Tags :ysr district

ప్రత్యేక వార్తలు

జేసీ దివాకర్‌రెడ్డికి, పులివెందులకు ఉన్న సంబంధం…

కోవరంగుంటపల్లె: ప్రముఖుల పుట్టినిల్లుగా పేరొందిన కోవరంగుంటపల్లెకు స్వాతంత్య్ర సమర యోధుల గడ్డగా కూడా పేరుంది. కడప గాంధీగా పేరొందిన దేవిరెడ్డి రామసుబ్బారెడ్డి స్వగ్రామం ఇదే. స్వాతంత్య్ర ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్న ఈయన ఇంగ్లాండ్‌లో బారిష్టర్ చదివారు. గాంధీ ఆశయాలతో రాజకీయ రంగ ప్రవేశం చేశారు. స్వాతంత్య్రం కోసం జరిగిన ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు అరెస్టు చేసి ఒక ఏడాది పాటు జైలులో ఉంచారు. రామసుబ్బారెడ్డి జైలు నుంచి విడుదలయిన కొద్ది రోజులకే గాంధీ విదేశీవస్తు […]పూర్తి వివరాలు ...

వార్తలు

బ్రహ్మణి స్టీల్స్‌ను ఆపొద్దు …

కడప: రాయలసీమ ప్రజల ఉపాధికి అవకాశాలున్న బ్రహ్మణి స్టీల్స్‌ను రాజకీయాలతో ముడిపెట్టి అడ్డుకోవద్దని రాయలసీమ కార్మిక, కర్షక సమితి డిమాండ్ చేసింది. వెనుకబడిన రాయలసీమ, ప్రత్యేకించి వైఎస్సార్ జిల్లా ప్రజలకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో నిర్దేశించిన ఈ ప్రాజెక్టును రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని సమితి ఆరోపించింది. స్థానిక ప్రజల ఉపాధి కోసం తలపెట్టిన ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చేలా పార్టీలకు అతీతంగా అందరూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని విజ్ఞప్తి చేసింది. రాయలసీమ కార్మిక, కర్షక సమితి అధ్యక్షుడు […]పూర్తి వివరాలు ...

కైఫియత్తులు చరిత్ర

‘పోలి’ గ్రామ చరిత్ర

జిల్లా చరిత్ర పుటల్లో పోలి గ్రామానికి ప్రత్యేకస్థానం ఉంది. రాజంపేట పట్టణానికి ఆనుకుని ఉన్న ఈ గ్రామానికి వేయి సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడ ఓ స్త్రీ (పోలి) తన బిడ్డను త్యాగం చేసి యజమాని వంశాన్ని నిలబెడితే, మరో స్త్రీ(సగలక్క) ఆత్మబలిదానం చేసుకుని పోలి గ్రామస్తులను కాపాడింది. ఇదంతా 11వ శతాబ్దం నాటి యథార్థ గాథ అని, ఈ వివరాలన్నీ కడప కైఫీయత్తుల్లో వెలుగు చూశాయని చరిత్రకారులు అంటున్నారు. రాజంపేట పట్టణ పరిధిలో ఉన్న పోలి […]పూర్తి వివరాలు ...

వార్తలు

9 నుంచి 11 వరకు కడపలో జగన్

కడపః ఈనెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకూ వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లాలో అందుబాటులో ఉంటారు. 9,11 వ తేదీలలో పులివెందులలోని తన క్యాంపు కా ర్యాలయంలో అందుబాటులో ఉంటారు. 10వ తేదీన కడపలో పర్యటిస్తారని పులివెందుల వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత  వై.ఎస్.భాస్కర్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి జిల్లా పర్యటన ఖరారైన సమయంలోనే జగన్ పర్యటన ఖరారవడం విశేషం.పూర్తి వివరాలు ...

వ్యవసాయం

పంటల సాగు వివరాలు – కడప జిల్లా

జిల్లాలో సగటున 10 లక్షల 8 వేల ఎకరాల సాగు భూమి ఉండగా సగటున 9 లక్షల 81 వేల ఎకరాల విస్తీర్ణంలో సాగు జరుగుతోంది. వరి, వేరుసెనగ, కంది, సెనగ, అలసందలు జిల్లాలో సాగు చేసే ప్రధాన ఆహార పంటలు. పసుపు, చెరకు, ప్రత్తి, ఉల్లి, పొద్దుతిరుగుడు, నువ్వులు, మిరప, టమోటా తదితరాలైన వాణిజ్య పంటలు సాగవుతాయి. సాగు భూమిలో సుమారుగా 5 శాతం మేరకు వాణిజ్య పంటలు సాగవుతాయి. జిల్లా వ్యాప్తంగా 52 శాతం […]పూర్తి వివరాలు ...

వార్తలు

జిల్లాలో నెలకు ఒక సారి సాంస్కృతిక కార్యక్రమాలు : కలెక్టర్ అనిల్‌కుమార్

కడప: తెలుగు నాటక రంగ దినోత్సవం నవంబర్ 6వ తేదీన నిర్వహించేందుకు సబ్ కమిటీ ఏర్పాటు చేసి నిస్నాతులైన కళాకారులను ఎంపిక చేయాలని కలెక్టర్, జిల్లా సాంస్కృతిక వ్యవహారాల మండలి అధ్యక్షులు వి.అనిల్‌కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్‌లో తెలుగునాటక రంగ దినోత్సవంపై సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా సాంస్కృతిక సంప్రదాయాలను చాటి చెప్పే విధంగా సాంస్కృతిక కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలన్నారు.పూర్తి వివరాలు ...

వార్తలు

యోగి వేమన విశ్వవిద్యాలయానికి యూజీసీ 12-బీ గుర్తింపు

కడప: కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయానికి యూనివర్శిటీస్ గ్రాంట్స్ కమిషన్( యూజీసీ) 12-బీ గుర్తింపు మంజూరు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు అందాయి. దీంతో వైవీయూ పరిపూర్ణ విశ్వవిద్యాలయంగా రూపుదిద్దుకుంది. వీసీ ఆచార్య అర్జుల రామచంద్రారెడ్డి 12-బీ గుర్తింపు కోసం చేసిన కృషి ఎట్టకేలకు ఫలించడంతో వర్శిటీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు సోమవారం వీసీకిపూర్తి వివరాలు ...

వార్తలు

నేడు ఇడుపులపాయకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాక

పులివెందుల: దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ద్వితీయ వర్ధంతిని పురస్కరించుకుని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, కడప ఎంపీ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన కుటుంబసభ్యులతో కలిసి నేడు ఇడుపులపాయకు రానున్నారు. హైదరాబాద్‌నుంచి గురువారం రాత్రి వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్ రైలులో బయలుదేరి శుక్రవారం ఉదయం ఎర్రగుంట్ల చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన ఇడుపులపాయకు వస్తారు. ఉదయంపూర్తి వివరాలు ...

పర్యాటకం ప్రత్యేక వార్తలు

ప్రపంచంలోనే అరుదైన కలివికోడి లంకమలలో

సుమారు వందేళ్ళ క్రితమే అంతరించిపోయిందని భావించిన కలివికోడి ఇరవై ఏళ్ళ కిందట 1986వసంవత్సరంలో మనదేశంలోని తూర్పు కనుమల్లో భాగమైన నల్లమల, శేషాచలం పర్వతపంక్తులలోని శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో సిద్దవటం-బద్వేలు మధ్య అటవీ ప్రాంతంలో ప్రత్యక్షమై పక్షిశాస్త్ర వేత్తలనూ, ప్రకృతి ప్రేమికులనూ ఆశ్చర్యానికి గురిచేసింది. కలివికోడి రక్షణకు గత ఇరవై ఏళ్ళగా పలుచర్యలను తీసుకుంటున్నారు. ..ఆ పక్షి ఉనికికే ప్రమాదం కలిగే రీతిలో జరిగిన పరిణామాలు  ప్రపంచవ్యాప్త చర్చకు  దారితీశాయి. కలివికోడికి ఆవాస ప్రాంతమైన లంకమల పరిథిలో తెలుగుగంగ […]పూర్తి వివరాలు ...