ఓట్ల బడికి రెండు రోజుల సెలవులు

పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న బడులకు ఎన్నికల రోజు, ముందు రోజు సెలవుగా ప్రకటించి, బడిని ఎన్నికల సిబ్బందికి అప్పగించాలని జిల్లా విద్యాధికారి అంజయ్య ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలిచ్చారు.

ఇద్దరు ఉపాధ్యాయులకు ఓట్లకు సంబందించిన విధులుంటే ఆ బడులకు కూడా రెండు రోజులు సెలవులు ఉంటాయన్నారు. ఎన్నికలు లేని ప్రాంతాల్లోని పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు విధులు లేకుంటే పాఠశాలలు యధాతథంగా నిర్వహించాలన్నారు.

ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచి పాఠశాలలు మామూలుగా కొనసాగించాలన్నారు.

చదవండి :  నెలాఖరు వరకు ఉపకారవేతనాల దరఖాస్తుకు గడువు

ఈ నిబంధనలు 23, 27, 31 తేదీలకు వర్తిస్తాయన్నారు.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి


error: