ఓట్ల బడికి రెండు రోజుల సెలవులు

    ఓట్ల బడికి రెండు రోజుల సెలవులు

    పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న బడులకు ఎన్నికల రోజు, ముందు రోజు సెలవుగా ప్రకటించి, బడిని ఎన్నికల సిబ్బందికి అప్పగించాలని జిల్లా విద్యాధికారి అంజయ్య ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలిచ్చారు.

    ఇద్దరు ఉపాధ్యాయులకు ఓట్లకు సంబందించిన విధులుంటే ఆ బడులకు కూడా రెండు రోజులు సెలవులు ఉంటాయన్నారు. ఎన్నికలు లేని ప్రాంతాల్లోని పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు విధులు లేకుంటే పాఠశాలలు యధాతథంగా నిర్వహించాలన్నారు.

    ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుంచి పాఠశాలలు మామూలుగా కొనసాగించాలన్నారు.

    చదవండి :  రేపు రాయలసీమ మహాసభ సమావేశం

    ఈ నిబంధనలు 23, 27, 31 తేదీలకు వర్తిస్తాయన్నారు.

      వార్తా విభాగం

      ఇవీ చదవండి

      Leave a Reply

      Your email address will not be published. Required fields are marked *