Tags :చంద్రబాబు

    రాజకీయాలు

    ‘సతీష్‌రెడ్డి తన పదవికి రాజీనామా చేయాల’

    జిల్లాపై వివక్ష కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి కడప : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జిల్లాపై వివక్ష కొనసాగిస్తున్నాడని , ఉర్దూ విశ్వవిద్యాలయాన్ని ఇతర జిల్లాకు తరలించడమే ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు నజీర్అహ్మద్ ఆరోపించారు. స్థానిక ఇందిరాభవన్‌లో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కడప జిల్లాలో ఉర్దూ యూనివర్సిటీ, ఒంటిమిట్ట ఉత్సవాలు, పెద్దదర్గా అభివృద్ధి, ఫుడ్‌పార్క్ మొదలైన వాటిపై శాసనసభలో ప్రకటన చేశారని.. ఇప్పుడు కర్నూలు జిల్లాలో ఉర్దూ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారని విమర్శించారు. ఉర్దూ […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు రాయలసీమ

    రాజధానికి నీటిని తరిలించేందుకే ‘పట్టిసీమ’ : బివిరాఘవులు

    సీమ కోసం పోరాడేందుకు అఖిలపక్షం, ప్రజా సంఘాలు కలసి రావాలి జాతీయ జెండా సాక్షిగా చంద్రబాబు విఫలం కర్నూలు: రాయలసీమ అభివృద్ధికి సిపిఎం ఆధ్వర్యంలో పోరాటం సాగిస్తామని ఆ పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు చెప్పారు. బుధవారం కర్నూలులోని సి.క్యాంప్ సెంటర్‌లోని లలిత కళాసమితిలో ‘రాయలసీమ అభివృద్ధి- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ రాష్ట్ర విభజనతో రాయలసీమకు తీరని అన్యాయం జరిగిందన్నారు. కొత్త రాష్ట్రంలో తొలి […]పూర్తి వివరాలు ...

    ప్రత్యేక వార్తలు

    సంప్రదాయం ప్రకారమే కోదండరాముని పెళ్లి

    ఒంటిమిట్ట : కోదండరాముని పెళ్లి ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తామని దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేఎస్‌వీ ప్రసాద్ తెలిపారు. స్థానిక కోదండ రామాలయాన్ని బుధవారం ఆయన పరిశీలించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. ఒంటిమిట్ట కోదండ రామాలయ సంప్రదాయాల ప్రకారం అన్ని కార్యక్రమాలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఆలయంలో కల్యాణం ఎప్పటిలాగానే రాత్రి సమయంలో నిర్వహిస్తామన్నారు. ఒంటిమిట్ట కోదండ రామాలయం, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుపతి, తిరుమలను ఒక సర్క్యూట్‌గా ఏర్పాటు చేసి పర్యాటక రంగాన్ని అభివృద్ధి పరుస్తామన్నారు. […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    మా జిల్లా పేరును పలికేదానికీ సిద్ధపడరా?

    హైదరాబాద్: గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ ఉభయ సభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో కనీసం వైఎస్సార్ జిల్లా పేరును ఉచ్చరించడానికి సైతం సిద్ధపడక పోవడం  చంద్రబాబునాయుడు ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనమని రాయచోటి శాసనసభ్యుడు గడికోట శ్రీకాంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం గవర్నర్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన సహచర ఎమ్మెల్యేలు తిరువీధి జయరాములు, షేక్ బేపారి అంజాద్‌బాషాతో కలిసి మాట్లాడుతూ ‘రాయలసీమలో కరువు ఉందంటూనే చిత్తూరు, అనంతపురం జిల్లాలో 1200 అడుగుల లోతుకు […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు రాయలసీమ

    సీమ జలసాధన కోసం మరో ఉద్యమం: మైసూరారెడ్డి

    రాయలసీమ అభివృద్ధికి బాబు చేసిందేమీ లేదు కడప: రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే.. వెంటనే గాలేరు-నగరి సుజల స్రవంతి పథకానికి అవసరమైన నిధులు కేటాయించాలని లేకపోతే రాయలసీమకు జలసాధన కోసం మరో ఉద్యమం చేస్తామని మాజీ మంత్రి, వైకాపా సీనియర్ నేత ఎంవీ మైసూరారెడ్డి హెచ్చరించారు. సోమవారం వీరపునాయునిపల్లె ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు వద్ద కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథరెడ్డి చేస్తున్న నిరవధిక నిరాహారదీక్ష శిబిరానికి వచ్చిన మైసూరారెడ్డి ఆయనకు సంఘీభావం తెలిపారు. నిధులు కేటాయించాల ఈ […]పూర్తి వివరాలు ...

    వార్తలు

    ‘డబ్బులిచ్చి చిత్తశుద్ధి నిరూపించుకోవాల’

    కడప: జిల్లాలో పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులు పూర్తీ చేసేదానికి అవసరమైన డబ్బులు కేటాయించి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలని అఖిలపక్షం నేతలు అన్నారు. శనివారం అఖిలపక్షం నేతలు కలెక్టరేట్ ఆవరణలో నీటిపారుదల శాఖ సీఈ వరదరాజుకు వినతి పత్రం అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో నిలిచిపోయినన సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు వచ్చే బడ్జెట్‌లో రూ.1800 కోట్లు నిధులు కేటాయించాలన్నారు. గండికోట జలాశయానికి నీరు తీసుకొచ్చేందుకు సంబంధిత పనులు పూర్తి చేయాలని, […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    35 టీఎంసీల నీరు తీసుకవస్తా : బాబు

    కడప: గోదావరి, కృష్ణా పరిధిలో ఆదా చేసిన 70 టిఎంసీల నీటిని రాయలసీమకు మళ్లిస్తా.. రాబోవు జూలైలో కాలువ గట్టుపై నిద్రించైనా గండికోటలో నీరు నిల్వ చేస్తా.. గండికోట, మైలవరం ప్రాజెక్టులకు 35 టీఎంసీల నీరు తీసుకవస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. శుక్రవారం ఆయన గండికోట ప్రాజెక్టు సందర్శించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ పులివెందుల రైతుల అభ్యర్థన మేరకు చీనీ తోటలకు నీరు ఇచ్చాం.. గండికోట ముంపు బాధితులకు న్యాయం చేస్తాం.. ప్రభుత్వ […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    అఖిలపక్షాన్ని అడ్డుకున్న పోలీసులు

    కడప: ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్ళిన అఖిల పక్షాన్ని శుక్రవారం పోలీసులు అడ్డుకున్నారు.   దీంతో వారు ఎర్రగుంట్లలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జమ్మలమడుగు ఎమ్మెల్యే సి ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ…అయ్యే పనులు చెప్పి, ప్రజలకు సేవ చేస్తే సంతోషిస్తాం.. జూలైలో 35 టీఎంసీల నీరు గండికోట, మైలవరం రిజర్వాయర్లులలో నిల్వ చేయగల్గితే పదవికి రాజీనామ చేస్తానని సవాల్ విసిరారు. 2016 జూలైకి పూర్తి స్థాయిలో 35 టిఎంసీలు నీరు నిల్వ చేస్తే పదవికే కాదు రాజకీయాలకు సైతం […]పూర్తి వివరాలు ...

    రాజకీయాలు

    నేడు జిల్లాకు ముఖ్యమంత్రి

    కడప: సాగునీటి ప్రాజెక్టులపైన అఖిలపక్షం ప్రాజెక్టుల పరిశీలన చేస్తున్న నేపధ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ రోజు (శుక్రవారం) జిల్లా పర్యటనకు వస్తున్నారు. కర్నూలు జిల్లా నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్న ఆయన గాలేరు – నగరి సుజల స్రవంతి కాల్వలను వాయుమార్గంలోపరిశీలించనున్నారు. మధ్యాహ్నం గండికోట జలాశయం సమీపంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అనంతరం నీటిపారుదలశాఖ ఇంజినీర్లతో జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టులపై సమీక్ష జరిపి, రైతులతో ముఖాముఖిలో మాట్లాడనున్నారు. రాష్ట్ర రాజధానిగా విజయవాడను ప్రకటించిన సమయంలో జిల్లాలో […]పూర్తి వివరాలు ...