Tags :ఇడుపులపాయ

రాయలసీమ

జగన్ పాదయాత్ర మొదలయింది…

కడప ఉక్కు పరిశ్రమ ఏమైంది? పల్లెల్లో పచ్చ మాఫియాలు రాజ్యమేలుతున్నాయి రాజధాని నిర్మాణంపై ప్రభుత్వానికి స్పష్టత లేదు 50 ఏళ్లకే ఉద్యోగులను ఇంటికి పంపేందుకు కుట్ర బహిరంగ సభలో జగన్ ఉద్వేగభరిత ప్రసంగం తొలిరోజు 8.2 కి.మీల నడక కడప : అనుకున్నట్లుగానే భారీ సందోహం మధ్య విపక్ష నేత వైఎస్ జగన్ పాదయాత్ర (ప్రజా సంకల్ప యాత్ర) ఈ రోజు ఇడుపులపాయ నుంచి ప్రారంభం అయింది. యాత్ర ప్రారంభానికి ముందర వైఎస్ సమాధిని కుటుంబ సభ్యులతో కలిసి […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం ప్రజా ప్రతినిధులు

దైవత్వాన్ని నింపుకున్న మానవుడు వైఎస్సార్

డాక్టర్ వైఎస్సార్ (వైఎస్ రాజశేఖరరెడ్డి) ను నేను చూసింది కేవలం నాలుగు సార్లు. ఒంగోలుకు ఇందిరా గాంధీ వచ్చినపుడు ఆ సభలో తొలిసారి చూసాను. ఆ తరువాత డాక్టర్ సి నారాయణరెడ్డి గారి మనుమరాలు వివాహ వేడుకలో చూసాను. మరో రెండు సందర్భాల్లో రెండు సార్లు. ప్రత్యక్షంగా మాట్లాడలేదు . దురదృష్టం ఏమిటంటే 2004 వరకు ఆయన పట్ల నాకు అసలు సదభిప్రాయమే లేదు. చంద్రబాబు గొప్ప సంస్కరణవాది అని, ఆయన చాలా మంచి పాలనాదక్షుడు అని […]పూర్తి వివరాలు ...

చరిత్ర ప్రసిద్ధులు

వైఎస్ హయాంలో కడపకు దక్కినవి

వైఎస్ హయాంలో కడప అభివృద్ధి వైఎస్‌గా చిరపరిచితుడైన కడప జిల్లాకు చెందిన దివంగత యెడుగూరి సందింటి రాజశేఖరరెడ్డి గారు 14/05/2004 నుండి 02/09/2009 వరకు (సుమారుగా 5 సంవత్సరాల నాలుగు నెలల పాటు) అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు. విధి నిర్వహణలో ఉండగానే అసువులు బాసిన వైఎస్ తన అయిదేళ్ళ పరిపాలనా కాలంలో కడప జిల్లాకు మంజూరు చేసిన/చేయించిన కొన్ని అభివృద్ది పనులు ఇవే… విద్యారంగం: యోగివేమన విశ్వవిద్యాలయం సిపిబ్రౌన్ భాషాపరిశోధనా కేంద్రానికి ఏటా ౩౦ లక్షల రూపాయల […]పూర్తి వివరాలు ...

వార్తలు

ట్రిపుల్ ఐటీ విద్యార్థులు రోడ్డెక్కినారు

వేంపల్లె : సోమావారం ఇడుపులపాయలోని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు తమ సమస్యల పరిష్కారం కోసం రోడ్డెక్కారు. తమ సమస్యలను పరిష్కరించేవరకు ఆందోళనను విరమించేదిలేదని మధ్యాహ్న భోజనం చేయకుండా భీష్మించుకున్నారు. కాగితాలకే పరిమితమవుతున్నాయి కానీ.. సమస్యలు పరిష్కారం కావడం లేదని అధికారులను నిలదీశారు. మెస్‌లో భోజనం సరిగాలేదని.. మెనూ ప్రకారం భోజనం పెట్టడంలేదని ఎన్నిమార్లు చెప్పినా అధికారులు పట్టించుకోలేదన్నారు. ఆదివారం రాత్రి ట్రిపుల్ ఐటీలోని కెఎంకే క్యాటరింగ్‌కు చెందిన మెస్‌లో సాంబారులో కప్పలు ప్రత్యక్షమయ్యాయని విద్యార్థులు అధికారులకు స్వయంగా […]పూర్తి వివరాలు ...

పర్యాటకం

కడప జిల్లా పర్యాటక ఆకర్షణలు

కడప జిల్లాలోని వివిధ పర్యాటక ఆకర్షణలు : కోటలు: గండికోట (విశేషం : కొండకు పెన్నానది గండికొట్టిన చోట నిర్మించిన కోట. ఇక్కడ ఏర్పడిన లోయకు The Grand Canyon of India అనిపేరు), సిద్ధవటంకోట (విశేషం : మట్లిరాజుల స్థావరం, కడప జిల్లా తొలి పాలనాకేంద్రం). విహారప్రాంతాలు: గుంజన జలపాతం, గుండాలకోన, తుమ్మలబైలు, సోమశిల వెనుక జలాలు, గండికోటలోని పెన్నాలోయ, మైలవరం జలాశయం, బ్రహ్మంసాగర్ జలాశయం, ఆదినిమ్మాయపల్లె ఆనకట్ట, రైల్వేకోడూరులోని ఎర్రచందనం పార్కు, ఇడుపులపాయలోని ఎకోపార్కు, నెమళ్ళ పార్కు, కడప నగరంలోని శిల్పారామం, రాజీవ్ స్మృతివనం. పుణ్యక్షేత్రాలు: అద్వైత: పుష్పగిరి దేవాలయాలు (విశేషం: […]పూర్తి వివరాలు ...

అభిప్రాయం రాజకీయాలు

నోరెత్తని మేధావులు

1980, 90 దశకాలలో రాయలసీమ జిల్లాలలో ఎక్కడ ఓ మోస్తరు దొంగతనం జరిగినా మరుసటి నాటి దినపత్రికలలో పోలీసుల ప్రకటన ఇలా ఉండేది. ‘దొంగతనం జరిగిన తీరును చూస్తోంటే ఇది స్టూవర్టుపురం ముఠాల పని అయి ఉంటుందని పోలీసులు ప్రాధమిక విచారణలో తేలింది’ అనేది ఆ ప్రకటనల సారాంశం. సదరు వార్తలు చదివిన వారికి స్టూవర్టుపురం దొంగల వెర్రితనం ఆశ్చర్యం కలిగించేది. ఎందుకంటే ఒకప్పుడు గుంటూరు జిల్లాలో భాగంగా ఉండిన చీరాలకు దగ్గరలో ఉన్న స్టూవర్టుపురం అనే […]పూర్తి వివరాలు ...

వార్తలు

28 నుంచి అక్టోబర్‌ 6 వరకు ట్రిపుల్ ఐటికి దసరా సెలవలు

ఇడుపులపాయ: ట్రిపుల్‌ఐటి విద్యార్థులకు దసరా సెలవులు ప్రకటించారు. ఈనెల 28వ తేదీ నుంచి అక్టోబర్‌ 6వ తేదీ వరకు సెలవులు ఇవ్వడంతో శనివారం రాత్రి విద్యార్థులందరు స్వగ్రామాలకు పయనం అయ్యారు. ట్రిపుల్‌ఐటి నుంచి వివిద దూర ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడిపారు.పూర్తి వివరాలు ...

రాజకీయాలు

విపక్షనేత ఇంట్లో పోలీసు సోదాలు

ఎలాంటి వారంటూ లేకుండా వైకాపా అధ్యక్షుడు వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి గెస్ట్‌హౌస్‌లో శనివారం నెల్లూరు జిల్లాకు చెందిన పోలీసులు సోదా చేశారు. పోలీసులు అలా సోదాలు చేసింది ఆ పార్టీ జెడ్పీటీసీల కోసమట!! తమ వారు కిడ్నాపైనట్టు నెల్లూరు జిల్లాకు చెందిన ఇద్దరు జెడ్పీటీసీల తరఫున ఫిర్యాదు దాఖలైందని, అందుకోసమే ఇడుపుల పాయలో వెదికామన్నది పోలీసుల వివరణ.  ఈ నెల 5న తెదేపా వారి రభస కారణంగా నెల్లూరు జడ్పీ చైర్మన్ ఎన్నిక వాయిదా పడిన నేపధ్యంలో 8 నుంచీ […]పూర్తి వివరాలు ...

రాజకీయాలు

వైకాపా శాసనసభాపక్ష నేతగా జగన్

వైకాపా శాసనసభ పక్ష నేతగా వైఎస్ జగన్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇడుపులపాయలో ఈ రోజు (బుధవారం) జరిగిన వైకాపా శాసనసభాపక్ష సమావేశంలో పార్టీ నేతలు వైఎస్ జగన్ను వైఎస్ఆర్ సీఎల్పీ నేతగా ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి సీమాంధ్ర, తెలంగాణ నుంచి ఎన్నికైన శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు, ఇతర సీనియర్ నేతలు హాజరు అయ్యారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ…ఆనాడు విలువల కోసం తాను, అమ్మ విజయమ్మ మాత్రమే కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చామన్నారు. కొండను ఢీకొని […]పూర్తి వివరాలు ...