పులివెందుల: చిరంజీవి పులివెందుల నియోజకవర్గంలో పర్యటిస్తున్నసందర్భంలో కాంగ్రెస్ అభ్యర్ధి డాక్టర్ డి.ఎల్.రవీంద్రరెడ్డి గురించి ప్రస్తావిస్తుండగా ప్రజలనుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తం అయింది.కొందరు కోడిగుడ్లు చెప్పులు విసిరారు. వై.ఎస్.కు డి.ఎల్ సన్నిహితుడని చెప్పబోతుండగా జనం దానికి నిరసనగా చేతులు ఊపుతూ కనిపించారు. దీంతో అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.పోలీసులు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ కు చెందినకార్యకర్తలు ఈ పని చేశారని భావించి వారిని అక్కడి నుంచి చెదరగొట్టారు. పులివెందుల రోడ్ షోలో జరిగిన ఈ ఘటన కారణంగా కొంత ఉద్రిక్తత […]పూర్తి వివరాలు ...
Tags :bypolls
కడప : ఉపఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి, విజయమ్మలకు మద్దతుగా ప్రచారం చేసేందుకు ఎంపీ సబ్బం హరి కడపకు రానున్నారు. ఇప్పటికే ఆయన జగన్కు మద్దతుగా ప్రచారానికి వెళ్లాల్సి ఉన్నా…ఎన్నికలు సమీపించేముందు వాతావరణాన్ని మరింత వేడెక్కించాలని ఆయన భావించారు. జగన్, విజయమ్మలకు ఫ్యాన్గుర్తు వచ్చిన శుభసందర్భంలో శుక్రవారం ఆయన కడపకు ప్రయాణం కానున్నారు.పూర్తి వివరాలు ...
హైదరాబాద్: కడప లోకసభ, పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ‘సీలింగ్ ఫ్యాన్’ను ఎన్నికల కమిషన్ కేటాయించింది. దాంతో జగన్, వైఎస్ విజయమ్మలకు కామన్ సింబల్ లభించింది. ఎన్నికల సంఘం ఉమ్మడి గుర్తు కేటాయించడం పట్ల వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.పూర్తి వివరాలు ...
పోరుమామిళ్ల: రాష్ట్రంలో రెండవ సారి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానకి దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కృషే కారణమంటే ఒప్పుకోనని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి కృషి ప్రభుత్వ ఏర్పాటులో ఎంతైనా ఉందని రాష్ట్ర మున్సిపల్ శాఖా మంత్రి మహిధర్ రెడ్డి అన్నారు. బుధవారం పోరుమామిళ్ల పట్టణంలోని మాజీ శాసన సభ్యుడు వి శివరామక్రిష్ణారావు స్వగృహంలో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో బద్వేలు తాలుకా ఎన్నికల ఇన్ఛార్జిగా రాలేదని నాయకుల మధ్య సమన్వయ కర్తగా మాత్రమేవచ్చానన్నారు. ప్రస్తుతం ఏ పార్టీకి […]పూర్తి వివరాలు ...
కడప : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి ఒక్కొక్క గండాన్ని అధిగమించి ముందుకు సాగుతున్నారు. కడప పార్లమెంట్ సీటుకు రాజీనామా చేసినప్పటి నుంచి అనేక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వాటన్నింటిని ఎదుర్కొంటూ జగన్ నామినేషన్ ఘట్టానికి చేరుకున్నారు. ఆయన నామినేషన్ల సందర్బంగా సమర్పించిన అఫిడవిట్లో తప్పులున్నాయంటూ ఆయన ప్రత్యర్థులు విస్తృతంగా ప్రచారం చేశారు. అనేక ఆస్తులను ఆయన చూపించలేదని అందువల్ల ఆయన్ని ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేకుండా అనర్హుణ్ని చేయాలని వారు డిమాండ్ చేశారు.పూర్తి వివరాలు ...
కడప : కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు వి.హన్మంతరావు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. మే 1, 2, 3 తేదీల్లో కడప లోక్సభ సెగ్మెంట్లో ఆయన ప్రచార కార్యక్రమం ఖరా రైంది. కడప ఉప ఎన్నికల ప్రచారానికి ఇప్పటికే ఎఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహరాల ఇన్చార్జీ గులాం నబీ ఆజాద్, ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి, మాజీ ముఖ్యమంత్రి కె.రోశయ్యల షెడ్యూల్ ఖరారైంది.పూర్తి వివరాలు ...
కడప : ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనే నిమిత్తం తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయడు ఈ నెల 25న కడప జిల్లాకు రానున్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో మొదటి విడత పర్యటన, అలాగే మే నెల 1 నుండి నాల్గో తేదీ వరకు రెండో విడత ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మొత్తం ఏడు నియోజకవర్గాలకు గాను ఏడు రోజుల పర్యటనకు ప్రణాళిక రూపొందించారు. కడప పర్యటనకు ఈ నెల 21నేపూర్తి వివరాలు ...
కడప: జిల్లాలో ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి గులాంనబీ ఆజాద్, మాజీ ముఖ్యమంత్రి రోశయ్య, పీసీసీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్, ఆ పార్టీ నాయకుడు చిరంజీవిల పర్యటన తేదీలు ఖరారయ్యాయి. ఈనెల 25న జమ్మలమడుగు, పులివెందులలో ముఖ్యమంత్రి ప్రచారం నిర్వహిస్తారు. 23న కడప, ప్రొద్దుటూరు… 24నపూర్తి వివరాలు ...
కడప : ఉప ఎన్నికలో యువనేత వై.ఎస్.జగన్మోహనరెడ్డి గెలుపు ఆపలేమంటూ ఇంటెలిజెన్స్ యంత్రాంగం ప్రభుత్వానికి తేల్చిచెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. ఇంటెలిజెన్స్ ఎస్పీ వెంకట్రామిరెడ్డి, డీఐజీ బాలసుబ్రహ్మణ్యం జిల్లా కేంద్రంలో నాలుగు రోజులుగా తిష్టవేసి ఉన్నారు. కడప పార్లమెంట్ పరిధిలో వివిధ రకాలుగా సర్వేలు నిర్వహించి అధికార పార్టీ గెలుపు అసాధ్యమని ప్రభుత్వానికి స్పష్టంచేసినట్లుపూర్తి వివరాలు ...