Tags :పులివెందుల

    రాజకీయాలు

    పులివెందులలో జగన్ కు 75 వేల మెజార్టీ

    పులివెందుల నియోజకవర్గం నుండి వైకాపా తరపున అభ్యర్థిగా పోటీ చేసిన ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సుమారు 75 వేల పైచిలుకు మెజారిటీ సాధించారు. ఇక్కడ తెదేపా నుండి ఎస్వీ సతీష్ రెడ్డి బరిలో ఉన్నారు. మూడు దశాబ్దాలకుపైగా పులివెందుల నియోజకవర్గం నుంచి వైఎస్ కుటుంబీకులే తిరుగులేని మెజార్టీతో విజయం సాధిస్తున్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి తొలిసారిగా 1978లో పులివెందుల నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఆ తర్వాత వైఎస్ కుటుంబానికి ఇక్కడ తిరుగేలేదు. […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    పులివెందుల శాసనసభ స్థానానికి నామినేషన్లు వేసిన అభ్యర్థులు

    పులివెందుల శాసనసభ స్థానం నుండి పోటీ చేయటానికి మొత్తం 15 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. తెదేపా తరపున ఇద్దరు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ముగ్గురుఅభ్యర్థులు స్వతంత్రులుగా పోటీ చేయడానికి నామినేషన్లు సమర్పించారు.  నామినేషన్ల ఉపసంరణకు గడువు బుదవారం (23 వ తేదీ) ముగియనుంది. తుదిపోరులో నిలబడే అభ్యర్థుల జాబితా ఉపసంహరణ పూర్తైన తరువాత తేలనుంది. 1 రాజగోపాల్‌రెడ్డి, కొండ్రెడ్డి – కాంగ్రెస్ 2 జగన్‌మోహన్‌రెడ్డి, యెడుగూరి సందింటి – వైకాపా 3 వెంకట సతీష్‌కుమార్‌రెడ్డి,  సింగారెడ్డి – తెదేపా […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    పులివెందుల నుంచి వైఎస్ జగన్ పోటీ

    వైకాపా అధ్యక్షుడు వైఎస్ జగన్‌ గురువారం పులివెందుల శాసనసభ నియోజకవర్గం అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. అశేష జనవాహిన నడుమ తహశీల్దార్ కార్యాలయానికి చేరుకున్న ఆయన ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. నామినేషన్ కార్యక్రమంలో వైఎస్ జగన్తో పాటు ఆయన బాబాయి వైఎస్ వివేకానందరెడ్డి, ఈసీ గంగిరెడ్డి ఉన్నారు. కాగా వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డి తొలిసారిగా పులివెందుల నుంచి వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 2009 ఎన్నికలలో కడప […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    ఈ రోజే మున్సి’పోల్స్’

    కడప జిల్లాలో నేడు నగర పాలకం, పురపాలకంలో ఎన్నికల జరగనున్నాయి. కడప నగర పాలకంలో 50 డివిజన్లలో 311 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున 47 మంది, వైకాపా తరపున 50 మంది, సిపియం తరపున 12 మంది, బిజెపి తరపున 7మంది, సిపిఐ తరపున ఇరువురు, కాంగ్రెస్ తరపున 8 మంది, ఎంఐఎం, బిఎస్‌పి, లోక్‌సత్తా, స్వతంత్ర అభ్యర్థులను కలుపుకొని 185 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కడప నగర పాలకంలో […]పూర్తి వివరాలు ...

    Uncategorized

    కడప జిల్లాలో 20.75 లక్షల ఓటర్లు

    జిల్లాలో 20.75 లక్షల ఓటర్లున్నారు.త్వరలో జిల్లా వ్యాప్తంగా పురపాలక ఎన్నికలతో పాటు సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. 30 శాతంగా  ఉన్న యువతరం ఓట్లు మన నేతల భవితవ్యాన్ని తేల్చనున్నాయి. తొలుత కడప కార్పొరేషన్ , పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, మైదుకూరు, రాయచోటి, బద్వేలు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. కడప పార్లమెంట్ పరిధిలో కడప కార్పొరేషన్‌తోపాటు పులివెందుల, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, మైదుకూరు, ప్రొద్దుటూరు , బద్వేలు మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి.. ఇక అసెంబ్లీల వారీగా వస్తే బద్వేలు […]పూర్తి వివరాలు ...

    పల్లెలు

    పులివెందుల మండలంలోని గ్రామాలు

    పులివెందుల మండలంలోని పల్లెల వివరాలు – గణాంకాలు మరియు చాయాచిత్రాల (ఫోటోల) సహితంగా. ఒక్కో గ్రామానికి సంబందించిన చరిత్ర, సంస్కృతి, వ్యక్తులు మరియు దర్శనీయ స్థలాల వివరాలు. ఆయా గ్రామాల పేర్ల పైన క్లిక్ చెయ్యడం ద్వారా సదరు గ్రామ వివరాలు చూడవచ్చు. [feed url=”http://www.www.kadapa.info/villages/category/pulivendula/పూర్తి వివరాలు ...

    ఆచార వ్యవహారాలు వార్తలు

    ఈ రోజు నుంచి అనంతపురం (లక్కిరెడ్డిపల్లె) గంగమ్మ జాతర

    అనంతపురం (లక్కిరెడ్డిపల్లె) గంగమ్మ ఆలయం రాయలసీమలోనే ప్రసిద్ధి – శనివారం నుంచి అమ్మవారి జాతర ప్రారంభం కానుంది. రాయలసీమ ప్రాంతం నుంచి లక్షలాది మంది భక్తులు అమ్మవారిని దర్శనార్థం రానున్నారు. మూడు రోజులు జరిగే ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. తిరుణాల్ల నేపధ్యం … అనంతపురం గ్రామానికి చెందిన తిమ్మిరెడ్డి ఉత్తారెడ్డి పొలం గట్టుకు కావాల్సిన కంప కొట్టి తొడుగేశారు. తీసుకెళ్లేందుకు కాడెద్దులతో కదిలించగా కదలలేదు. ఆ రాత్రి అమ్మవారు స్వప్నంలోకి వచ్చి […]పూర్తి వివరాలు ...

    కళాకారులు వార్తలు

    అభినవ చాకలి తిప్పడు ఇక లేరు

    చక్రాయపేట : రంగస్థల నాటక రంగంలో విభిన్న పాత్ర పోషించి, అభినవ చాకలి తిప్పడుగా పేరు తెచ్చుకున్న కళాకారుడు వెంకటకృష్ణయ్య ఇకలేరు. రంగస్థలంపై అనేక ప్రదర్శనలు ఇచ్చిన నటుడు వెంకటకృష్ణయ్య మృతి నాటక రంగానికి తీరని లోటని పలువురు కళాకారులు పేర్కొన్నారు. నాగులగుట్టపల్లెలో నివాసముంటున్న నటుడు వెంకటకృష్ణయ్య బుధవారం కన్నుమూశాడు. పౌరాణిక, సాంఘిక ఘట్టాలలో పలు వైవిధ్యభరతమైన పాత్రలు పోషించిన వెంకటకృష్ణయ్య స్వగ్రామం లక్కిరెడ్డిపల్లె. 1953లో కృష్ణయ్య విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఉద్యోగ రీత్యా 1975దశకంలో రికార్డు […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    పులివెందుల శాసనసభ, కడప లోక్ సభ స్థానాలు ఖాళీ

    కడప: రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న విధానానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి కడప లోక్సభ సభ్యత్వానికి, ఆ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ పులివెందుల శాసనసభ్యత్వానికి రాజీనామా చేశారు. వారు ఇద్దరూ స్పీకర్ ఫార్మాట్లో రాజీనామాలు చేసినట్లు ఆ పార్టీ ఎంపి మేకపాటి రాజమోహన రెడ్డి చెప్పారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ జగన్మోహన రెడ్డి రాజీనామా లేఖను లోక్సభ స్పీకర్కు ఫాక్స్ ద్వారా పంపినట్లు […]పూర్తి వివరాలు ...