చక్రవేణు కథ ‘కసాయి కరువు’ రాళ్లసీమ పల్లె మీద ఎర్రటి ఎండ నిప్పులు కురిసినట్లు కురుస్తోంది. ఎందుకో నూరీడు వగపట్టినట్లు ఊరి మీద అగ్గి వాన చల్లుతున్నాడు. తూరువు కొండ మీద చెట్లు మలమల మాడి ఎండిపోయాయి. గుట్టల మీద తెల్లకనిక రాళ్ళు కొలిమిలో మండినట్లు ఎర్రగా మెరున్తున్నాయి. యుద్ధకాలంలో శత్రువుల దాడికి భయవడి ఊరొదిలి వలనపోయిన విధంగా వల్లె పల్లె అంతా. బోసిగా ఉంది. పల్లెలో ఇళ్ళ యజమనులెవ్వరూ లేరు. పసిబిడ్డలూ, వాళ్ళ తల్లులూ, మునలోళ్ళూ […]పూర్తి వివరాలు ...
కేతు విశ్వనాథరెడ్డి కథ – రెక్కలు ఆ ‘ముగ్గురూ ఖాకి దుస్తుల్లో ఉన్న ఆడపిల్లలని తెలుస్తూనే ఉంది, వాళ్ళ ఎత్తుల్ని బట్టి, కదలికల్ని బట్టీ, పోలీసు స్టేషన్ ముందు ముసలి కానిస్టేబుల్తో మాట్లాడుతూ ఆ ముగ్గురూ అటూ ఇటూ చూస్తూ నిల్చున్నారు. వాళ్ళకు దగ్గరలోనే మూడు బ్యాగులున్నాయి. మాకులాగే వాళ్ళకు కూడా ఎలక్షన్ డ్యూటీ పడినట్లుంది. మా రూటు లారీ ఆగీ ఆగగానే ఆ ముగ్గురాడపిల్లలూ బ్యాగులు పుచ్చుకొని లారీ వెనకవైపు నుల్బున్నారు. ఇరవై, ఇరవై అయిదేండ్లలోపు […]పూర్తి వివరాలు ...
ఎదురెదురు ‘‘ఎంత ధైర్యం సార్ సురేష్కు! యాభైవేల రూపాయలు పోగొట్టుకొన్నే .. లెక్కజెయ్యకుండా పేకాటకాన్నించి లెయ్యనే లెయ్యడంట… అబ్బా … ఆయప్పది గుండెకాయ కాదు సార్ – ఇనపముద్ద…’’ అన్నాడు వీరారెడ్డి.స్నానం చేసి గదిలోకొచ్చి తల తడుచుకొంటున్నాను. ‘‘ఏడీ సురేష్ .. పోయినాడా?’’ అడిగాను.‘‘ఇంగా యాడుండాడు! టైమైందంట. టిఫినన్నా చేసిపోమ్మంటే కుదరదంటాడే… వాల్ల క్లబ్బులో అయితే కోరిన టిఫిను తినొచ్చునంట. ఇక్కడి గడ్దీగాదం నేనెందుకు తింటా.. ఖర్మా? అక్కడ చికెను మటన్తో పులిభోజనం దొరుకుతాంటే.. అని ఎల్లబారి […]పూర్తి వివరాలు ...
ఈ పెద్దాయన నన్ను వెదుక్కుంతూ వచ్చి తన కథల పుస్తకం గురించి చెప్పి దీన్ని విరసమే ప్రచురించాలని, నేనే ముందుమాట రాయాలన్నప్పుడు ఆశ్చర్యపోయాను. విరసం సరే, నేను ముందుమాట రాయడం ఏమిటి సార్ అన్నా. కార్యదర్శివి కదా అన్నాడు (ఇది లాస్టియర్ మాట). మొహమాట పడుతుంటే విరసం ప్రచురణకు అర్హత ఉంటేనే చూడండి అన్నాడు. చదవడానికే చాలా రోజులు తీసుకున్నాను. రెండు మూడు కథల్లో మార్పులు సూచించాను. చాలా శ్రద్ధగా విన్నారు. కథలు రెండు మూడు సార్లు […]పూర్తి వివరాలు ...
పుస్తకం : తాతాచార్ల కథలు’, రచన: సిపి బ్రౌన్, సంపాదకత్వం: బంగోరె, ప్రచురణ : జులై 1974లో ప్రచురితం.పూర్తి వివరాలు ...
‘‘అస్సలాము అలైకుమ్.’’‘‘వా అలైకుమ్ అస్సలాం. వరహమతుల్లాహి వబరకాతహు’’ అంటూ, ఒక్కక్షణం మనిషిని ఎగాదిగా చూచి ‘‘అరే! మీరా! లోపలికి రండి భాయ్!’’ వాకిలి రెండవ రెక్కకూడా తెరిచాడు అబ్దుల్ రహమాన్.వచ్చిన వ్యక్తిని హాల్లో ఉన్న సోఫాలో కూర్చోబెట్టి గబాగబా లోపలికి పోయి భార్యతో గుసగుసలాడి తిరిగొచ్చి అతని యెదురుగా కుర్చీలోకూర్చున్నాడు నింపాదిగా. ‘‘అదికాదు ముస్తఫా భాయ్, మీరొస్తున్నట్లు ఫోన్లో ఒక్కమాట చెప్పివుంటే బస్టాండుకు కారు పంపేవాన్ని కదా! మా ఇల్లు కనుక్కోవడానికి ఎన్నితంటాలు పడ్డారో ఏమో!’’‘‘లేదు రహమాన్ […]పూర్తి వివరాలు ...
“ కడప జిల్లాలోని ప్రతి కొండకు ఒక కథ ఉంది. ప్రతివాగుకూ ఓ పాట ఉంది ” – జే. విల్కిన్సన్ మైదుకూరు సమీపంలోని ముక్కొండ కథ విల్కిన్సన్ వ్యాఖ్యకు తార్కాణంగా నిలుస్తుంది. కృతయుగంలో నెలకు మూడుపదున్ల వానపడుతున్న కాలంలో ప్రస్తుతం ముక్కొండ ఉన్న ప్రాంతంలో కాపులైన ఇద్దరు అన్నదమ్ములు వ్యవసాయం చేసుకుంటూ బాగా పంటలు పండించే వారు. ఒక సారి జొన్న పంట అద్భుతంగా విరగ పండింది. కంకులు తిప్పి ఎత్తైన రాశులు పోశారు. జొన్నలను […]పూర్తి వివరాలు ...
నీలవేణి కథల సంపుటి కడప జిల్లాలో మొదటి కథా రచయితగా భారతం నాదమునిరాజు గుర్తించబడ్డారు. 1930లో జన్మించిన నాదమునిరాజు గారి జన్మస్థలం వేంపల్లి.రాజు గారు 1956లో రాసిన ‘నీలవేణి’ కడప జిల్లా నుండి వెలువడిన మొదటి కథగా సాహితీకారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాదమునిరాజు గారి కథలను వారి మొదటి కథ ‘నీలవేణి’ పేరుతో ఒక సంపుటిగా వెలువరించినారు.పూర్తి వివరాలు ...
సావిత్రమ్మ కొడుకూ, కూతురూ- ఇద్దరికీ ఒకే రోజు ముహూర్తాలు నిర్ణయించి ఘనంగా పెండ్లి జరిపించింది. ఆ పెండ్లి గురించి చుట్టుపక్కల నాలుగు గ్రామాల వాళ్లూ ఘనంగా చెప్పుకున్నారు. ఇంతవరకూ ఆవైపు అంత గొప్పగా పెండ్లి జరిపినవారే లేరని కీర్తించారు. ‘ఆహా…దేశం కాని దేశానికి పోయి, సిగ్గూ శరమూ లేకుండా అయి పుట్టినోడి కిందల్లా కొంగు పరిచి సంపాయిచ్చి, తగుదునమ్మా అంటూ ముదరపెట్టి ముదరపెట్టి ముసిలోళ్లను చేసినాక బిడ్డలకు పెండ్లి చేసింది. అదీ గొప్పేనా,’ అని పెదవి విరచి […]పూర్తి వివరాలు ...