Tags :ఎన్నికలు

రాజకీయాలు

కడప శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

కడప శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 36 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెదేపా, బసపాల తరపున ముగ్గురేసి అభ్యర్థులు నామినేషన్లు సమర్పించగా, వైకాపా, కాంగ్రెస్, భాజపా, జైసపా, సిపిఎం, సిపిఐ పార్టీల తరపున ఇద్దరేసి అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు . మొత్తం పది మంది అభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు. వీరిలో కొందరు స్వతంత్ర అభ్యర్థిగా మరియు ఏదో ఒక పార్టీ అభ్యర్థిగా నామినేషన్లు దాఖలు చేశారు […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

కడప పార్లమెంటు బరిలో ఉన్న అభ్యర్థులు

సార్వత్రిక ఎన్నికలలో కీలక ఘట్టమైన నామినేషన్ల దాఖలు నేటితో ముగిసింది. కడప పార్లమెంటు నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల వివరాలు … వైఎస్ అవినాష్ రెడ్డి – వైకాపా రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి – తెదేపా రెడ్డెప్పగారి హేమలత – తెదేపా వీణా అజయ్ కుమార్ – కాంగ్రెస్ షేక్ మహబూబ్ బాష – కాంగ్రెస్ సాజిద్ హుస్సేన్ – ఆమ్ ఆద్మీ పార్టీ గజ్జల రామసుబ్బారెడ్డి – పిరమిడ్ పార్టీపూర్తి వివరాలు ...

రాజకీయాలు

రాజంపేట పార్లమెంటు బరిలో ఉన్న అభ్యర్థులు

ఈ రోజు (శనివారం) నామినేషన్ల ఘట్టం ముగిసింది. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గంలో నామినేషన్ దాఖలు చేసిన అభ్యర్థుల వివరాలు … అయ్యన్నగారి సాయిప్రతాప్ – కాంగ్రెస్ షేక్ జిలాని సాహెబ్ – కాంగ్రెస్ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి – వైకాపా పెద్దిరెడ్డి స్వర్ణలత – వైకాపా దగ్గుబాటి పురందేశ్వరి – భాజపా సి వాసుదేవరెడ్డి – భాజపా జి ముజీబ్ హుస్సేన్ – జైసపా ఎస్ నాగేంద్రబాబు – మహాజన సోషలిస్ట్ పార్టీ ఎస్ నరేంద్రబాబు – […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

పులివెందుల నుంచి వైఎస్ జగన్ పోటీ

వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌ గురువారం పులివెందుల శాసనసభ నియోజకవర్గం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అశేష జనవాహిన నడుమ తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో వైఎస్ జగన్తో పాటు ఆయన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి, ఈసీ గంగిరెడ్డి ఉన్నారు. కాగా వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి తొలిసారిగా పులివెందుల నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2009 ఎన్నికలలో కడప […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

కడప జిల్లాలో ప్రధాన పార్టీల శాసనసభ అభ్యర్థులు

కడప జిల్లాలో మొత్తం పది శాసనభ నియోజకవర్గాలున్నాయి. ఈ పది నియోజకవర్గాలలో ప్రధాన పార్టీలైన వైకాపా, కాంగ్రెస్, తెదేపా+భాజపా మరియు జైసపాల తరపున బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు.పూర్తి వివరాలు ...

వార్తలు

మొదటి దశలో 80.40 శాతం పోలింగ్

స్థానిక (ఎంపీటీసీ, జెడ్పీటీసీ) ఎన్నికల మొదటి దశ పోరులో జిల్లాలోని మైదుకూరు, బద్వేలు, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని 29 మండలాల పరిధిలో 29 జెడ్పీటీసీ, 326 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఉదయం 7గంటల నుంచి ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. జిల్లా వ్యాప్తంగా 80.40 శాతం పోలింగ్ నమోదైంది. బ్యాలెట్ పేపర్ల ద్వారా పోలింగ్ నిర్వహించారు. ఉదయం మందకొడిగా సాగిన పోలింగ్ 9 గంటల తర్వాత ఊపందుకుంది.పూర్తి వివరాలు ...

వార్తలు

స్థానిక ఎన్నికల పోలింగ్ ప్రారంభం

జిల్లా వ్యాప్తంగా స్థానిక సంస్థల తొలి విడత సమరం ప్రారంభమైంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఉదయం 7 గంటలకు ఆరంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. స్థానిక ఎన్నికలను బ్యాలెట్‌ పద్దతిలో నిర్వహిస్తున్నారు. జెడ్పీటీసీకి తెలుపు రంగు‌, MPTC గులాబి రంగు బ్యాలెట్‌ పత్రాలను వాడుతున్నారు. రాయచోటి మండలం అబ్బవరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద వైకాపా, తెదేపా కార్యకర్తలు తోపులాటకు దిగడంతో ఘర్షణ జరిగింది. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

తొలివిడత స్థానిక ఎన్నికలు ఈ పొద్దే!

తొలివిడత జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఆదివారం జరుగనున్నాయి. 29 మండలాల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఎంపీటీసీ బరిలో 1055 మంది, జడ్పీటీసీ బరిలో 144 మంది అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మొత్తం 29 జడ్పీటీసీ స్థానాలకు, 326 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగనున్నాయి. 8,05,681 మంది పల్లె ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. ఐదు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికలు జరుగుతున్నాయి. బద్వేల్, అట్లూరు, గోపవరం, బికోడూరు, కలసపాడు, పోరుమామిళ్ళ, కాశినాయన, మైదుకూరు, బీమఠం, దువ్వూరు, […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

72.71 శాతం పోలింగ్ నమోదు

జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలలో సరాసరి 72.71% పోలింగ్ నమోదైంది. మొత్తం మీద ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. కడప కార్పొరేషన్‌తో పాటు ప్రొద్దుటూరు, పులివెందుల, జమ్మలమడుగు, రాయచోటి, బద్వేల్, మైదుకూరు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీల్లో ఎన్నికలు జరిగాయి. 232 వార్డులు/డివిజన్‌లలో ఎన్నికలు జరుగగా 1188 మంది బరిలో నిలిచారు. 6,56,742 మందికి ఓట్లు ఉంటే 4,44,355 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.  పోలీసులు కట్టుదిట్టమైన […]పూర్తి వివరాలు ...