కడప జిల్లా కథాసాహిత్యం నవల, కథానిక, నాటకం, నాటిక వంటి ఆధునిక రచన సాహిత్య ప్రక్రియల ఆవిర్భావం కడప జిల్లాలో కళింగాంధ్ర, కోస్తాంధ్ర ప్రాంతాలతో పోలిస్తే చాలా ఆలస్యంగా జరిగింది. కందుకూరి వీరేశలింగం పంతులు తొలి సాంఘిక నవల రాజశేఖర చరిత్ర (1878) వచ్చి, ఎనబై ఏళ్లు గడిచాకే, కడప జిల్లా సాహిత్యకారులు నవలా రచన ప్రయత్నాలు చేశారు. గురజాడ తొలి కథానిక దిద్దుబాటు (1910) తర్వాత ఏ యాభై ఏళ్లకో కడప జిల్లా సాహిత్య చరిత్రలో […]పూర్తి వివరాలు ...
Tags :నాటకం
మైదుకూరు మండలం యెన్.యర్రబల్లెలో ఉగాది సందర్భంగా (అదే రోజు) సోమవారం రాత్రి జరిగిన శ్రీ జనార్ధనస్వామి తిరుణాళలో ప్రదర్శించిన చెంచు (చెంచులక్ష్మి వీధిబాగవతం) నాటకం ప్రేక్షకులను అలరింపచేసింది. అలయ ధర్మకర్త పగిడి రంగయ్య దాసు ఆధ్వర్యంలో ఈ తిరుణాల , వీధి నాటక ప్రదర్శన జరిగింది. రాత్రి 10 గంటలనుండి తెల్లవారు జామున 4 గంటల దాకా జరిగిన ఈ చెంచు నాటకాన్ని వందలాది మంది ప్రేక్షకులు కదలకుండా ఆసక్తిగా తిలకించడం విశేషం. ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి, ఎరుకసాని […]పూర్తి వివరాలు ...