కడప: జిల్లాలో 48 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు సగటు వర్షపాతం లేని మండలాలను కరవు పీడిత ప్రాంతాలుగా గుర్తిస్తూ రాష్ట్ర రెవిన్యూ విభాగం ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లాలో కరవు పీడిత మండలాలుగా గుర్తించినవి ఇవీ…. రామాపురం, చక్రాయపేట, సింహాద్రిపురం, పెనగలూరు, గాలివీడు, వీరబల్లి, జమ్మలమడుగు, కడప, తొండూరు, పుల్లంపేట, లక్కిరెడ్డిపల్లె, అట్లూరు, వేంపల్లె, బద్వేలు, గోపవరం, చిన్నమండెం, రాయచోటి, పులివెందుల, […]పూర్తి వివరాలు ...
Tags :సంబేపల్లె
తొలివిడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఆదివారం జరుగనున్నాయి. 29 మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఎంపీటీసీ బరిలో 1055 మంది, జడ్పీటీసీ బరిలో 144 మంది అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 29 జడ్పీటీసీ స్థానాలకు, 326 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 8,05,681 మంది పల్లె ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఐదు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. బద్వేల్, అట్లూరు, గోపవరం, బికోడూరు, కలసపాడు, పోరుమామిళ్ళ, కాశినాయన, మైదుకూరు, బీమఠం, దువ్వూరు, […]పూర్తి వివరాలు ...
ఆదివారం మధ్యాహ్నం సిద్దల బోనాలు పట్టడంతో ప్రారంభమైన మల్లూరమ్మ జాతర సోమవారం పగలు కనుల పండువగా సాగింది. రాత్రికి మొక్కుబడిదారులు ఏర్పాటు చేసిన 17 చాందినీ బండ్లు సోమవారం తెల్లవారుజాముకు జాతరకు చేరుకున్నాయి. బండ్ల ముందు ట్రాక్టర్లలో వీధి నాటకాలు, చెక్కభజనలు, కోలాటాలు చేశారు. ఇవి భక్తులను అలరించాయి. వేల సంఖ్యలో ప్రజలు రావడంతో గుడి దగ్గర రద్దీగా మారింది. ఒక్కో బండికి ఒక చుట్టే తిరగాలని పోలీసులు చెప్పడంతో ప్రశాంతంగా ప్రదక్షిణలు సాగాయి. సోమవారం పగలు తిరునాళ్ల […]పూర్తి వివరాలు ...