రాష్ట్ర విభజనానంతరం 1953నాటి ప్రాంతాలే ఆంధ్ర ప్రదేశ్ లో మిగలడం వల్ల, స్థూలంగా రాయలసీమలో అప్పటి వెనుకబాటుతనం, సీమవాసుల్లో కోస్తాంధ్ర ప్రాబల్యం గురించిన అభిప్రాయాలు ఇప్పటికీ అలాగే ఉండడం వల్ల అప్పటి శ్రీభాగ్ ఒప్పందాన్ని అనుసరించి రాయలసీమలో హైకోర్టు ఏర్పాటు చేయటం ఇప్పుడు అనివార్యతగా మారింది. ఐతే ప్రభుత్వం రాష్ట్ర రాజధానిగా ప్రకటించిన అమరావతి ప్రాంతంలోనే జస్టిస్ సిటీ పేరుతో హైకోర్టు ఏర్పాటుచెయ్యబూనడంతో హైకోర్టు రాయలసీమలో ఏర్పాటు చెయ్యాలనే డిమాండుతో దీక్షలు, ఆందోళనలు జరుగుతున్నాయి…. పైకి ఉద్యమకారులు […]పూర్తి వివరాలు ...
Tags :హైకోర్టు
రాయలసీమ ప్రజలకు తీరని అన్యాయం చేస్తున్న బాబు కరెంటు కోసం సీమ ప్రాజెక్టులను గాలికొదిలేస్తారా? హైకోర్టును వేరే చోట ఏర్పాటు చెయ్యాలి 13 జిల్లాలను ఒకే విధంగా అభివృద్ధి చేయాల కడప: రాయలసీమకు జరుగుతున్న అన్యాయలపైన, రాయలసీమ విషయంలో, అభివృద్ది వికేంద్రీకరణ విషయంలో ప్రభుత్వ వివక్షను ప్రశ్నిస్తూ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి మొదటిసారి బహిరంగంగా గొంతెత్తారు. మంగళవారంనాడు పులివెందుల నియోజకవర్గ పరిధిలోని సింహాద్రిపురం మండలంలో పైడిపాలెం ప్రాజెక్టును ఆయన పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాజధాని చుట్టూ […]పూర్తి వివరాలు ...
(హైదరాబాదు నుండి మా విశేష ప్రతినిధి అందించిన కథనం) రాయలసీమ విషయంలో ఆది నుండి తప్పుడు ప్రచారాలు, అడ్డగోలు నిర్ణయాలతో వ్యవహరిస్తున్న తెదేపా ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లఘించి విడుదల చేసిన చీకటి జీవో 120ని నిరసిస్తూ ఈ రోజు (బుధవారం) హైకోర్టులో న్యాయవాదులు నిరసన తెలియచేశారు. రాయలసీమ జిల్లాలకు చెందిన న్యాయవాదులు ఈ ఉదయం హైకోర్టులోని నాలుగో గేటు వద్ద జీవో 120 ప్రతులను చించి నిరసన తెలియచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… సీమ విద్యార్థినుల […]పూర్తి వివరాలు ...
హైదరాబాదు: అన్ని విధాలుగా వెనుకబడిన రాయలసీమలో రాజధాని లేదా హైకోర్టు ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణ్రెడ్డి డిమాండ్ చేశారు. రాయలసీమను నిర్లక్ష్యం చేస్తున్నారనే భావన ప్రజల్లో కూడా ఉందని ఆయన అన్నారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జన చైతన్య వేదిక ఆధ్వర్యంలో ‘ గ్రేటర్ రాయలసీమలో హైకోర్టు’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ… రాయలసీమ వెనుకబాటుతనం గురించి ఎవ్వరూ […]పూర్తి వివరాలు ...
కడప: హైకోర్టును కడపలో ఏర్పాటు చేయాలని న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు నాగరాజు శాసనమండలి ఉప సభాపతి సతీష్రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కడపలో హైకోర్టు ఏర్పాటుకు నూతన కలెక్టరేట్ భవన సముదాయం సిద్ధంగా ఉందన్నారు. అదేవిధంగా విమానాశ్రయం, రైల్వే స్టేషన్ వసతులు ఉన్నాయన్నారు. హైకోర్టును కడపలో ఏర్పాటు చేస్తే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు అన్ని జిల్లాల కక్షిదారులకు కడప కేంద్రంగా ఉంటుందన్నారు. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చే హెల్త్కార్డులు న్యాయవాదులకు మంజూరు […]పూర్తి వివరాలు ...