మురళి వూదే పాపడు కథల సంపుటి ఆవిష్కరణ సామాజిక మార్పును ప్రతిబింబించే దాదా హయాత్ కథలు : సింగమనేని ప్రొద్దుటూరు : సమాజంలో జరుగుతున్న మార్పుకు ప్రతిబింబంగా దాదాహయాత్ కథలు నిలుస్తాయని, గత సమాజపు పరిస్థితులు , నేటి సమాజపు పరిస్థితులను పోల్చి చేసుకునేందుకు ఒక కొలమానంగా నిలుస్తాయన్నారు ప్రముఖ కథా రచయిత, విమర్శకులు సింగమనేని నారాయణ. ఆదివారం ప్రొద్దుటూరు పట్టణంలోని తల్లంసాయి రెసిడెన్సీలో ‘మురళి వూదే పాపడు’ కథల సంపుటిని (దాదా హయాత్ రాసిన కథలు) […]పూర్తి వివరాలు ...
Tags :తవ్వా వెంకటయ్య
కడప: ‘రాయలసీమ తొలితరం కథలు’ , ‘సీమ కథా తొలకరి’ పుస్తకాల అవిష్కరణ సభ ఈ నెల 11వ తేదీ బుధవారం సాయంత్రం 5-30 గంటలకు ఎర్రముక్కపల్లె సిపి బ్రౌన్బాషా పరిశోధన కేంద్రం బ్రౌన్శాస్ర్తీ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్నట్లు ఆ సభ నిర్వహకులు, పరిశోధకుడు డాక్టర్ తవ్వా వెంకటయ్య సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కథారచయిత తవ్వా ఓబుల్ రెడ్డి అతిధులకు ఆహ్వానం పలుకుతారని, ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులుగా కర్నూలు కథరచయిత డాక్టర్ ఎమ్ హరికిషన్, ముఖ్యఅతిథులుగా […]పూర్తి వివరాలు ...
వేంపల్లె: స్థానిక లిటిల్ఫ్లవర్ ఉన్నత పాఠశాలలో గురువారం సాయంత్రం వేంపల్లె షరీఫ్ రచించి ప్రచురించిన ‘తలుగు’ పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిగింది. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖర్రెడ్డి, మాజీ శాసనమండలి సభ్యుడు షేక్హుసేన్, మాజీ ఎంపీ తులసిరెడ్డి పుస్తకాన్ని ఆవిష్కరించి, అతిధులకు ప్రతులను అందించారు. సమాజంలోని కథా వస్తువులు తీసుకుని పాఠకుల హృదయాలను కదిలించేలా రచయితలు కథలు రాయాలని ఈ సందర్భంగా వక్తలు అభిభాషించారు. షేక్హుసేన్ మాట్లాడుతూ ‘ముస్లింల జీవన స్థితిగతులపై గతంలో […]పూర్తి వివరాలు ...
కథానిక, నవల, నాటకం ఏదైనా తెలుగు సాహిత్యం సామాజిక చైతన్యానికి- రుగ్మతలు రూపుమాపటానికి ఉపయుక్తమవుతుందని తెలుగు శాఖ సహ ఆచార్యుడు తప్పెట రామప్రసాద్రెడ్డి వివరించారు. యోగివేమన విశ్వవిద్యాలయంలో ’21వ శతాబ్ది తెలుగు సాహిత్యం తీరుతెన్నులు’ అనే అంశంపై మూడు రోజుల జాతీయ సదస్సులో శుక్రవారం ఆయన అధ్యక్షోపన్యాసం చేశారు. మూఢాచారాలను రూపుమాపేందుకు సాహిత్యం ఆయుధమన్నారు. 21వ శతాబ్ది సాహిత్యం మరింత పదునైన ఆయుధంగా రూపుదిద్దుకొంటోందని సంతృప్తి వ్యక్తం చేశారు. సమాజం మరింత పురోభివృద్ధి చెందటానికి తనవంతు పాత్ర […]పూర్తి వివరాలు ...