Tags :పోట్లదుర్తి

    చరిత్ర పర్యాటకం పల్లెలు

    పోట్లదుర్తి – యాట కుక్కపైన కుందేళ్లు తిరగబడిన చోటు

    ఈ ఊరున్న తావులో కుందేళ్ళ పైకి యాటకుక్కను ఇడిసిపెడితే ఆ యాటకుక్కపైన కుందేళ్లు తిరగబడినాయంట. ఈ తావు శౌర్యం కలిగినదని భావించి  ఇక్కడ ఊరు కట్టించగా దానికి 'పోట్లదుర్తి' అనే పేరు పొందిందట.పూర్తి వివరాలు ...

    ఆలయాలు

    అగస్తేశ్వరాలయాలు – కడప జిల్లా

    కడప జిల్లాలో ఉన్న అరుదైన ఆలయాలు ఈ అగస్త్యేశ్వరాలయాలు. సరైన ప్రచారానికి నోచుకోకుండా, జనబాహుళ్యంలో ఈ అరుదైన ఆలయాల గురించి చాల తక్కువ మందికి తెలుసు. చరిత్ర ప్రకారంగా చూస్తే, వీటిని రేనాటి చోళుల కాలంలో (క్రీ. శ. 6-9 శతాబ్దాల కాలం) నిర్మించారని శాసనాల ద్వారా తెలుస్తోంది. అగస్త్య మహాముని దక్షిణ భారతదేశ యాత్రలో, తాను బస చేసిన ప్రదేశాలలో శివలింగాలని ప్రతిష్టించారు అని కథనం. అగస్త్య ప్రతిష్టితమైన ఈ శివలింగాలు భారీలింగ రూపంలో, స్థంభములాగా, […]పూర్తి వివరాలు ...

    పల్లెలు సమాచారం

    చెట్టూ చేమల పేర్లు కలిగిన ఊర్లు

    కడప జిల్లాలో వివిధ రకాలయిన చెట్ల పేర్లను సూచించే 131 ఊర్లు ఉన్నాయి. ఈ 131 ఊర్లూ 57 రకాల చెట్టూ చేమల పేర్లు కలిగి ఉండడం ఆసక్తికరమైన విశేషం.  అత్తి: అత్తిరాల అనుము: హనుమనగుత్తి ఇప్ప: ఇప్పట్ల, ఇప్పపెంట లేదా ఇప్పెంట ఈదు: ఈదులపల్లె, ఈదుళ్ళపల్లె ఊడవ: ఊడవగండ్ల ఏపె: ఏప్పిరాల, ఏపిలమిట్ట, ఏపిలవంకపల్లె ఒడిశ: ఒడిశలగొంది కనుము: కనుపర్తి కలే: కలికిరి కానుగ: గానుగపెంట గార: గారాలమడుగు గురిగింజ: గురిగింజకుంట గొట్టి: గొట్లమిట్ట గోనుమాకు: […]పూర్తి వివరాలు ...

    జానపద గీతాలు ప్రసిద్ధులు

    కలిమిశెట్టి మునెయ్య – జానపద కళాకారుడు

    ఆంధ్రప్రదేశ్‌లో జానపదబ్రహ్మగా ఖ్యాతి పొందిన మునెయ్య వాడవాడలా తిరిగి సేకరించిన జానపద గేయాలు వేనవేలు. ఔత్సాహిక కళాకారులెందరికో స్పూర్తి ప్రదాత. మునెయ్య కేవలం గాయకులే కాక మంచి రచయిత, చిత్రకారులు. వీరపునాయునిపల్లె శ్రీ సంగమేశ్వర ఉన్నత పాఠశాలలో చిత్రలేఖన ఉపాధ్యాయులుగా పనిచేశారు. 1943 సంవత్సరంలో కడప జిల్లాలో జమ్మలమడుగు తాలూకా దొమ్మరనంద్యాలలో జన్మించారు మునెయ్య. సరిగ్గా ఇది (2013) ఆయన 70వ జయంతి సంవత్సరం. అబ్బ శ్రీ కలిమిశెట్టి చౌడప్ప శిష్యరికంలో యక్షగానం, కోలాటం, పండరి భజన, […]పూర్తి వివరాలు ...

    చరిత్ర వ్యాసాలు

    అల్లసాని పెద్దన చౌడూరు నివాసి

    ఆంధ్ర సాహిత్య ప్రబంధాలలో మనుచరిత్ర కున్నంత స్థానం మరే ప్రబంధానికీ లేదు. అల్లసాని పెద్దనామాత్యుడీ ప్రబంధాన్ని రచించాడు. ఈయన నందవరీక బ్రాహ్మణుడు. చొక్కనామాత్యుని పుత్రుడు. అహోబలం మఠం పాలకుడు శఠగోపయతి వల్ల చతుర్విధ కవిత్వాలు సంపాదించుకొన్నాడు. అల్లసాని పెద్దన శ్రీకృష్ణదేవరాయల కొలువులో ప్రవేశించక మునుపే హరికథాసారం రచించాడు. ఈ గ్రంథం లభ్యం కాలేదు. ఇందలి కొన్ని పద్యాలను కస్తూరి రంగకవి తన ఆనందరంగరాట్ఛందంలో ఉదాహరించాడు. శ్రీకృష్ణరాయలు క్రీ.శ. 1509లో విజయనగర సింహాసనం అధిష్ఠించాడు. అప్పటికే ఆ రాజ్యం […]పూర్తి వివరాలు ...