పులివెందుల రంగనాథుని పైన అన్నమయ్య రాసిన సంకీర్తన పులివెందులలోని రంగనాయక స్వామి ఆలయాన్ని రామానుజాచార్యులు ప్రతిష్ఠించారు. రైల్వే కొండాపురం వద్ద గల ముచ్చుమర్రి అనే గ్రామంలోని పెద్ద రంగడు, చిన్న రంగడు అనే రజక సోదరుల స్వప్నంలో స్వామి సాక్షాత్కరించి ఏటిలో ఉన్న నన్ను పులివెందులలో ప్రతిష్ఠించవలసిందిగా అజ్ఞాపించారట. రాగము: మలహరి రేకు: 0603-4 సంపుటము: 14-15 ॥పల్లవి॥ ఇంకనేల వెరపు యెదుటనే వున్నారము వంకలొత్తకిఁక మఱి వద్దు వద్దు ఇపుడు ॥చ1॥ వావులు నీకెంచనేల వాడల […]పూర్తి వివరాలు ...
Tags :annamayya sankeertanalu
రాగము: దేసాళం రేకు: 1650-5 సంపుటము: 26-298 ॥పల్లవి॥ రట్టడి కడపరాయఁ డిట్టె వీఁడు గట్టిగా నేఁడిపుడు తగవు దేర్చరే ॥చ1॥ చెలము సాదించరాదు సముకానఁ గొంచరాదు పలుమారు మాటలాడి పదరీ వీఁడు మొలకచన్నులు నావి మొనలెత్తీఁదనమీఁద చెలులార మాకు బుద్దిచెప్పఁగదరే ॥చ2॥ పందెములడువరాదు పంతము విడువరాదు కందువలు చూపి పొత్తుగలసీ వీఁడు అందపు నాచూపు లివి అంటుకొనీఁ దనమీద చందపు మావలపులు చక్కఁబెట్టరే ॥చ3॥ తమక మాఁపఁగరాదు తాలిమి చూపఁగరాదు అమర గూడె శ్రీవెకటప్పఁడు వీఁడు […]పూర్తి వివరాలు ...
అన్నమయ్య సంకీర్తనలలో ఒంటిమిట్ట కోదండరాముడు ఒంటిమిట్టలోని కోదండరాముడ్ని దర్శించి తరించిన పదకవితా పితామహుడు ఆయన సాహస గాధల్ని (అలౌకిక మహిమల్ని)ఇట్లా కీర్తిస్తున్నాడు … వర్గం: ఆధ్యాత్మ సంకీర్తన రాగము: నాట రేకు: 0096-01 సంపుటము: 1-477 ఇందులోనే కానవద్దా యితఁడు దైవమని విందువలె నొంటిమెట్ట వీరరఘురాముని యెందు చొచ్చె బ్రహ్మవర మిల రావణుతలలు కందువ రాఘవుఁడు ఖండించునాఁడు ముందట జలధి యేమూల చొచ్చెఁ గొండలచే గొందింబడఁ గట్టివేసి కోపగించేనాడు ||ఇందులోనే|| యేడనుండె మహిమలు యిందరి కితఁడు వచ్చి వేడుకతో […]పూర్తి వివరాలు ...
తాళ్ళపాక అన్నమయ్య, అక్క(ల)మ్మల (అక్కమాంబ) సంతానమైన పెదతిరుమలయ్య వాళ్ళ నాయన మాదిరిగానే శ్రీ వేంకటేశ్వరుని సేవలో తరించినాడు. తిమ్మయ్య, తిమ్మార్య, తిరుమలాచార్య, తిమ్మడు, తిరుమలగురుడుగా పేర్కొనబడిన పెదతిరుమలయ్య కూడా దేవుని కడప లక్ష్మీ వల్లభుని దర్శించుకుని తరించినాడు. తన సంకీర్తనలతో కడపరాయని కీర్తించి గానం చేసినాడు. కడపరాయని కీర్తించిన పెదతిరుమలయ్య సంకీర్తనలలో ఇది కూడా ఒకటి. వర్గం: శృంగార సంకీర్తన రాగము: రామక్రియ రేకు: 74-6 సంపుటము: 17-386 ఏమి నీ కింత బలువు యెవ్వ రిచ్చిరి […]పూర్తి వివరాలు ...
మాచనూరు చెన్నకేశవుని సంకీర్తనలు – 1 పదకవితా పితామహుడు దర్శించిన క్షేత్రాలు అనేకం కడప జిల్లాలో ఉన్నాయి. ఆయా వైష్ణవ క్షేత్రాలను దర్శించిన అన్నమయ్య అక్కడి క్షేత్రపాలకులను కీర్తిస్తూ సంకీర్తనా గానం చేసినాడు. అటువంటి క్షేత్రాలలో మాచనూరు చెన్నకేశవాలయం ఒకటి. మాచనూరు కడప జిల్లా పెండ్లిమర్రి మండలంలోని ఒక గ్రామం. ఈ ఊరికి మాచనవోలు (మాచన అనే ఆయన కట్టించడం వలన ఈ ఊరు మాచనవోలు అయింది. ఆధారం: మెకంజీ కైఫీయత్తులు-1225-10) అనే పేరు కూడా కలదు. […]పూర్తి వివరాలు ...
వర్గం : శృంగార సంకీర్తనలు ॥పల్లవి॥ సొంపుల నీ వదనపు సోమశిల కనుమ యింపులెల్లఁ జేకొనఁగ నిల్లు నీపతికి ॥చ1॥ కలికి నీ పిఱుఁదనే గద్దెరాతి కనుమ మొలనూళ్ళలతలనే ముంచుకొన్నది కలయఁ బోకముడినే కట్లువడ్డది అలరువిలుతుదాడికడ్డము నీ పతికి ||సొంపుల|| ॥చ2॥ ఇదివొ నీ కెమ్మోవి యెఱ్ఱశిల కనుమ కదిసి లేఁజిగురులఁ గప్పుకొన్నది వదలకింతకుఁ దలవాకిలైనది మదనుని బారికి మాఁటువో నీ పతికి ||సొంపుల|| ॥చ3॥ కాంత నీ చిత్తమే దొంగలసాని కనుమ యింతటి వేంకటపతికిరవైనది పంతపు […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు చెన్నకేశవుని స్తుతించిన అన్నమాచార్య సంకీర్తన ప్రొద్దుటూరు లేదా పొద్దుటూరు, వైఎస్ఆర్ జిల్లాలోని ఒక ప్రముఖ పట్టణము. రెండవ బొంబాయిగా ప్రసిద్ది చెందినది. పెన్నా నదికి ఉత్తర ఒడ్డున ఉన్న ప్రొద్దుటూరు వ్యాపారాలకు నిలయంగా ఉంది. ఇక్కడి పాత మార్కెట్ దగ్గర ఉన్న పురాతన మహాలక్ష్మీ సమేత చెన్నకేశవ స్వామి ఆలయాన్ని పదకవితా పితామహుడు సందర్శించినట్లు చారిత్రిక ఆధారాలను బట్టి తెలుస్తోంది. పొద్దుటూరు చెండ్రాయుని (చెన్నకేశవుని) యెడల తన మధుర భక్తిని శృంగార సంకీర్తనా రూపంలో అన్నమాచార్యుడు […]పూర్తి వివరాలు ...
తాళ్ళపాక అన్నమయ్య, అక్క(ల)మ్మల (అక్కమాంబ) సంతానమైన పెదతిరుమలయ్య వాళ్ళ నాయన మాదిరిగానే శ్రీ వేంకటేశ్వరుని సేవలో తరించినాడు. తిమ్మయ్య, తిమ్మార్య, తిరుమలాచార్య, తిమ్మడు, తిరుమలగురుడుగా పేర్కొనబడిన పెదతిరుమలయ్య కూడా దేవుని కడప లక్ష్మీ వల్లభుని దర్శించుకుని తరించినాడు. తన సంకీర్తనలతో కడపరాయని కీర్తించి గానం చేసినాడు. కడపరాయని కీర్తించిన పెదతిరుమలయ్య సంకీర్తనలలో ఇది ( కాంతగలనాడు …) కూడా ఒకటి. వర్గం: శృంగార సంకీర్తన రాగము: రామక్రియ రేకు: 49-7 సంపుటము: 17-296 కాంతగలనాడుఁ యేకాంతములమాట, శ్రీ […]పూర్తి వివరాలు ...
పదకవితా పితామహుడి ‘కడపరాయడు’ జగదేక సుందరుడు, అందగాడు. కడపరాయని సుద్దులను, వలపులను తలచుకొని ఆ సతి ఇట్లా పరవశిస్తోంది… వర్గం: శృంగార సంకీర్తన రాగము: దేసాళం రేకు: 512 సంపుటము: 13-68 కంటిమి నీ సుద్దులెల్ల గడపరాయ యింటింట దారణలెక్కె నేమి చెప్పేదయ్యా ॥పల్లవి॥ కొమ్మల చేత నెల్లాను కొలువు సేయించుకొంటా కమ్మి వలపు కొటారుగాఁ బెట్టేవు అమ్మరో పోఁకకుఁ బుట్టెడాయను సిగ్గులు నేడు యెమ్మెల సతుల భాగ్యాలేమి చెప్పేదయ్యా ॥కంటిమి॥ జలజ లోచనలతో సరసములాడుకొంటా మొలకనవ్వులను […]పూర్తి వివరాలు ...