Tags :కడప

వార్తలు

‘శివరామక్రిష్ణన్’కు నిరసన తెలిపిన విద్యార్థులు

కడప: రాజధాని ఎంపికకు సంబంధించి అభిప్రాయ సేకరణ జరిపేందుకు ఈ రోజు కడపకు వచ్చిన శివరామకృష్ణన్ కమిటీకి విద్యార్థుల నుండి నిరసన ఎదురైంది. రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతూ రాయలసీమ స్టూడెంట్ ఫెడరేషన్‌ విద్యార్థులు శివరామకృష్ణన్ కమిటీ సమావేశం జరుగుతున్న హాల్ లోకి దూసుకువెళ్లి తమ నిరసన తెలియచేశారు. ఈ సందర్భంగా వారు కమిటీ రాకను నిరసిస్తూ ప్లెకార్డులు ప్రదర్శించారు. రాయలసీమకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని ఈ సందర్బంగా వారు కోరారు. నిరసన  తెలుపుతున్న విద్యార్థులను […]పూర్తి వివరాలు ...

ప్రత్యేక వార్తలు

ఈ రోజు కడపకు శివరామక్రిష్ణన్

ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎంపిక కోసం కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ నేడు కడప జిల్లాలో పర్యటించనుంది. ఉదయం 10.30 గంటలకు కడపలోని సభా భవనంలో జిల్లా అధికారులతో కమిటీ సమావేశం కానుంది. కొత్త రాజధాని ఏర్పాటుపై అభిప్రాయాలు, వినతలు స్వీకరించనుంది. ఇప్పటికే ఒకసారి ఆయా ప్రాంతాలలో పర్యటించి పర్యటనలు పూర్తైనట్లు ప్రకటించిన శివరామకృష్ణన్ కమిటీ ఇప్పుడు మళ్ళీ పర్యటిస్తుండడం వెనుక మతలబు ఏమిటో? ఒక పక్క కమిటీ ఇలా పర్యటనలు చేస్తోంటే రాష్ట్ర మంత్రులూ, ముఖ్యమంత్రీ రాజధాని, […]పూర్తి వివరాలు ...

వార్తలు

‘అందరూ ఇక్కడోళ్ళే … అన్నీ అక్కడికే’

ముఖ్యమంత్రి, ప్రతిపక్షనేత, కాంగ్రెస్ అధ్యక్షుడు అందరూ రాయలసీమ వాసులేనని, కానీ ఇక్కడి ప్రాంతాలకు అన్యాయం చేస్తున్నారని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లక్ష్మణరెడ్డి ఆరోపించారు. జిల్లాకు వచ్చిన ఆయన ఆదివారం రాత్రి స్టేట్ గెస్ట్‌హౌస్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. వెనుకబడిన రాయలసీమలోనే రాష్ట్ర రాజధానిని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు.  సారవంతమైన మాగానిలో భూములను కొనుగోలు చేసి రాజధానిని నిర్మించడం వల్ల పచ్చని పంటపొలాలను పోగొట్టుకుంటామన్నారు. రాయలసీమలో గడ్డికూడా మొలవని భూములున్నాయని చెప్పారు. ఒక నాడు మద్రాసు […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం

అలాంటి ప్రశ్న అడగవచ్చునా?

కడప జిల్లాకు కలెక్టర్ గా నియమితులైన కే.వీ. రమణ గారిని ఒక పాత్రికేయ మిత్రుడు అడిగిన ప్రశ్న చూడండి. ప్ర: రాయలసీమలో తొలిసారిగా పనిచేస్తున్నారు. రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొనగలరా? స: మొదటి నుంచి కోస్తా, తెలంగాణ జిల్లాల్లో నా సర్వీసు అంతా కొనసాగింది. 2000 సంవత్సరంలో సత్యసాయిబాబా 75వ జన్మదిన వేడుకల సమయంలో రెండున్నర నెలలపాటుఅనంతపురం జిల్లా పుట్టపర్తిలో ఓఎస్డీగా పనిచేశాను. అది మినహా రాయలసీమలో ఎక్కడా పని చేయలేదు. అధికారులు, ప్రజలతోపాటు, పార్టీలతో సంబంధం లేకుండా […]పూర్తి వివరాలు ...

వార్తలు

ఔను..వీళ్ళు కూడా అంతే!

కడప జిల్లా అంటే అదేదో వినకూడని పేరైనట్లు ప్రభుత్వ పెద్దలు చిన్నచూపు చూస్తుంటే తాజాగా రాజధాని ఎంపిక కోసం ఏర్పాటైన శివరామకృష్ణన్ కమిటీ తానేమీ తక్కువ తినలేదని నిరూపించింది.రాయలసీమలోని మూడు జిల్లాలను పరిశీలించిన సదరు కమిటీ సభ్యులు ఒక్క కడప జిల్లాను మాత్రం విస్మరించారు. ఎంచేత? ప్రభుత్వ పెద్దలూ, కేంద్ర ప్రభుత్వంలో మంత్రివర్యులూ అంతా కమిటీతో సంబంధం లేకుండా తమ సామాజికవర్గం, ధనికుల ప్రాబల్యం అధికంగా ఉండే గుంటూరు – విజయవాడ ప్రాంతాన్ని రాజధానిగా చేస్తున్నట్లు ప్రకటించేశారు. […]పూర్తి వివరాలు ...

వార్తలు

సీమ కోసం గొంతెత్తిన సాహితీకారులు

రాయలసీమ స్థితిగతులపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని రాయలసీమకు చెందిన కవులు, రచయితలు డిమాండ్ చేశారు. తుఫానులు, భూకంపాల ప్రాంతంగా జిఎస్‌ఐ నివేదిక పేర్కొన్న విజయవాడ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు అశాస్త్రీయమని వారు గుర్తు చేశారు. కడప సిపిబ్రౌన్ గ్రంధాలయ పరిశోధన కేంద్రంలో కుందూ సాహితీ ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన రాయలసీమ కవులు, రచయితలతో సమాలోచన జరిగింది. ఆచార్య రాచపాలెం చంద్రశేఖరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ముఖ్యఅతిధిగా పాల్గొన్న కేంద్రసాహితీ అకాడమి అవార్డు […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

కడప జిల్లాపరిషత్ ఏకగ్రీవం

కడప జిల్లా పరిషత్‌ పీఠం ఏకగ్రీవమైంది. జడ్పీ పీఠాన్ని దక్కించుకోవాలని తెదేపా నేతలుచేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో ఆ పార్టీ సభ్యులు ప్రమాణ స్వీకార అనంతరం ఓటింగ్‌ కన్నా ముందే సమావేశం నుంచి వెళ్లిపోయారు. దీంతో వైకాపా సభ్యులు జడ్పీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. చైర్మన్‌గా ఎర్రగుంట్ల జడ్పీటీసీ సభ్యుడు గూడూరు రవి, వైస్‌చైర్మన్‌గా ఒంటిమిట్ట జడ్పీటీసీ సభ్యుడు ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కలెక్టర్‌ కోన శశిధర్‌ అధ్యక్షతన జడ్పీ పాలకవర్గం ఎన్నికలు జరిగాయి. […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

పాలకవర్గాలు ఏర్పడినాయి!

కడప నగరపాలికతోపాటు, ఆరు పురపాలికల్లో పాలకవర్గాలు గురువారం కొలువు దీరాయి. జమ్మలమడుగులో మాత్రం ఓ కౌన్సిలర్ కనిపించకుండా పోవడంతో తెదేపా నేతలు వీరంగం చేశారు. దీంతో అక్కడ పాలకవర్గం ఎన్నికను ఈరోజుకు వాయిదా వేశారు. బద్వేలులో ఛైర్మన్‌గా తెదేపా కౌన్సిలర్ పార్థసారధిని ఎన్నుకోగా, వైస్ ఛైర్మన్ అభ్యర్థిపై స్పష్టత రాకపోవడంతో ఆ ఎన్నిక వాయిదా వేశారు. కడప నగరపాలికలోని మేయర్, డిప్యూటీ మేయర్, ఏడు పురపాలికల్లో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులకు గురువారం ఎన్నిక నిర్వహించారు. అన్ని చోట్లా […]పూర్తి వివరాలు ...

వార్తలు

అనుకున్నదే అయ్యింది!

కడప విమానాశ్రయం ప్రారంభం వాయిదా పడింది. వాస్తవంగా అయితే సోమవారం విమానాశ్రయాన్ని ప్రారంభించాలని ముందుగా భావించారు. తరువాత ప్రభుత్వ పెద్దల బిజీగా ఉండటంతో ఈ కార్యక్రమాన్ని బుధవారానికి వాయిదా వేసినట్లు వార్తలు వచ్చాయి.  ఆ మేరకు సన్నాహాలు జరుగుతున్నట్లు మీడియా హోరేత్తించింది. ముందుగా ఊహించినట్లుగానే విమానాశ్రయం ప్రారంభం మళ్ళా వాయిదా వేశారు. తిరిగి ఎప్పుడు ప్రారంభించేది గురువారం తెలిసే అవకాశం ఉంది. ఎందుకు వాయిదా పడింది అనే అంశంపై అటు ఏఏఐ అధికారులు కాని, ఇటు జిల్లా […]పూర్తి వివరాలు ...