కడపలో ఐటీ పరిశ్రమను ఏర్పాటు చేసి ఐటీహబ్గా మార్చడంతో పాటు స్మార్ట్సిటీగా కడపను తయారు చేస్తానని తెదేపా అధినేత చంద్రబాబు పేర్కొన్నారు. సోమవారం సాయంత్రం మున్సిపల్ గ్రౌండ్లో జరిగిన ప్రజాగర్జన లో బాబు మాట్లాడుతూ జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందిస్తానన్నారు. హైదరాబాద్ను తలదన్నేలా కడపను అభివృద్ధి చేసి హైటెక్సిటీని నిర్మిస్తామన్నారు. ఇక్కడ చదువుకున్న వారికి కడపలోనే ఉద్యోగాలు ఇచ్చేలా చేస్తానన్నారు. ఎందరో మహానీయులు జన్మించిన గడ్డ కడప, ఇలాంటి తులసి వనంలో […]పూర్తి వివరాలు ...
Tags :కడప
లెజెండ్ సినిమా విజయ యాత్రలో భాగంగా బాలయ్య, చిత్ర యూనిట్ తో కలిసి గురువారం కడపకు వచ్చారు. సాయంత్రం 4 గంటలకు ఆయన రవి థియేటర్ వద్దకు రాగానే అభిమానులు ఈలలు, కేకలు వస్తూ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన అభిమానులనుద్దేశించి మాట్లాడారు. బాలయ్య కోసం ప్రత్యేక కథను రూపొందించి సినిమాను విడుదల చేసినట్లు దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు.థియేటర్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై బాలయ్య ప్రసంగిస్తున్నంత సేపు అభిమానుల ఈలలు, కేకలతో థియేటర్ ప్రతిధ్వనించింది. […]పూర్తి వివరాలు ...
తెదేపా అధినేత చంద్రబాబు ప్రజాగర్జన సభ కోసం 7న జిల్లాకు రానున్నారు. ఈ మేరకు చంద్రబాబు పర్యటన వివరాలు జిల్లా నాయకత్వానికి అధిష్ఠానం సమాచారం అందించింది. గతంలో మార్చి 27న నిర్వహించాలని ముందుగా భావించినా వాయిదా వేశారు. చంద్రబాబునాయుడు ప్రజాగర్జనను కడపలో ఏ మైదానంలో నిర్వహించాలి అనే అంశాన్ని జిల్లా కేంద్రంలోని నేతలు పరిశీలిస్తున్నారు. జిల్లాలో పార్టీ వ్యవహారాలు చూస్తున్న రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ కూడా చంద్రబాబు పర్యటనపై జిల్లా నేతలతో మాట్లాడినట్లు సమాచారం. ప్రజాగర్జనకు భారీగా […]పూర్తి వివరాలు ...
సినీనటుడు నందమూరి బాలకృష్ణ 3వ తేదీన కడపకు రానున్నట్లు ఆయన అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు పీరయ్య, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్దన్రెడ్డి తెలిపారు. ‘లెజెండ్’ చిత్ర విజయవంతమైన నేపథ్యంలో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను పెద్దదర్గాను సందర్శిస్తారని వివరించారు. చిత్రం ప్రదర్శించే రవి ధియేటర్ను సైతం సందర్శిస్తారని తెలిపారు. అనంతరం ఆయన అహోబిలానికి వెళతారని వివరించారు.పూర్తి వివరాలు ...
కడప జిల్లాలో నేడు నగర పాలకం, పురపాలకంలో ఎన్నికల జరగనున్నాయి. కడప నగర పాలకంలో 50 డివిజన్లలో 311 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ తరపున 47 మంది, వైకాపా తరపున 50 మంది, సిపియం తరపున 12 మంది, బిజెపి తరపున 7మంది, సిపిఐ తరపున ఇరువురు, కాంగ్రెస్ తరపున 8 మంది, ఎంఐఎం, బిఎస్పి, లోక్సత్తా, స్వతంత్ర అభ్యర్థులను కలుపుకొని 185 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. కడప నగర పాలకంలో […]పూర్తి వివరాలు ...
ఇటీవలే కాంగ్రెస్ నుండి తరిగి తెలుగుదేశంలో చేరిన కందుల రాజమోహన్రెడ్డి కడప లోక్సభ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే తెదేపా అధినేత చంద్రబాబును కలిసి ఈ విషయమై విన్నవించినట్లు ఆయన తెలిపారు. కడపలోని తన ఇంట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో మంచి నాయకుడు అవసరమన్నారు. బాబు సిఎం అయితే రాష్ట్రాభివృద్ధికి మరిన్ని నిధులు తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. […]పూర్తి వివరాలు ...
తెదేపా అధినేత చంద్రబాబు పాలనలో ప్రజలు ఇక్కట్లకు గురయ్యారని వైకాపా గౌరవాధ్యక్షురాలు విజయమ్మ గుర్తు చేశారు. నాటి పాలనలో విసిగిపోయే వైఎస్కు అధికారం అప్పగించి.. ఎన్నో మేళ్లు పొందారని ఆమె కడపలో గురువారం నిర్వహించిన ఎన్నికల ప్రచార కార్యక్రమాల్లో వివరించారు. వివిధ కూడళ్లలో ఆమె రోడ్షోలు నిర్వహించారు. బిల్టప్, రామకృష్ణ పాఠశాల కూడలి, చెన్నూరు బస్టాండు, కృష్ణ చిత్రమందిరం, అప్సర కూడలి, ఆలంఖాన్పల్లెలో కార్యక్రమం కొనసాగించారు. ఆయా ప్రాంతాల్లో ఆమె చంద్రబాబుపై గురిపెట్టి ప్రసంగించారు. తెదేపా వ్యవస్థాపకుడు […]పూర్తి వివరాలు ...
గాలిలో తేమ శాతం క్రమేపీ తగ్గుతుండడంతో జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రత పెరుగుతూ వస్తోంది. శనివారం కడపలో 40 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ రోజు గరిష్ట ఉష్ణోగ్రత 41 డిగ్రీలుగా నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ నివేదికలు తెలియచేస్తున్నాయి. మార్చి ఒకటవ తేదీ నుండి జిల్లావ్యాప్తంగా క్రమేపీ ఉష్ణోగ్రతలు పెరుగుతూ వస్తున్నాయి. మార్చిర్చి ౩1వ తేదీ నాటికి ఉష్ణోగ్రత గరిష్టంగా 43 డిగ్రీలకు చేరే అవకాశం ఉంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా జిల్లా వ్యాప్తంగా ఎండలు భగ్గుమంటున్నాయి. ఉక్కపోత […]పూర్తి వివరాలు ...
అది కడప పట్టణానికి ఒకప్పుడు ప్రాణాధారం. కడప ప్రజలకు తియ్యని నీరు అందించే అపురూపమై’నది’. పాలకొండలలోని పెద్ద అగాడి ప్రాంతంలో నీటి బుగ్గలుగా ప్రారంభమై సెలయేరుగా మారి అనేక ప్రాంతాల వారికి దోవలో నీరు ఇస్తూ, చెరువులను నింపుతూ పంటలకు ప్రాణ ధారమై విలసిల్లిన అందాలనది. 500 సంవత్సరాల పూర్వము నుంచి సుమారు 50 సంవత్సరాల క్రితం వరకు ఈ నీటి అందాలను చూడటానికి అనేక మంది ఈ ప్రాంతాలకు వచ్చేవారుట. ఎప్పుడూ వరదలతో, ఇసుక దిన్నెలతో […]పూర్తి వివరాలు ...