హైదరాబాదు: రాయలసీమను ఎట్టి పరిస్థితిలోనూ విడదీసేందుకు అంగీకరించేది లేదని రాయలసీమ ఐకాస పేర్కొంది. సీమ చరిత్ర తెలియకుండా, ప్రజల మనోభావాలను గుర్తించకుండా, నిర్దిష్ట ఆలోచన లేకుండా చేసిన ప్రకటన ద్వారానే నేడీ పరిస్థితి నెలకొందని సమితి నేతలు అన్నారు. బుధవారం బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఐకాస నేతలు మాట్లాడుతూ రాయల తెలంగాణ అనేది రాయల్సీమ ప్రజల ఉనికిని దెబ్బతీయటానికేనని తెలిపారు. ప్రత్యేక తెలంగాణకు రాయలసీమ ఐకాస వ్యతిరేకం కాదని, పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామన్నారు. […]పూర్తి వివరాలు ...
Tags :rayalaseema
వారు సీఎం కావాలనుకుంటే 20ఏళ్ళపాటో, అంతకుమించో సీఎంగా పెట్టుకోవచ్చు రాయలసీమ అభివృద్ధి చెందాలంటే ఇక్కడ పరిశ్రమలు పెట్టి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేసి, ప్రాజెక్టు లు అన్నీ పూర్తిచేయాలని మాజీ మంత్రి రాజగోపాల్ రెడ్డి కోరారు.రాష్ట్ర విభజనతో ఉడుకుతున్న సీమాంధ్రలో మంటలార్పే ప్రయత్నంతో కేంద్రం ప్రకటించిన కమిటీతో సీమాంధ్రకు అన్యా యం జరుగుతుందన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ కమిటీలో ఆంటోనికి నో రు లేదని, దిగ్విజయ్సింగ్ తెలిసినవాడు కాదన్నారు. శుక్రవారం కడపలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ […]పూర్తి వివరాలు ...
ఎట్టకేలకు తెలంగాణ గొడవకు తెరదించే పనికి కాంగ్రెస్ పూనుకుంది. ఇది ఆ ప్రాంత ప్రజా పోరాట ఫలం. వారికి ధన్యవాదాలు! కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో పేర్కొన్న సీమకు కృష్ణా నికరజలాల కేటాయింపు హామీ ఏమైంది? ఈ సందర్భంలో విడిపోయే రాష్ట్రంలో సీమ వాసులు కలిసుంటే మిగిలేది మట్టే. రాయలసీమ అస్తిత్వం కొనసాగాలన్న ఇక్కడ సాగు, తాగు నీరు కావాలన్న ప్రత్యేక రాయలసీమే శరణ్యం. దీనికోసం పాలకులు, ప్రజలు ఉవ్వెత్తున ఉద్యమించాల్సిన తరుణమిది. రాయలసీమ ఎలా వంచనకు గురైంది […]పూర్తి వివరాలు ...
సమైక్యాంధ్ర కోసం కడప జిల్లాలో రాజీనామాల పర్యవం మొదలైంది. సమైక్యాంధ్ర జేఏసిీ, విద్యార్థి జేఏసిీ నేతలు ఆదివారం నిర్వహించిన సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు రాజీనామా చేశారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే శ్రీకాంత్రెడ్డి, కోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, ఎమ్మెల్సీలు నారాయణరెడ్డి, బచ్చల పుల్లయ్యలు స్పీకర్ ఫార్మెట్లో వేదికపైనే రాజీనామాలు చేశారు. సీమాంధ్రలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎం పీలు సహా మంత్రులు తమ పదవులకు రాజీనామాలు చేసేలా విద్యార్థులు ప్రజలు ఒత్తిడి తేవాలని సమైక్యాంధ్ర జేఏసిీ నేతలు […]పూర్తి వివరాలు ...
పులివెందుల: రాజులు పోయారు. రాజ్యాలూ పోయాయి. కాని వారి నిర్మించిన కట్టడాలు మాత్రం మనకు సజీవ సాక్ష్యాలు గా కనిపిస్తాయి. అప్పట్లోనే కారడవుల్లో విశాలమైన కోటలు నిర్మించారు. కానీ వాటి గురించి నేడు పట్టించుకొన్ననాధుడే లేడు. కాల గర్భంలో ఒక్కొక్కటే కలసి పోతున్నాయి. ఈ పురాతన కట్టడాలు ఉన్న ప్రాంతాలను పర్యాట కేంద్రాలుగా అభివృద్ధి చేస్తే ప్రజలు కొంత వరకైనా వీటి పట్ల మక్కువ పెరిగే అవకాశం ఉంది. తద్వారా ప్రభుత్వానికి ఆదాయం. కట్టడాలూ బాగుపడతాయి…పూర్తి వివరాలు ...
తెలంగాణకు చెందిన ఆర్ విద్యా సాగర్ రావు కేంద్ర జలసంఘం చీఫ్ ఇంజనీర్ గా పని చేసి పదవీ విరమణ పొందారు. వారు మంచి మేధావి, వక్త కూడా. వివిధ పత్రికలకు వ్యాసాలు రాయడంలోనూ సిద్ధహస్తులు. వారు ఈ మధ్య సినిమాలలో నటిస్తున్నారు కూడా. తెరాసకు సలహాదారుగా కూడా వారు వ్యవహరిస్తున్నారు. రావు గారు ‘నమస్తే తెలంగాణా’ దిన పత్రికలో నీళ్ళు నిజాలు అని ఒక శీర్షిక నిర్వహిస్తున్నారు. ఈ శీర్షికలో వారు రాసిన వ్యాసాలలో సీమపై […]పూర్తి వివరాలు ...
రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి వైఎస్సార్ జిల్లాలోని అభివృద్ధి పథకాలను సొంత జిల్లాకు తరలించుకుపోతున్నారు. ఈ విషయమై కడప జిల్లా కాంగ్రెస్ నేతలు మౌనం వహిస్తుండడం విశేషం. తరతరాలుగా వెనుకబాటుకు గురైన జిల్లాకు మంజూరైన ప్రాజెక్టులను చిత్తూరుకు తీసుకెళ్ళే బదులు ముఖ్యమంత్రి అక్కడికి కొత్త ప్రాజెక్టులను తీసుకువస్తే బాగుండేది. ఈ చర్యల వల్ల అంతిమంగా రాయలసీమ నష్టపోతుందన్నది నిర్వివాదాంశం. ఇదే విషయమై సాక్షి దినపత్రిక ఇవాళ ఒక కధనాన్ని ప్రచురించింది.పూర్తి వివరాలు ...
శ్రీశైలం జలాశయం నీటిని రాయలసీమ ప్రాంతానికి తరలించాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎస్.గోవర్ధనరెడ్డి డిమాండ్ చేశారు. టీడీపీ జిల్లా కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇదివరకు కర్నూలు ముంపునకు గురయ్యేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులే కారణమని, దీంతో ప్రజలు భారీగా నష్టపోవాల్సి వచ్చిందని పేర్కొన్నారు.పూర్తి వివరాలు ...
రాయలసీమలో 1993-94 నుంచి 2004-05 మధ్య కాలంలో మూడు ప్రాంతాలను పోల్చి చూసినట్లయితే జీవనప్రమాణాలు బాగా దిగజారాయని,నిరాదరణకు గురయిన ప్రాంతం తెలంగాణా కాదనీ రాయలసీమేనని శ్రీ కృష్ణ కమిటీ తన నివేదికలో వెల్లడించింది. రాష్ట్ర అభివృద్ధి పై దివంగత ముఖ్యమంత్రి డా. వై.ఎస్.రాజశేఖర రెడ్డి అవలంభించిన దృక్ఫధాన్నే శ్రీ కృష్ణ కమిటీ కూడా ప్రతిబింబించడం గమనార్హం! గ్రామీణ ప్రాంతాల్లో ఆ దశాబ్దకాలంలో ఆదాయంలో మార్పులను గమనించినట్లయితే తెలంగాణలో సంపన్న వర్గాల్లోనే ఆదాయ వృద్ధి కనిపించింది.పూర్తి వివరాలు ...