధవారం నిర్వహించిన సదస్సుకు ఎన్‌ఆర్‌ ఆర్‌ రీసెర్చ్‌ సెంటర్‌ పూర్వ సంచాలకులు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ఎద్దుల […]పూర్తి వివరాలు ...

కవితలు

జై రాయలసీమ (కవిత) – సొదుం శ్రీకాంత్

తోరణాలు దిగేయండి పావురాలు ఎగిరేయండి బారులుగా కూరండి మాలలుగా మారండి అడుగుల మడుగై అరవండి జోరుగా జై రాయలసీమ ( నేను అరుచ్చనా, అన్నా ఇనపచ్చాంది గదా? మళ్ళా అర్సాల్నా? ) జై జై రాయలసీమ ( ఇది మీరు -నాకినపల్యా, ఎది ఇంగోసారి, గా……ట్టిగ, గూబ పగల్లాల కొడుకులకు ) ఇంగా ఏముంది ఎదురుజూడ్దానికి? కొట్టం కాలిపాయ బతుకు బుగ్గైపాయ కరువు పుండాయ బతుకు ఎండిపాయ నిండా మునిగినాక సలేంది, గిలేంది! ఇంగ మన బాట […]పూర్తి వివరాలు ...

వార్తలు

ప్రభుత్వ తీరుకు నిరసనగా గురువారం సీమ జిల్లాల బంద్‌

కడప: రాయలసీమ ప్రజల చారిత్రక హక్కు అయిన రాజధానిని రెండు జిల్లాల కోస్తాంధ్రకు తరలించి సీమ ప్రజల ఆకాంక్షలను, హక్కులను ప్రభుత్వం హరిస్తున్నందుకు నిరసనగా రాయలసీమ విద్యార్థి వేదిక (ఆర్.ఎస్.ఎఫ్) గురువారం రాయలసీమ జిల్లాల బంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు వేదిక కన్వీనరు ఎం.భాస్కర్, కోకన్వీనరు దస్తగిరి, జిల్లా కన్వీనరు ప్రసాద్, వైవీయూ కన్వీనరు నాగార్జున ఓ ప్రకటన విడుదల చేశారు. రాయలసీమలోని అన్ని పాఠశాలలు, కాలేజీలకు చెందినా విద్యార్థులు, కవులు, కళాకారులు, ప్రజలు మరియు మేధావులు […]పూర్తి వివరాలు ...

వార్తలు

ఈ పొద్దు నుంచి శ్రీ నారాపుర వేంకటేశ్వరుని పవిత్రోత్సవాలు

తితిదే పరిధిలోని వైఎస్‌ఆర్‌ జిల్లా జమ్మలమడుగులోని శ్రీ నారాపుర వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో బుధవారం నుంచి ఈ నెల 5వతేదీ వరకు మూడు రోజుల పాటు పవిత్రోత్సవాలు జరగనున్నాయి. ఇందులో భాగంగా బుధవారం ఉదయం 9 నుండి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం, యాగశాల పూజ, పుణ్యావచనం, పవిత్ర ప్రతిష్ట నిర్వహిస్తారు. 4వతేదీన ఉదయం 8.30 నుండి 12 గంటల వరకు పవిత్ర సమర్పణ, 5వతేదీన ఉదయం 8.30 నుండి 12 గంటల వరకు స్నపన […]పూర్తి వివరాలు ...

కవితలు

గుండ్రాళ్ళసీమకు దారి తప్పి వచ్చావా? (కవిత)

ఎరక్కపోయి వచ్చి ఇరుక్కుపోయావా? గణనాయకా ఈ అభాగ్యుల క్షమించు..! ఉండ్రాళ్ళు తినే ఓ బొజ్జ గణపయ్యా..! గుండ్రాళ్ళసీమకు దారి తప్పి వచ్చావా? మా గుండె చప్పుళ్ళన్నీ ఆర్తనాదాలై అధికారాన్ని అంధత్వం ఆవరించినవేళ కన్నీళ్ళే ఇంకిపోయిన ఈ సీమలో నిమజ్జనానికి మాత్రం నీళ్ళీక్కడివి? ఆప్యాయతలకూ అనురాగాలకూ కొదువలేని ఈ రాయలసీమలో ఎండిన చెరువులూ, బావులూ గుండెలు బాదుకునే జీవులూ ఎడారిలో ఎండమావులై తడారిపోయిన గొంతులతో ఆకాశం దిక్కు ఆశగా చూస్తూ ఆశ సచ్చి అంతమై పోతున్నారెందరో! గుక్కెడు నీళ్ళకు […]పూర్తి వివరాలు ...

వార్తలు

‘శ్రీబాగ్ అమలయ్యే వరకూ ఉద్యమం’

ప్రొద్దుటూరు: శ్రీబాగ్ ఒడంబడిక మేరకు రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేసేంతవరకు ఉద్యమానికి సన్నద్ధం కావాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు.  రాయలసీమ యునెటైడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో స్థానిక పద్మశాలీయ కల్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే రాయలసీమ వాసులం ఎంతో నష్టపోయామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని ఏర్పాటు కోసం వెంటనే కార్యాచరణ చేపట్టాలన్నారు. దీనికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. తాను రాజధాని సాధనకోసం ఎంత వరకైనా […]పూర్తి వివరాలు ...

వార్తలు

‘చెన్నూరు సహకార చక్కెర కర్మాగారం తెరిపించండి’

కడప: జిల్లాలోని చెన్నూరు సహకార చక్కెర కర్మాగారాన్ని తిరిగి తెరిపించాలని వైకాపా ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్ రెడ్డి సోమవారం శాసనసభలో కోరారు. కేసీ కెనాల్ పరివాహక ప్రాంతంలో 13 మండలాల రైతులు ఈ ఫ్యాక్టరీపైనే ఆధారపడి ఉన్నారన్నారు. చక్కెర కర్మాగారం ఉద్యోగులకు మూడేళ్లుగా జీతాలు కూడా చెల్లించటం లేదని, వారు దుర్భర పరిస్థితిలో ఉన్నారని రవీంద్రనాథ్ రెడ్డి సభ దృష్టికి తీసుకు వచ్చారు. ఇప్పటికైనా తక్షణం రైతులను ఆదుకోవాలంటూ ఆయన ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.పూర్తి వివరాలు ...

రాజకీయాలు

‘ఇది ప్రజాస్వామ్యమా లేక అధ్యక్షపాలనా?’ – పిసిసి చీఫ్

కడప: రాష్ట్రంలో అశాంతి పెరిగిందని, శాంతి భద్రతలు క్షీణించాయని , దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బాధ్యత వహించాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఎన్. రఘువీరారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కడప ఇందిరా భవన్‌లో నియోజకవర్గ ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రఘువీరా మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ఇటీవల విజయవాడలో కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘మీరు ముక్కుసూటిగా […]పూర్తి వివరాలు ...

వార్తలు

సీమ యువకుడికి కేంద్ర సాహిత్య అకాడమీ ‘యువ పురస్కారం’

అనంతపురం జిల్లాలోని గాండ్లపెంట మండలం – తాళ్ళకాల్వ గ్రామానికి చెందిన డా. అప్పిరెడ్డి హరినాథరెడ్డికి 2014 సంవత్సరానికిగానూ కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారంను పొందారు. సాహితీ రంగంలో విశేషంగా కృషి చేసిన 35ఏళ్లలోపున్న వారికి ఈ పురస్కారాన్ని అందిస్తారు. అప్పిరెడ్డి జ్ఞాపికతో పాటు 50 వేల రూపాయలను అందుకోనున్నారు. ఇంతకు ముందు కడప జిల్లాకు చెందిన వేంపల్లి గంగాధర్, వేంపల్లి షరీఫ్ లు కూడా  కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారాన్ని అందుకున్నారు. వరుసగా రాయలసీమకు […]పూర్తి వివరాలు ...