ప్రొద్దుటూరు: లెజెండ్ సినిమా చేయడం తన పూర్వ జన్మ సుకృతమని హిందూపురం శాసనసభ్యుడు, కథా నాయకుడు నందమూరి బాలకృష్ణ అన్నారు. చలనచిత్ర సీమలో లెజెండ్ సినిమా ఒక లెజెండ్గా మిగిలిపోతుందన్నారు. లెజెండ్ చలనచిత్రం 275 రోజులు ప్రొద్దుటూరులోని అర్చనా థియేటర్లో ప్రదర్శింపబడిన నేపధ్యంలో విజయోత్సవ సభను ఆదివారం స్థానిక రాయల్ కౌంటీ రిసార్ట్స్లో నిర్వహించారు. ఈ సందర్భంగా చిత్రం యూనిట్తో కలిసి వచ్చిన బాలకృష్ణ మాట్లాడుతూ నిర్మాతలు ఎక్కడా రాజీ పడకుండా చిత్రానికి అన్ని సదుపాయాలు కల్పించారన్నారు. […]పూర్తి వివరాలు ...
Tags :ప్రొద్దుటూరు
కడప: లెజెండ్ చిత్ర విజయోత్సవ వేడుకలలో పాల్గొనేందుకు నందమూరి బాలకృష్ణ ఆదివారం (28న) ప్రొద్దుటూరుకు రానున్నారు. ఈ మేరకు గురువారం స్థానిక తెదేపా జిల్లా కార్యాలయంలో తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు పి.కృష్ణమూర్తి, ఎస్.గోవర్ధన్రెడ్డి విలేకరులతో మాట్లాడారు. లెజెండ్ చిత్ర విజయోత్సవ వేడుకలకు వేడుకలకు నందమూరి బాలకృష్ణ అభిమానులు, తెదేపా నాయకులు, కార్యకర్తలు హాజరై జయప్రదం చేయాలని వారు కోరారు.పూర్తి వివరాలు ...
కడప: జిల్లాలో 48 మండలాలను కరవు ప్రభావిత మండలాలుగా గుర్తిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ నిబంధనల మేరకు సగటు వర్షపాతం లేని మండలాలను కరవు పీడిత ప్రాంతాలుగా గుర్తిస్తూ రాష్ట్ర రెవిన్యూ విభాగం ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేసింది. జిల్లాలో కరవు పీడిత మండలాలుగా గుర్తించినవి ఇవీ…. రామాపురం, చక్రాయపేట, సింహాద్రిపురం, పెనగలూరు, గాలివీడు, వీరబల్లి, జమ్మలమడుగు, కడప, తొండూరు, పుల్లంపేట, లక్కిరెడ్డిపల్లె, అట్లూరు, వేంపల్లె, బద్వేలు, గోపవరం, చిన్నమండెం, రాయచోటి, పులివెందుల, […]పూర్తి వివరాలు ...
ఆనందనామ సంవత్సరం చైత్ర శుధ్ధ విదియ అంటే మార్చి 28,1914 న పుట్టిన కీ.శే పుట్టపర్తి నారాయణాచార్యుల వారికిది శతజయంతి సంవత్సరం… ఆ మహానుభావుడి సాహిత్య కృషీ.., శివతాండవ సృష్టీ.. మన సిరిపురి పొద్దుటూరులోనే జరిగింది. భారత ప్రభుత్వం నుండి అత్యున్నత పద్మ పురస్కారాలనూ, శ్రీ వెంకటేశ్వర, శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయాల నుండి డాక్టరేట్లను పుట్టపర్తి వారు అందుకున్నారు. పుట్టపర్తితో జానమద్ది హనుమచ్ఛాస్త్రి జరిపిన సంభాషణ పూర్తి పాఠమిది… ఈ ఇంటర్వ్యూ చేసిన సంవత్సరం అందుబాటులో లేదు. […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డి జైలుకు వెళుతున్నారని, ఇందులో భాగంగా పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ప్రొద్దుటూరులో పోటీ చేస్తారని, ఇందుకుగాను రూ.36కోట్లకు ఒప్పందం కుదిరిందని, టీ దుకాణాల వద్ద తెదేపా నేతలు ప్రచారం చేయిస్తున్నారన్నారని వైకపా శాసనసభ్యుడు రాచమల్లు శివప్రసాదరెడ్డి వాపోయారు. ఇందుకు కొనసాగింపుగానే ఎంపిక చేసిన పత్రికల్లో కథనాలు వస్తున్నాయన్నారు. ఇదే మాదిరిగా జమ్మలమడుగు, రాయచోటి నియోజకవర్గాలలో ప్రచారం చేయిస్తున్నారన్నారు. ఇందులో ఎంత మాత్రం వాస్తవం లేదన్నారు. అలాగే తనతోపాటు మరికొందరు ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళుతున్నట్లు […]పూర్తి వివరాలు ...
18 మండలాల్లో అతి తక్కువ వర్షపాతం జిల్లా వ్యాప్తంగా సకాలంలో వర్షం రాక పోవడం, వచ్చినా పదును కాకపోవడంతో సేద్యాలు చేసుకోలేక రైతులు వాన కోసం ఆకాశం వైపు ఎదురు చూస్తున్నారు. ఖరీఫ్ పంటకు అను వైన జూన్, జులై నెలల్లో జిల్లాలో సాధారణం కంటే అతి తక్కువ వర్షపాతం నమోదైంది. నాలుగు నెలల్లో 393.5 మిల్లి మీటర్ల వర్షపాతం జి ల్లాలో నమోదు కావాల్సి ఉండగా 180.6 మిల్లి మీటర్లు మాత్రమే నమోదైంది. వాస్తవికంగా 54 […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: శ్రీబాగ్ ఒడంబడిక మేరకు రాయలసీమలో రాజధానిని ఏర్పాటు చేసేంతవరకు ఉద్యమానికి సన్నద్ధం కావాలని పలువురు నేతలు పిలుపునిచ్చారు. రాయలసీమ యునెటైడ్ ఫ్రంట్ ఆధ్వర్యంలో స్థానిక పద్మశాలీయ కల్యాణ మండపంలో ఆదివారం సాయంత్రం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి మాట్లాడుతూ ఇప్పటికే రాయలసీమ వాసులం ఎంతో నష్టపోయామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని ఏర్పాటు కోసం వెంటనే కార్యాచరణ చేపట్టాలన్నారు. దీనికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానన్నారు. తాను రాజధాని సాధనకోసం ఎంత వరకైనా […]పూర్తి వివరాలు ...
వాళ్లంతా బడికి పోయే పిల్లోళ్ళు … కాలేజీకి పోయే యువతరం… అందరూ ఒక్కటై, ఒకే గొంతుకై వినిపించినారు రాయలసీమ ఉద్యమ నినాదం. ఆ నినాదం వెనుక దగాపడిన బాధ, పైకి లేవాలన్న తపన… అందుకు పోరు బాట పట్టేందుకు సిద్ధమన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పోరుగిత్తలు ఇచ్చిన ఈ పిలుపు మహోద్యమమై సీమ పాలిటి సైంధవులకు శరాఘాతమయ్యే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. (ప్రొద్దుటూరు నుండి వనం దత్తప్రసాద్ శర్మ అందించిన ప్రత్యేక కథనం) రాయలసీమకు రాజధానిని రేపటి […]పూర్తి వివరాలు ...
ప్రొద్దుటూరు: రాయలసీమ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఈరోజు (బుధవారం) విద్యార్థులు స్థానిక పుట్టపర్తి సర్కిల్ లో ముఖ్యమత్రి దిష్టిబొమ్మను కాల్చినారు. రాయలసీమ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో పుట్టపర్తి సర్కిల్ వద్దకు చేరుకున్న విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేఖంగా నినాదాలు చేశారు. రాజధానితో సహా శ్రీభాగ్ ఒప్పందాన్ని అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాయలసీమ విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు భాస్కర్ మాట్లాడుతూ… విజయవాడను తాత్కాలిక రాజధానిగా చెయ్యటం అన్నది ముఖ్యమంత్రి కుట్రలో భాగమన్నారు. హైదరాబాదు […]పూర్తి వివరాలు ...