తిరువీధుల మెరసీ దేవదేవుడు గరిమల మించిన సింగారములతోడను ….. తిరుదండలపై నేగీ దేవుడిదె తొలునాడు సిరుల రెండవనాడు శేషుని మీద మురిపాల మూడవనాడు ముత్యాల పందిరి క్రింద పొరినాలుగవనాడు పువ్వుగోవిలలోను …….. గ్రక్కుననైదవనాడు గరుడునిమీద యెక్కెనునారవనాడు యేనుగుమీద చొక్కమై యేడవనాడు సూర్యప్రభలోనను యిక్కువదేరును గుఱ్ర మెనిమిదవనాడు ……. కనకపుటందలము కదిసి తొమ్మిదవనాడు పెనచి పదోనాడు పెండ్లిపీట యెనసి శ్రీవేంకటెశు డింతి యలమేల్మంగతో వనితల నడుమను వాయనాలమీదను….పూర్తి వివరాలు ...
Tags :అన్నమయ్య
పెదయౌబళపు కొండ పెరిగీనిదే వదలకకొలిచితే వరములిచ్చీని పదివేలశిరసుల పలునరసింహము గుదిగొన్న చేతుల గురుతైనది ఎదుటపాదాలు కన్నులెన్నైన కలిగినది యిది బ్రహ్మాండపుగుహ నిరవైనది ఘనశంఖచక్రాదుల కైదువలతోనున్నది మొనసి రాకాసి మొకములగొట్టేది కనకపుదైత్యుని కడుపుచించినది తనునమ్మిన ప్రహ్లాదుదాపును దండైనది శ్రీవనిత తొడమీద జేకొని నిలిపినది దేవతలు గొలువ గద్దెపై నున్నది శ్రీవేంకటాద్రియందుఁజెలగి భోగించేది భావించి చూచితేను పరబ్రహ్మమైనదిపూర్తి వివరాలు ...
రాయలసీమ జానపదం రాయలసీమ సాంస్కృతికంగా చాలా విలక్షణమైనది. తొలి తెలుగు శాసనాలు రాయలసీమలోనే లభించాయి. తెగల వ్యవస్థలనుండి నాగరిక జీవనానికి పరిణామం చెందే దశలో స్థానిక భాషకు ఆ నాటి స్థానిక నాయకులు రాజగౌరవం ఇచ్చారు. ఇదే సమయంలో రాయలసీమను పాలిస్తున్న శూద్రరాజులు బ్రాహ్మణుల సంస్కృత భాషను తిరస్కరించి రాజభాషగా తెలుగు భాషను పురస్కరించారు. జెైన మత ప్రచారం కోసం మత ప్రచారకులు స్థానిక భాషలను ప్రోత్సహించడమే ఇందుకు ముఖ్య కారణం. టిట్మోర్ వంటి భాషా శాస్త్రజ్ఞులు […]పూర్తి వివరాలు ...